News November 23, 2024

బ్యాంకు అకౌంట్లలోకి బోనస్ నగదు

image

TG: సన్నవడ్లను మార్కెట్లో ప్రభుత్వానికి విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ నగదు జమవుతోంది. క్వింటాకు రూ.500 చొప్పున బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమైనట్లు ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో పలువురు రైతుల ఫోన్లకు SMSలు వచ్చాయి. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లతో మెసేజ్లు వస్తున్నట్లు మరికొందరు రైతులు చెబుతున్నారు. సన్న వడ్లను దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వానికే అమ్మాలని అధికారులు కోరుతున్నారు.

News November 23, 2024

ఫలితాలకు ముందే క్యాంప్ కసరత్తులు

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల కౌంటింగ్ మొదలవక ముందే అక్కడ క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. తాము గెలుస్తామని భావిస్తున్న మహా వికాస్ అఘాడీ గెలిచిన నేతలు చేజారకుండా శిబిరాలకు తరలించే కసరత్తు చేస్తోంది. తమ నేతలను ముంబైలోని క్యాంపుకు పంపుతామని శివసేన నేత సంజయ్ రౌత్ నిన్న ప్రకటించారు. అటు కూటమిలోని మిగతా పార్టీలు తెలంగాణ లేదా కర్ణాటకలో గెలిచిన అభ్యర్థులను దాచిపెట్టే అవకాశముందని సమాచారం.

News November 23, 2024

నేటి నుంచి SMAT-2024 టీ20 టోర్నీ

image

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 38 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. హార్దిక్, శ్రేయస్, శాంసన్, రుతురాజ్ వంటి పలువురు స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ జట్టు గ్రూప్-Aలో, ఆంధ్రప్రదేశ్ టీమ్ గ్రూప్-Eలో ఉన్నాయి. జియో సినిమా యాప్/వెబ్‌సైట్‌లో లైవ్ చూడవచ్చు. ఉ.9 గంటల నుంచి మ్యాచులు జరుగుతాయి. షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 23, 2024

26 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 26 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసింది. ఈ లిస్టులో జగిత్యాల, రామగుండం, ధర్మపురి, వనపర్తి, బోధన్, డోర్నకల్, చొప్పదండి, PDPL, వైరా, కోదాడ, కొత్తగూడెం, కల్వకుర్తి, సత్తుపల్లి, నకిరేకల్, నాగార్జున సాగర్, తాండూరు, నారాయణ్ పేట, NZB రూరల్, చేవెళ్ల, జుక్కల్, మక్తల్, వికారాబాద్, గద్వాల, మెదక్, మేడ్చల్, ఆర్మూరు నియోజకవర్గాలు ఉన్నాయి.

News November 23, 2024

ఝార్ఖండ్ ఎన్నికలు.. టార్గెట్ 41

image

ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా మేజిక్ ఫిగర్ 41. ఇక్కడ NDA, INDIA కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. NDA కూటమిలోని BJP-68, AJSU-10, JDU-2, లోక్ జన్‌శక్తి(రామ్ విలాస్ పాశ్వాన్) ఒక చోట పోటీ చేస్తున్నాయి. INDIA కూటమిలోని JMM-42, INC-30, RJD-6, CPI(ML)-3 చోట్ల బరిలో నిలిచాయి. రాష్ట్రంలో ప్రస్తుతం JMM అధికారంలో ఉండగా ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ సర్వేలు NDAకు మొగ్గు చూపాయి.

News November 23, 2024

నేడే బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుందని IMD తెలిపింది. తర్వాత తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని పేర్కొంది. ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో చలి తీవ్రత పెరిగింది.

News November 23, 2024

జానీ మాస్టర్‌కు ఊరట

image

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన జానీకి అక్టోబర్ 24న హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News November 23, 2024

విద్యాసంస్థలకు హెచ్చరిక.. అలా చేస్తే రూ.15లక్షల ఫైన్!

image

AP: రూల్స్ అతిక్రమించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. స్టూడెంట్స్‌కు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోతే, అధిక ఫీజులు వసూలు చేస్తే రూ.15లక్షల ఫైన్ విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుందని గుర్తుచేసింది. ఏవైనా సమస్యలుంటే 8712627318, 08645 274445 నంబర్లలో ఫిర్యాదు చేయొచ్చని విద్యార్థులకు సూచించింది.

News November 23, 2024

మహారాష్ట్ర మేజిక్ ఫిగర్ ఎంతంటే?

image

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ 145. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మహాయుతి కూటమిలో భాగంగా BJP-148, శివసేన షిండే వర్గం-80, అజిత్ పవార్ NCP వర్గం-53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్-103, శివసేన UBT-89, NCP SP-87 చోట్ల బరిలో నిలిచాయి. ప్రస్తుతం MHలో మహాయుతి అధికారంలో ఉంది.

News November 23, 2024

11 నెలల్లో 53వేలకు పైగా ఉద్యోగాలు: ప్రభుత్వం

image

TG: 11 నెలల్లో 53వేలకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో విద్యాశాఖకు చెందినవే అత్యధికమని తెలిపింది. గురుకులాలు, స్కూళ్లలో 18,310 టీచింగ్ పోస్టులు, పోలీస్ శాఖలో 16,067 ఉద్యోగాలు, 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేశామని పేర్కొంది. ఇటీవల పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని, ప్రస్తుతం వివిధ విభాగాల్లో 5,378 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.