News November 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 19, 2024

శుభ ముహూర్తం

image

తేది: నవంబర్ 19, మంగళవారం
చవితి: సా.5.28 గంటలకు
ఆరుద్ర: మ.2.55 గంటలకు
వర్జ్యం: రా.2.52-తె.4.28 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.29-9.14 గంటల వరకు
తిరిగి రా.10.36-11.27 గంటల వరకు
రాహుకాలం: మ.3.00-సా.4.30 గంటల వరకు

News November 19, 2024

ప్రో కబడ్డీ: తెలుగు టైటాన్స్ సూపర్ విక్టరీ

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో భాగంగా హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 49-27 తేడాతో ఘనవిజయం సాధించింది. స్టార్ రైడర్ పవన్ షెరావత్ టీమ్‌లో లేకపోయినా విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ అద్భుతంగా రాణించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ 7వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడి ఆరింట్లో గెలవగా, నాలుగింట్లో ఓడింది. ఈనెల 20న యూ ముంబాను ఢీకొట్టనుంది.

News November 19, 2024

TODAY HEADLINES

image

✒ G20 సమ్మిట్‌లో బైడెన్‌తో మోదీ భేటీ
✒ UPAలో కులగణన చేయకపోవడం తప్పే: రాహుల్
✒ AP: శ్రీవాణి ట్రస్ట్‌ రద్దు.. తిరుమలలో రాజకీయాలపై నిషేధం
✒ AP: అంగన్‌వాడీలకు గ్రాట్యుటీపై పరిశీలన: సంధ్యారాణి
✒ పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ఫిర్యాదు
✒ AP: భూఅక్రమాలపై విచారణ చేయించండి: బొత్స లేఖ
✒ TG: రైతులు, ఉద్యోగాల విషయంలో PM ఫెయిల్: రేవంత్
✒ TG: దూరదృష్టితో కులగణన: పొంగులేటి
✒ TG: అరెస్టులకు భయపడేవారు లేరిక్కడ: KTR

News November 19, 2024

2019 VS 2024: 7 రెట్లు ఎక్కువ డబ్బు సీజ్ చేసిన ECI

image

తాజా ఎన్నికల సీజన్లో రూ.1000 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు ECI తెలిపింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ కలుపుకొని రూ.858 కోట్లు స్వాధీనం చేసుకున్నామంది. 2019తో పోలిస్తే ఈ విలువ 7 రెట్లు ఎక్కువని తెలిపింది. మహారాష్ట్రలో రూ.660 కోట్లు, ఝార్ఖండ్‌లో రూ.198 కోట్లు, బై పోల్స్ జరిగే రాష్ట్రాల్లో రూ.223 కోట్లమేర సీజ్ చేశామని వెల్లడించింది. NOV 20న తుదిదశ పోలింగ్ ఉండటంతో నిఘా ఇంకా పెంచుతామని పేర్కొంది.

News November 19, 2024

పిల్లలను పెంచేందుకు పెరుగుతోన్న ఖర్చులు

image

దేశంలో పిల్లల పెంపకం ఖర్చు గణనీయంగా పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఖర్చులు ఇవే. పిల్లల ఆహారానికి ఏడాదికి రూ.35వేలు, బట్టలకు రూ.24 వేలు, ఆరోగ్య సంరక్షణకు రూ.20వేలు, విద్యకు రూ. 5వేల నుంచి రూ.లక్ష, డిగ్రీ చదివే పిల్లలుంటే రూ.5లక్షల వరకు, ఆటవస్తువులు & ఇతర అవసరాలకు రూ.25వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉంటాయి.

News November 19, 2024

వరంగల్‌కు వరాల జల్లు (1/2)

image

ప్రజాపాలన విజయోత్సవ వేడుకల వేళ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరాల జల్లు కురిపించింది.
* వరంగల్ మహానగర అభివృద్ధికి రూ.4962.47కోట్లు
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170కోట్లు
* కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు రూ.160.92కోట్లు
* టెక్స్‌టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలకు రూ.33.60కోట్లు
* పార్క్‌కు భూములిచ్చిన రైతులకు 863ఇళ్లు, రూ.43.15 కోట్ల పరిహారం

News November 19, 2024

వరంగల్‌కు వరాల జల్లు(2/2) (రూ.కోట్లలో..)

image

* కాళోజీ కళాక్షేత్రానికి రూ.85
* మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు రూ.205
* పరకాల- ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణకు రూ. 65
* పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.28
* వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్‌కు రూ.32.50
* ఇన్నర్ రింగ్ రోడ్ కోసం రూ.80
* గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లకు రూ.49.50
* నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 8.3

News November 19, 2024

బ్యాంకులో 592 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల(కాంట్రాక్ట్)కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. పోస్టును బట్టి బీఈ/బీటెక్/డిగ్రీ/ఎంబీఏ/పీజీ చేసిన వారు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, EWS,OBC అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.100 ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in

News November 19, 2024

మహిళల ఇంటి పేరు సర్టిఫికెట్లతో సరిపోలకున్నా ఓటు తిరస్కరించొద్దు: EC

image

AP: ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్ల జాబితాపై EC కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాహమైన మహిళా ఓటర్ల ఇంటిపేరు ధ్రువపత్రాలతో సరిపోలకున్నా తిరస్కరించవద్దని ఎమ్మార్వోలకు సూచించింది. ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలకు డిసెంబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను పరిశీలించాలని తహశీల్దార్లను ఆదేశించింది.