News November 21, 2024

BGT టెస్ట్: రేపు ఆడే జట్టు ఇదేనా?

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి పెర్త్‌లో తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఎవరెవరుంటారన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ప్రాక్టీస్ సెషన్లను బట్టి తుది జట్టును ఆస్ట్రేలియా మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాటి ప్రకారం.. రేపటి తుది జట్టు: జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, కోహ్లీ, పంత్, ధ్రువ్ జురెల్, నితీశ్ , రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్

News November 21, 2024

అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?: కవిత

image

TG: అదానీపై అమెరికాలో కేసు నమోదవడంపై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??’ అని ట్వీట్ చేశారు.

News November 21, 2024

భూమిని ఆక్రమిస్తే బయట తిరగలేరు: సీఎం చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూఆక్రమణలకు పాల్పడ్డారని CM చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దు చేశాం కానీ జరిగిన అవకతవకలను ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఇకపై ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తాం. వాళ్లు ఇక బయట తిరగలేరు’ అని హెచ్చరించారు.

News November 21, 2024

ఉద్యోగులకు భారీ షాకివ్వనున్న ఓలా ఎలక్ట్రిక్!

image

ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాకివ్వనుందని సమాచారం. 500 మందికి పైగా తొలగించనుందని తెలుస్తోంది. మార్జిన్లను మెరుగుపర్చుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. అందుకే రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ఆరంభించినట్టు తెలిసింది. 2022, సెప్టెంబర్, జులైలోనూ కంపెనీ రెండుసార్లు ఇలాగే చేసింది. యూజుడ్ కార్స్, క్లౌడ్ కిచెన్, గ్రాసరీ డెలివరీ యూనిట్లను మూసేసి 1000 మందిని ఇంటికి పంపించేసింది.

News November 21, 2024

హోంమంత్రికే రక్షణ లేకపోతే ఎలా?: సీఎం చంద్రబాబు

image

AP: తల్లి, చెల్లిని SMలో అసభ్యంగా దూషించినా గత సీఎం పట్టించుకోలేదని CM చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికీ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రస్తుతం హోంమంత్రి, డిప్యూటీ సీఎంపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. దళిత మహిళ అయిన హోంమంత్రికే రక్షణ లేకుండా పోతే ఎవరికుంటుంది? కొందరికి డీజీపీ, మంత్రులైనా లెక్కలేకుండా పోయింది. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.

News November 21, 2024

ఫస్ట్ టెస్టుకు అంపైర్లు వీళ్లే

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీ వ్యవహరిస్తారు. థర్డ్ అంపైర్‌గా ఇల్లింగ్‌వర్త్, ఫోర్త్ అంపైర్‌గా సామ్ నోగాజ్‌స్కీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇదిలా ఉంటే <<12115864>>కెటిల్‌బరో<<>> అంపైరింగ్ చేయనున్నారని తెలియడంతో కొందరు అభిమానులు ‘మన టీమ్ మరింత కష్టపడాల్సిందే’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

News November 21, 2024

ఏపీలో ప్రతి నేరం వెనుక గంజాయి బ్యాచ్: సీఎం చంద్రబాబు

image

AP: గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని CM చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దానివెనుక గంజాయి బ్యాచ్ ఉందన్నారు. నాసిరకం మద్యం విక్రయించడం వల్లే ప్రజలు గంజాయికి అలవాటు పడ్డారని చెప్పారు. విద్యాసంస్థల ప్రాంగణాలకు కూడా గంజాయి, డ్రగ్స్ చేరాయని ఆరోపించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు.

News November 21, 2024

ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే?

image

దేశంలోనే మోస్ట్ పాపులర్ నటుడి(అక్టోబర్)గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచినట్లు ORMAX మీడియా పేర్కొంది. అక్టోబర్‌లో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న పలు సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత దళపతి విజయ్, షారుఖ్, జూ.ఎన్టీఆర్, అజిత్ కుమార్, అల్లుఅర్జున్, మహేశ్‌బాబు ఉన్నారు. ఇక మోస్ట్ పాపులర్ నటిగా సమంత నిలిచారు. ఆమె తర్వాత ఆలియా, నయనతార, దీపికా పదుకొణె, త్రిష ఉన్నారు.

News November 21, 2024

STOCK MARKETS: ఎంత నష్టపోయాయంటే!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా కోర్టులో అదానీపై కేసులు, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్, డాలర్ దూకుడు పెరగడమే ఇందుకు కారణాలు. సెన్సెక్స్ 77,155 (-422), నిఫ్టీ 23,349 (-168) వద్ద క్లోజయ్యాయి. ADANIENT, ADANI PORTS, SBILIFE, SBI, NTPC టాప్ లూజర్స్. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్. IT, REALTY సూచీలు పుంజుకున్నాయి.

News November 21, 2024

భారత AQI రాజధానిగా ఏ నగరం బెటరంటే..

image

కాలుష్యం కారణంగా దేశ రాజధానిగా ఢిల్లీ సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాక క్యాపిటల్‌గా ఏ నగరాలు సెట్ అవుతాయి? వాయు నాణ్యత సూచీ(AQI) ఆధారంగా ఏ నగరాలైతే బెటర్ అన్నదానిపై ఇండియా టుడే ఓ జాబితాను ప్రచురించింది. అవన్నీ ఈశాన్యరాష్ట్రాలకు చెందినవే కావడం విశేషం. ఇంఫాల్(AQI-38), ఐజ్వాల్(52), ఈటానగర్(56), షిల్లాంగ్(58), దిస్పూర్(64), అగర్తల(65), గ్యాంగ్‌టక్(AQI-70) వాటిలో ఉన్నాయి.