India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల కోసం ‘అవని’ పేరిట సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ను తీసుకొచ్చినట్లు బంధన్ బ్యాంక్ వెల్లడించింది. ఈ అకౌంట్ తీసుకున్న మహిళలకు ప్రత్యేక డెబిట్ కార్డు, రూ.10లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా, కార్డు పోతే రూ.3.5 లక్షల లయబిలిటీ, ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంజ్, లాకర్ అద్దె, బంగారం రుణాల ప్రాసెసింగ్ ఫీజులపై రాయితీ ఇస్తోంది. దీంతో పాటు ఖాతా తెరిచిన వారికి డిలైట్ పాయింట్ల పేరిట రివార్డులు అందించనుంది.
అధికార వ్యామోహంతోనే కాంగ్రెస్ జమ్మూకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు కుదుర్చుకుందని బీజేపీ నేత, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విమర్శించారు. JKలో వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని NC పెంచి పోషించిందని ఆరోపించారు. అలాంటి పార్టీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ కశ్మీర్కు ప్రత్యేక జెండా, వేర్పాటువాదానికి మద్దతు, ఆర్టికల్-370 పునరుద్ధరణకు కట్టుబడి ఉందా? అని ప్రశ్నించారు.
TG: మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారు. ‘N కన్వెన్షన్ను కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టలేదు. చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్కు తెలియదా? ముందుగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూలగొట్టాలి’ అని ప్రెస్మీట్లో డిమాండ్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. షూటింగ్ సెట్లో ప్రభాస్ నీడ ఉన్న ఫొటోను కొందరు అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. దీనికోసం 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సెట్లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.
TG: హైదరాబాద్ మాదాపూర్లో నటుడు <<13930726>>నాగార్జునకు<<>> చెందిన N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు ఆపాలంటూ నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. కాగా, ఈ తీర్పు వచ్చేలోపే కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు, సిబ్బంది నేలమట్టం చేశారు.
AP: బాపట్ల జిల్లా సూర్యలంకలోని కేంద్రీయ విద్యాలయంలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. సైన్స్ ల్యాబ్లో రసాయనాలు లీకవడంతో ఆ వాయువులను పీల్చి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వెంటనే వారిని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2)న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదామని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. వేప, చింత, ఉసిరి, రావి, నేరేడు లాంటి దేశీయ వృక్షజాతి మొక్కలు నాటుదామని తెలిపింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వీటిపై అవగాహన కల్పిద్దామని పేర్కొంది. “క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర” నినాదంతో నిర్వహిద్దామని ట్వీట్ చేసింది.
TG: తన N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ప్రముఖ నటుడు నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు.
మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హేమ కమిటీ ఇచ్చిన <<13900479>>రిపోర్టుపై<<>> హీరో నాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ విషయం తెలిసి నా గుండె ముక్కలైంది. నా సినిమా సెట్స్లో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. మెయిన్స్ట్రీమ్ సినిమా షూట్స్లో ఇలాంటివి జరగవని అనుకుంటున్నా. ఈ నివేదిక చూసి షాకయ్యా. సినిమాల్లో రాణించాలని వస్తున్న మహిళలకు ఇక్కడ అనువైన పరిస్థితులు కల్పించాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
N కన్వెన్షన్ కూల్చివేస్తున్నట్లు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం <<13930620>>సరికాదని<<>> హీరో నాగార్జున పేర్కొన్నారు. కోర్టు వ్యతిరేకంగా తీర్పుఇస్తే తానే కూల్చివేసేవాడినన్నారు. ‘తాజా పరిణామాలతో మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చు. వారి అభిప్రాయాన్ని పోగొట్టేందుకు కోర్టును ఆశ్రయిస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.