India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయవాడలో <<13895234>>‘ఎంపాక్స్’<<>> అంటూ వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి సుహాసిని స్పందించారు. ఇప్పటివరకు జిల్లాలో ఎవరిలోనూ ఎంపాక్స్ లక్షణాలు గుర్తించలేదని ఆమె స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విజయవాడ ప్రభుత్వ పీడియాట్రిక్స్ HOD అనిల్ కుమార్ వెల్లడించారు. కాగా దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని ఓ చిన్నారికి ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
AP: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంతో మంది విమర్శించారని, కానీ ఆయన పాలిటిక్స్లో రాణిస్తారని తాను నమ్మానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది, చిన్న వయసులోనే మంత్రిని చేసింది ఆయనేనని గుర్తు చేసుకున్నారు. గుంటూరులోని NTR కల్చరల్ అసోసియేషన్ వేడుకలో ఆయన మాట్లాడారు. NTRకు మహిళలంటే గౌరవమని, అందుకే ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారని కొనియాడారు.
కోల్కతాలో వైద్యురాలి హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు పాలీగ్రాఫ్ పరీక్షలు పూర్తయ్యాయి. జైల్లోనే అతనికి లై డిటెక్టర్ టెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులకు సీబీఐ ఆఫీసులో పరీక్షలు నిర్వహించారు. నిందితులు ఏం చెప్పారనేది గోప్యంగా ఉంచారు. RG కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న మరో ఐదుగురికి నిన్న లై డిటెక్టర్ టెస్టులు చేశారు.
AP: మాజీ MLA డేవిడ్ రాజు(66) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. 1999లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓడిన ఆయన 2014లో వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండేళ్లకే టీడీపీలో చేరారు. పార్టీలో గొడవలతో మళ్లీ వైసీపీ గూటికి చేరినా క్రియాశీలకంగా పనిచేయలేదు.
పండితుల ప్రకారం.. చిన్ని కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. కృష్ణుడికి ఇష్టమైన వెన్న, పాలతో చేసిన క్షీరాన్నం, అటుకుల పరమాన్నం నివేదనగా సమర్పించాలి. బాలకృష్ణుడిని అష్టోత్తర శతనామావళితో పూజించిన వారికి అభిశతి సిద్ధిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది. కృష్ణుడిని 1,008 తులసి దళాలతో అర్చిస్తే కోరికలు నెరవేరుతాయి.
AP: పరిశ్రమల్లో ప్రమాదాలకు కారణమవుతున్న యజమానులను ఎందుకు జైలుకు పంపట్లేదని రిటైర్డ్ IAS ఈఏఎస్ శర్మ ప్రశ్నించారు. అచ్యుతాపురం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రమాదం జరిగిందన్న CBN వ్యాఖ్యలను తప్పుపట్టారు. 2014-19 మధ్య 24 ప్రమాదాల్లో 21 మంది చనిపోయారని గుర్తుచేశారు.
బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఓ యువతి కౌన్ బనేగా కరోడ్పతిలో రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకున్నారు. రాజస్థాన్కు చెందిన నరేషి మీనా 2018లో SI పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో చికిత్స కోసం ప్రతి రూపాయిని కూడబెడుతూ వచ్చారు. తాజాగా KBCలో రూ.50 లక్షలు గెలుచుకున్నారు. పైగా చికిత్సకు బాధ్యత తీసుకుంటానని హోస్ట్ అమితాబ్ హామీ ఇచ్చారు.
✒ గ్రామాల్లో నివసిస్తూ, 18-50ఏళ్ల వయసు, వార్షికాదాయం ₹లక్షలోపు ఉండి, డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు.
✒ ఆసక్తి ఉన్న రంగంపై శిక్షణ ఇచ్చి, వడ్డీ లేకుండా ₹1-5లక్షలు రుణం మంజూరుచేస్తారు.
✒ ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, SHG కార్డు అవసరం. అన్ని రాష్ట్రాలవారూ అప్లై చేసుకోవచ్చు.
✒ అంగన్వాడీలు, మహిళా అభివృద్ధి శాఖ ఆఫీసుల్లో వివరాలు తెలుసుకోవచ్చు.
✒ <
AP: టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ కృషి చేస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. విద్యాశాఖను తీసుకోవద్దని ఆయనకు చాలా మంది సూచించారని, అయితే ఛాలెంజింగ్గా ఆయన పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో రెస్పాన్స్ లేదని టీచర్లకు అనిపించవచ్చని, కానీ రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు అన్నివిధాలా గౌరవం ఇస్తారని పేర్కొన్నారు.
N-కన్వెన్షన్పై వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని నాగార్జున చెప్పారు. ‘పట్టా డాక్యుమెంటెడ్ భూమిలోనే కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఒక్క సెంటూ ఆక్రమించలేదు. చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు 2014 FEB 24న తీర్పు ఇచ్చింది. నిర్మాణ చట్టబద్ధతపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించాం. తీర్పుకు కట్టుబడి ఉంటా. అప్పటివరకు అవాస్తవాలు నమ్మొద్దని అభిమానులను కోరుతున్నా’ అని Xలో పోస్టు చేశారు.
Sorry, no posts matched your criteria.