India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సీఎం రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చకుండా హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ‘నిత్యం ఏదో ఒక సంచలనం చేయడమే రేవంత్ పని. సీఎం సోదరుడు, పొంగులేటిపై అక్రమ నిర్మాణాల ఆరోపణలున్నాయి. వాటిని కూల్చగలరా? సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హైడ్రా హైప్’ అని ధ్వజమెత్తారు.
టీమ్ఇండియా సూపర్ హిట్ పెయిర్గా పేరొందిన రోహిత్, శిఖర్ ధవన్ ఓపెనర్లుగా అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా గబ్బర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని రోహిత్ శర్మ గుర్తుచేసుకున్నారు. ‘రూమ్ని షేర్ చేసుకునే దగ్గర నుంచి ఫీల్డ్లో లైఫ్టైమ్ మెమొరీలను పంచుకున్నాం. మీరు ఎల్లప్పుడూ నా పనిని మరోవైపు నుంచి సులభతరం చేశారు’ అని ట్వీట్ చేశారు. థాంక్యూ బ్రో అని ధవన్ రిప్లై ఇచ్చారు.
జనగణన విషయంలో కేంద్రానికి క్లారిటీ లేదని కాంగ్రెస్ విమర్శించింది. సముచితమైన సమయంలో జనగణన నిర్వహిస్తామని, విధివిధానాలు నిర్ణయించాక ప్రకటన చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ ‘తనను తాను అపర చాణక్యుడిగా చెప్పుకొనే అమిత్ షా కీలక రహస్యాన్ని బహిర్గతం చేశారు. వావ్, మూడేళ్లుగా వాయిదా పడుతున్న జనగణనపై ఎంతటి క్లారిటీ’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఆగస్టు 25 2007. హైదరాబాద్ ఉలిక్కిపడిన రోజు. సాయంత్రం సరదాగా గడిపేందుకు వచ్చిన అమాయకులు బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. సా.7.30 గం.కు లుంబినీ పార్కులో లేజర్ షో చూస్తుండగా బాంబు పేలి 9 మంది చనిపోయారు. 10 ని. గ్యాప్లో గోకుల్ చాట్ వద్ద మరో బాంబు పేలి 33 మంది చనిపోయారు. ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరికి మరణశిక్ష పడింది. గతేడాది మరో నలుగురికి పదేళ్ల జైలుశిక్ష విధించారు.
దేశంలో విక్రయించే ల్యాప్టాప్లు, కంప్యూటర్ల కీబోర్డుపై US డాలర్ గుర్తును తొలగించి రూపాయి గుర్తును పెట్టాలని ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ డిమాండ్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో రూపాయి గుర్తును ఉపయోగించకుండా ఇప్పటికీ INR అని ఎందుకు రాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలో అమ్మే వస్తువుల్లో డాలర్ సింబల్ స్థానంలో ఇప్పటికీ రూపాయి గుర్తును పొందుపరచకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
TG: చెరువుల ఆక్రమణదారులను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ‘అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు. ప్రభుత్వంలోనూ ఉండొచ్చు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా కూల్చివేస్తాం. చెరువులు మన జీవనాధారం, సంస్కృతి. వాటిని కాపాడటం ఎంతో కీలకం. భవిష్యత్ తరాలకు వాటిని అందించాలి’ అని సీఎం ఆకాంక్షించారు.
బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన హారర్ కామెడీ సినిమా ‘ముంజ్య’ హాట్స్టార్లో విడుదలైంది. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ మూవీ రూ.135 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘బడ్డీ’ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.
హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో హరియాణా, జమ్మూకశ్మీర్లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఎక్కడ తప్పులు జరిగాయన్నదానిపై కమిటీ చర్చించనుంది. తప్పులను సరిదిద్దుకుంటూ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేయనుంది.
TG: ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది ప్రజలపై ప్రకోపిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ‘చెన్నై, వయనాడ్లో ప్రకృతి ప్రకోపం కళ్లారా చూశాం. ఈ కూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదు. భవిష్యత్ తరాలకు సరస్సులు, నదులు, చెరువులను అందించాలనేది లక్ష్యం. కొందరు శ్రీమంతులు చెరువుల్లో ఫాంహౌస్లు నిర్మించారు. వాటి డ్రైనేజీలను గండిపేటలో కలిపారు. వాళ్ల విలాసం కోసం వ్యర్థాలు చెరువులో కలుపుతారా?’ అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్లో చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి వాటికి హైడ్రా ద్వారా విముక్తి కల్పిస్తున్నామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYDలో హరేకృష్ణ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘చెరువులను ఆక్రమించినవారిని వదలం. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గం. అక్రమ నిర్మాణాలు కూలుస్తాం. కబ్జాదారులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు. చెరువుల కోసం వారి భరతం పడతాం’ అని CM స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.