India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే ఎద్దులంటే రైతన్నలకు ఎంతో ప్రేమ. వాటిని కుటుంబసభ్యుల్లాగే భావిస్తారు. అవి చనిపోతే తల్లడిల్లిపోతారు. అన్నమయ్య(D) నరసాపురానికి చెందిన పెద్దప్పయ్యకు ఉన్న జోడెద్దులు 15ఏళ్ల కిందట చనిపోయాయి. వాటికి అంత్యక్రియలు చేసి, అక్కడే గుడి కట్టి విగ్రహాలను ఏర్పాటుచేశారు. రోజూ పూజలతోపాటు ఏటా అన్నదానమూ చేసేవారు. ఆయన చనిపోయినా కుటుంబీకులు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
AP: గ్రామ, వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో కేంద్రంలో 10-14 మంది ఉండగా, వారిలో నలుగురినే ఉంచి మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. తొలుత 660 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో AEలుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. దశలవారీగా అన్ని శాఖల్లోనూ సర్దుబాటు చేయనుంది. ప్రస్తుతం 15వేల సచివాలయాల్లో 1.26లక్షల మంది పనిచేస్తున్నారు.
TG: కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్ర పరిసరాలు వంటి కారణాలతో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు నిత్యం అనారోగ్యానికి గురవుతుంటారు. దీంతో SC, ST, BC, మైనార్టీ హాస్టళ్లు, KGBVల్లో వరంగల్ కలెక్టర్ సత్యశారద ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ సమస్యలను చీటీపై రాసి అందులో వేయాలి. తనిఖీలు, సందర్శనల సందర్భాల్లో కలెక్టర్ స్వయంగా పెట్టె తెరిచి చీటీలు పరిశీలిస్తారు. తాళాలూ కలెక్టర్ వద్దే ఉంటాయి.
బంగ్లాలో ఆదివారం రాత్రి మళ్లీ అల్లర్లు చెలరేగాయి. సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద వేలమంది విద్యార్థులు, అన్సార్ సభ్యులు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైనికులు, పోలీసులు సౌండ్ గ్రెనేడ్లను ప్రయోగించినా గొడవలు ఆగలేదు. అన్సార్ సభ్యుల్లో కొందరు బయటకు వెళ్లిపోగా మరికొందరు చిక్కుకుపోయారు. కొత్త ప్రభుత్వం తమపై కుట్ర చేస్తోందన్న స్టూడెంట్స్ సెక్రటేరియట్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
TG: డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నా ఇప్పటివరకు మరణాలేమీ లేవని ప్రభుత్వం బుకాయించడం దారుణమని మాజీ మంత్రి KTR మండిపడ్డారు. ‘నిన్న ఐదుగురు, ఇవాళ ముగ్గురు చనిపోయారని వార్తా కథనాలు స్పష్టంగా పేర్కొన్నాయి. డాటాను ఎందుకు దాస్తున్నారు? ఆసుపత్రుల్లో మందులు లేవు. ఒక్క బెడ్ను 3-4 పేషెంట్లు షేర్ చేసుకుంటున్నారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణించి, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే సమయం వచ్చింది’ అని డిమాండ్ చేశారు.
దేశ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ PM మోదీ ట్వీట్ చేశారు. ఏ విషయంలోనైనా స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం సాధించవచ్చని AP CM చంద్రబాబు అన్నారు. శ్రీకృష్ణుడి కృపాకటాక్షం రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మానవ జీవితంలో ‘గీత’ బోధనలు ప్రభావశీలమైనవని, ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని TG CM రేవంత్ పేర్కొన్నారు.
తన పోరాటం ముగియలేదని రెజ్లర్ వినేశ్ ఫొగట్ అన్నారు. సర్వ్ఖాప్ పంచాయతీ స్వర్ణ పతకంతో సన్మానించాక ఆమె మాట్లాడారు. ‘మన అమ్మాయిల గౌరవం కోసం అసలు పోరు ఇప్పుడే మొదలైంది. మేం ఢిల్లీలో కూర్చున్నప్పుడూ ఇదే చెప్పాం’ అని చెప్పారు. పారిస్ ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై అవ్వగానే బాధపడ్డానని ఆమె అన్నారు. దేశానికి తిరిగొచ్చాక ఇక్కడి ప్రేమ, మద్దతు చూశాక అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఈనెల 28తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఏదైనా డిగ్రీ చేసి, 1-8-2024 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175, ఇతరులు రూ.850 చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపికలుంటాయి. ప్రిలిమ్స్ అక్టోబర్/నవంబర్లో జరిగే అవకాశం ఉంది.
వెబ్సైట్: <
TG: పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ RTC కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయడం, 2 PRCలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 10న డిమాండ్స్ డే, అక్టోబర్ 1న HYD ఇందిరాపార్క్ వద్ద సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కృష్ణుడంటే నల్లనివాడు. కనబడకుండానే సృష్టి అంతయూ వ్యాపించినవాడు. అవగాహనకు మించినవాడు. శ్రీ అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి, కాళి. శ్రీకి అతడే ఆధారము. కృష్ణుడు లేని శ్రీ లేదు. అంటే శ్రీ ఆయన వ్యక్త రూపమే. సనాతనుడు అంటే సృష్టి ఉన్నా లేకున్నా ఉండేవాడని అర్థం. సమస్త సృష్టి, దేవతలు, జీవులు ఆయన నుంచే ఉద్భవించి మళ్లీ ఆయన్నే చేరతాయి. కాలానికి పూర్వమే ఉన్నాడాయన. అందుకే ఆయన శ్రీకృష్ణ: సనాతన:
Sorry, no posts matched your criteria.