India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

BGT సిరీసులో రవిచంద్రన్ అశ్విన్ను తొలి టెస్టు నుంచే ఆడించాలని BCCI మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నారు. అతడిని బెంచ్పై కూర్చోబెట్టొద్దని సూచించారు. ‘చర్చే లేదు. టెస్టు క్రికెట్లో స్పెషలిస్టులే కీలకం. అందుకే టీమ్ బెస్ట్ స్పిన్నర్ అశ్విన్ ఆడాల్సిందే. ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న ఆసీస్పై అతడే ప్రభావం చూపగలడు’ అని అన్నారు. గతంలో కొన్ని మ్యాచులకు యాష్ను తప్పించడంపై గంభీర్ హెచ్చరించడం తెలిసిందే.

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ చీఫ్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్గా ఆయనను నియమించారు.

మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘పుష్ప’ మేనరిజంతో ప్రతి ఇండియన్స్ను ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. నిన్న ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజవడంతో ‘చాలా బాగుంది బ్రదర్’ అని అల్లు అర్జున్ను ట్యాగ్ చేస్తూ ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. దీనికి అల్లు అర్జున్ సైతం స్పందిస్తూ ‘ఎంతో ప్రేమతో.. మీకు ధన్యవాదాలు ’ అని రిప్లై ఇచ్చారు. దీంతో డిసెంబర్ 5న FDFS చూసేందుకు HYDకి రావాలని నెటిజన్లు వార్నర్ను కోరుతున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు కడపలోని అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు హాజరుకానున్నారు. దర్గాలో నేడు జరగనున్న ముషాయిరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్కు ఇచ్చిన మాట మేరకు ఆయన మాలలో ఉన్నప్పటికీ దర్గాకు వెళ్తున్నారు. చరణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రార్థనల అనంతరం చరణ్ తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.

TG: తనను గుజరాత్ గులాం అని విమర్శిస్తున్నారని, తాను భారతీయులకు గులాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటలీకి, నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులామ్ను కాదని దుయ్యబట్టారు. అదానీ పేరు చెప్పి కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం అదానీతో రేవంత్ చర్చలు జరపడం లేదా అని ప్రశ్నించారు.

AP: అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని వెల్లడించారు. వారికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం పరిశీలనలో ఉందని ప్రకటించారు. వారి సమ్మె వల్ల గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. దీంతో వారు ఆందోళనలను విరమించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని ప్రస్తుత సీఎం ఏక్నాథ్ శిండే కీలక ప్రకటన చేశారు. మహాయుతి కూటమిలో సీఎం పదవికి ఎలాంటి రేస్ లేదని స్పష్టం చేశారు. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. మహాయుతి కూటమి విజయం సాధిస్తే బీజేపీ నేతకే సీఎం పదవి దక్కే అవకాశం ఉన్నట్టు శిండే వ్యాఖ్యలతో స్పష్టమైంది. అజిత్ పవార్కు మరోసారి నిరాశ తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 15 గంటల్లోనే 40 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. దీంతో సౌత్ఇండియాలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి చిత్ర ట్రైలర్గా ‘పుష్ప-2’ నిలిచినట్లు మేకర్స్ ప్రకటించారు. స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

వైఎస్ వివేకా హత్య కేసులో మరో నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం పులివెందుల సీఐ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం గజ్జల చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే బెయిల్ మంజూరైంది.

మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఓ అలవాటు ఉందని సినీవర్గాలు చెబుతుంటాయి. ఆయన తీసే సినిమాల్లో షూటింగ్ పూర్తయ్యేవరకూ ఆయన హీరోల లుక్లోనే కనిపిస్తారని పేర్కొన్నారు. ‘అర్జున్ రెడ్డి’ తీసినప్పుడు విజయ్ దేవరకొండ లుక్లో, ‘యానిమల్’ తీసినప్పుడు రణ్బీర్ లుక్లో కనిపించారు. తాజాగా ఆయన గడ్డం తీసి కేవలం మీసంతో కొత్త లుక్లో కనిపించారు. దీంతో ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్ కోసమే ఇలా మారిపోయారని చర్చ జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.