News August 20, 2024

CM కుర్చీపై పొంగులేటి కన్ను: మహేశ్వర్‌రెడ్డి

image

TG: CM కుర్చీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కన్ను పడిందని BJLP నేత మహేశ్వర్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కొంతమంది MLAలను వెంటబెట్టుకొని ఆయన CMను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో DK శివకుమార్‌లా ఇక్కడ పొంగులేటి కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తుంటే పొంగులేటి ఇంకేదో పదవి ఆశిస్తున్నారని అనిపిస్తోందని మహేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

News August 20, 2024

లేటరల్ ఎంట్రీపై రాజ్యాంగానికి కట్టుబడ్డ మోదీ: కేంద్రమంత్రి

image

UPSC నోటిఫికేషన్ రద్దు నిర్ణయంతో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రధాని మోదీ కట్టుబడ్డారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘UPA హయాంలో లేటరల్ ఎంట్రీ విధానంలో రిజర్వేషన్లు లేవు. కాంగ్రెస్ అప్పుడు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుందో లేదో చెప్పాలి. ఇప్పుడు లేటరల్ ఎంట్రీలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టి మోదీ సామాజిక న్యాయానికి కట్టుబడ్డారు’ అని ఆయన వివరించారు.

News August 20, 2024

వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

image

ఏపీ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు సహకారంతో రూ.15 వేల కోట్లు సమకూర్చేందుకు కేంద్రం అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతి అభివృద్ధి, ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై సీఎంతో వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 వరకు ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు రాజధానిలో పర్యటించనున్నారు.

News August 20, 2024

ఇండిగోలో Cute Charge.. ప్రశ్నించిన ప్రయాణికుడు

image

తనపై క్యూట్ ఛార్జీ(Cute Charge) విధించడంపై ఓ ప్రయాణికుడు Xలో విమానయాన సంస్థ ఇండిగోను ప్రశ్నించారు. దానికి ఇండిగో స్పందిస్తూ Cute అంటే కామన్ యూజర్ టెర్మినల్ ఎక్విప్మెంట్ అని వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో మెటల్ డిటెక్టర్, ఎస్కలేటర్ వంటివి వాడినందుకు ఫీజు అని వివరించింది. అయితే సెక్యూరిటీలో భాగమైన వాటిని CISF చూసుకుంటుందని, కస్టమర్లపై విధించడమేంటని ఆ ప్రయాణికుడు ప్రశ్నించారు.

News August 20, 2024

దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ విడుదల వాయిదా

image

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న ‘లక్కీ భాస్కర్’ సినిమా మూడోసారి పోస్ట్‌పోన్ అయింది. సెప్టెంబర్ 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం అక్టోబర్ 31న (దీపావళి) రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సినిమాను క్వాలిటీగా అందించేందుకు మరోసారి పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని, 80,90ల నాటి సెట్‌లను రీక్రియేట్ చేశామని తెలిపారు. అందుకే కాస్త టైమ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

News August 20, 2024

రిలయన్స్, డిస్నీ డీల్: హెచ్చరించిన సీసీఐ!

image

రిలయన్స్, వాల్ట్ డిస్నీ విలీనంతో పోటీదారులకు నష్టమని CCI భావిస్తున్నట్టు తెలిసింది. క్రికెట్ టోర్నీల ప్రసార హక్కులన్నీ వారి వద్దే ఉండటంతో ఆందోళన చెందుతోంది. తమ అభిప్రాయమేంటో చెప్పిన సంస్థ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించొద్దో చెప్పాలని ఆ 2 కంపెనీలను అడిగినట్టు సమాచారం. ఈ విలీనంతో సోనీ, జీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, 120 TV ఛానళ్లు, 2 స్ట్రీమింగ్ సర్వీసులకు ఇబ్బందని, మోనోపలీకి ఆస్కారం ఉందని నిపుణుల భావన.

News August 20, 2024

వినేశ్ ఫొగట్ ఏ పార్టీలో చేరొచ్చంటే?

image

సన్నిహిత వర్గాలు చెబుతున్నట్టు రాజకీయాల్లోకి వస్తే <<13899861>>వినేశ్ ఫొగట్<<>> ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె కాంగ్రెస్‌లో చేరొచ్చని అంచనా. ఎందుకంటే ఆమె కొన్నాళ్లుగా బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్నారు. అదే పార్టీలోని బబితపై పోటీచేస్తారని సమాచారం. పైగా హరియణా కాంగ్రెస్ నేత, MP దీపేంద్ర హుడా ఆమెకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మొన్న బలాలి వరకు ఆయనే స్వయంగా ర్యాలీ తీయించారు. మీ కామెంట్.

News August 20, 2024

కోల్‌కతా ఘటనపై ఫేక్ లెటర్‌.. సీబీఐ ప్రకటన

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌‌పై హత్యాచార ఘటనకు సంబంధించి CBI ప్రకటన పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే, ఈ లెటర్ ఫేక్ అని సీబీఐ క్లారిటీ ఇచ్చింది. ఏసీబీ డీఐజీ కార్యాలయం నుంచి రిలీజైనట్లు ఉన్న ఈ లెటర్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని తెలిపింది. ప్రజలు ఈ లేఖను నమ్మొద్దని పేర్కొంది.

News August 20, 2024

Stock Market: గరిష్ఠాల వైపు పరుగులు

image

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మళ్లీ జీవితకాల గరిష్ఠాల వైపు పరుగులు పెడుతున్నాయి. నేటి ఉదయం 80,722 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ చివరికి 378 పాయింట్ల లాభంతో 80,802 వద్ద ముగిసింది. 24,648 వద్ద ఓపెనైన NSE నిఫ్టీ 126 పాయింట్లు ఎగిసి 24,698 వద్ద క్లోజైంది. SBI లైఫ్, HDFC లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫిన్ టాప్ గెయినర్స్. ఎయిర్‌టెల్, ONGC, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి.

News August 20, 2024

నాగ చైతన్య- శోభిత పెళ్లి ఎప్పుడు?

image

నాగ చైతన్య, శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్/మధ్యప్రదేశ్, లేదా విదేశాల్లో సరైన వేదిక కోసం ఇరు కుటుంబాలు వెతుకుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో లేదా ఫిబ్రవరి/మార్చి ముహూర్తాల్లో వివాహం జరుగుతుందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 8న వారి ఎంగేజ్‌మెంట్ జరగగా, పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే.