India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారతీయ సాంస్కృతిక విలువల్ని ఆచరణలో చూపుతున్నందుకు బ్రిటన్ Ex PM, అల్లుడు రిషి సునాక్ను సుధా మూర్తి ప్రశంసించారు. లండన్లో జరిగిన భారతీయ విద్యా భవన్ వార్షిక దీపావళి ఉత్సవాల్లో ఆమె ప్రసంగించారు. ఉత్తమ విద్య ప్రతిఒక్కరూ ఎగరడానికి రెక్కలిస్తే, గొప్ప సంస్కృతి మూలాల్ని పట్టిష్ఠంగా నిలుపుతుందన్నారు. భారతీయ వారసత్వ పునాదులు కలిగిన రిషి సునాక్ గర్వించదగిన బ్రిటిష్ పౌరుడని పేర్కొన్నారు.

UPSC ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు దరఖాస్తు గడువు మరో 4 రోజుల్లో(NOV 22) ముగియనుంది. రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేస్తారు. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. NOV 23-29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష 2025 జూన్ 8న, మెయిన్స్ పరీక్ష ఆగస్టు 10న జరగనుంది. వెబ్సైట్: https://upsc.gov.in/

‘మోడర్న్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’గా పేరొందిన పుజారా కొత్త అవతారమెత్తనున్నారు. ఆస్ట్రేలియాతో జరగనున్న BGTలో ఆయన స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటేటర్గా చేయనున్నట్లు తెలుస్తోంది. టెస్టుల్లో భారత్ తరఫున కీలక ఇన్నింగ్సులు ఆడిన పుజారా గత కొంత కాలంగా ఫామ్ లేమితో జట్టుకు దూరమయ్యారు. ఇటీవల దేశవాళీలో సత్తా చాటినా ఆయనను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. పుజారా భారత్ తరఫున 103 టెస్టుల్లో 7,195 పరుగులు చేశారు.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల వైపు పయనిస్తున్నాయి. గత సెషన్లో అమెరికన్ సూచీలు భారీగా నష్టపోవడంతో భారత మార్కెట్లపై ప్రభావం కనిపిస్తోంది. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 77,464 వద్ద, నిఫ్టీ (-30తో) 23,502 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, ఫార్మా రంగాలు ప్రీ మార్కెట్ను లాభాలతో ఆరంభించాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, Oil & Gas నష్టాల్లో ఉన్నాయి.

క్రేజీ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ వర్మ ఒకే చోట కలిశారు. ఈ మేరకు సందీప్తో దిగిన ఫొటోను ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ‘VA(n)GABOND!’ అంటూ రాసుకొచ్చారు. అర్జున్ రెడ్డి, యానిమల్తో సందీప్ సత్తా చాటగా, ‘హనుమాన్’తో ప్రశాంత్ బ్లాక్ బస్టర్ దర్శకుల జాబితాలో చేరారు. వీరిద్దరి తదుపరి ప్రాజెక్టులు స్పిరిట్, జై హనుమాన్ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

AP: ఆరో రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. క్వశ్చన్ అవర్తో సభను ప్రారంభించారు. గ్రాంట్స్ కోసం పలు శాఖల మంత్రులు అభ్యర్థన చేయనున్నట్లు తెలుస్తోంది. సభలో ప్రవేశపెట్టిన ఏడు బిల్లులపై చర్చ జరిపి ఆమోదం తెలిపే అవకాశముంది.

AP: స్కూళ్ల టైమింగ్స్ పెంపుపై విద్యాశాఖ పునరాలోచించాలని ఏపీటీఎఫ్ కోరింది. 5కి.మీ పరిధి నుంచి వస్తున్నందున సాయంత్రం 5 గంటల వరకు బడిలోనే ఉంటే ఇళ్లకు వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. చీకటి పడటంతో పాటు ఇతర సమస్యల కారణంగా సమయం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది. అయితే సిలబస్ పూర్తి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి స్కూళ్ల టైమింగ్స్ పొడిగింపుపై మీరేమంటారు?

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కొత్త ఈవీ పాలసీ అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇవ్వనుంది. బైక్స్, ఆటోలు, ఫోర్ వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, ట్రాక్టర్లు ఈవీలు అయితే వాటికీ ఇది వర్తిస్తుంది. ఈ పాలసీ 2026, DEC 31 వరకు అమలులో ఉంటుంది. RTC ఈవీ బస్సులు కొంటే వాటికి కూడా ట్యాక్స్ ఫ్రీ అమలవుతుందని మంత్రి పొన్నం తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో సంక్రాంతి పండక్కి సొంతూర్లకు ఎలా వెళ్లాలని ప్రయాణికులంతా ఆందోళన చెందుతున్నారు. ఏటా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచకపోవడంతో ప్రస్తుతం ఉన్న రైళ్లపైనే తీవ్రంగా ఒత్తిడి ఉంటోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకూ ఫలక్నుమా, విశాఖ, గోదావరి, గరీభ్రథ్, ఈస్ట్కోస్ట్ సహా ఇతర రైళ్లల్లో బెర్తులే లేవు

AP: ప్రతి సోమవారం ఎస్పీ ఆఫీసుల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)లో ఫిర్యాదు చేసేవారికి అధికారులు కీలక సూచన చేశారు. తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. ఫిర్యాదు పత్రానికి ఆధార్ ప్రతిని జత చేయాలని, ఇది ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అయితే ఈ నిబంధన కలెక్టర్ కార్యాలయాల్లో వర్తిస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.
Sorry, no posts matched your criteria.