India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల రెసిడెంట్ డాక్టర్పై హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం ఈ కేసుపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. ఆగస్ట్ 9న జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహాజ్వాలలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది.
రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు రద్దీగా ఉన్నాయని, రూ.12 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. ప్రజలు స్వదేశీ వస్తువులతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ట్రేడ్ బాడీ కోరింది. దేశీయంగా తయారైన రాఖీలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. గత ఏడాది రూ.10 వేలకోట్ల వ్యాపారం జరిగింది.
TG: రైతులను కాంగ్రెస్ రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి మాజీ మంత్రి KTR లేఖ రాశారు. రుణమాఫీ మోసంతో లక్షలాది మంది రైతులు ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. కనీసం 40శాతం మందికి రుణమాఫీ చేయకుండానే 100% పూర్తయిందని ప్రకటించడం దౌర్భాగ్యమన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అన్నదాతల పక్షాన ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల తరఫున పోరాడుతామని హెచ్చరించారు.
కోల్కతాలోని ఆర్జే కర్ ఆస్పత్రి కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేస్తుందన్న కారణంతో ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంలో ఆమెను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసినట్టున్నారని సహచరులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఈ కేసులో అరెస్టైన పోలీస్ వాలంటీర్ కేవలం బలిపశువు కావచ్చని, దీని వెనుక పెద్ద వాళ్లు ఉండవచ్చని తెలిపారు.
TG: సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు షేర్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలా వివరాల్ని బయటపెట్టడం సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. ఏదైనా ట్రిప్కు వెళ్తే ఆ వివరాల్ని షేర్ చేయొద్దని చెబుతున్నారు. ఒకవేళ షేర్ చేస్తే నేరగాళ్లు రహస్యంగా కదలికల్ని గమనిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ఛాన్సుందని, ఆ తర్వాత వేధింపులకు గురిచేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మాజీ CM చంపై సోరెన్ ఝార్ఖండ్ టైగర్గా పాపులర్ అయ్యారు. ఆయనకు JMM చీఫ్ శిబు సోరెన్ కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చంపై పార్టీలో శిబు సోరెన్కు అత్యంత సన్నిహితుడిగా ఎదిగారు. హేమంత్ సోరెన్ రాజీనామా అనంతరం అనూహ్యంగా CM పదవి దక్కించుకున్నారు.
తనకు లాస్ ఏంజెలిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్లో ఆడాలని ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నారు. వచ్చే ఒలింపిక్స్ నాటికి తనకు 35 ఏళ్లు వస్తాయని, ఆసీస్ తరఫున ఆడుతాననే అనుకుంటున్నట్లు చెప్పారు. ఆ సమయానికి ఫిట్గా ఉండేవారికి అవకాశం దొరుకుతుందని తెలిపారు. కాగా LA ఒలింపిక్స్లో క్రికెట్ను తిరిగి ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏ ఫార్మాట్లో నిర్వహిస్తారనేది క్లారిటీ లేదు.
TG: బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తారనే ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఖండించారు. అవినీతి, కుటుంబ పార్టీలకు తాము దూరమని చెప్పారు. బీఆర్ఎస్ను విలీనం చేసుకున్నా ఉపయోగమేమీ లేదన్నారు. KCR ప్రస్థానం కాంగ్రెస్తోనే మొదలైందని గుర్తు చేశారు. BRS త్వరలోనే కాంగ్రెస్లో విలీనం కాబోతోందని తెలిపారు. 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికే కాంగ్రెస్ విలీన ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
ప్రముఖ నటుడు మోహన్లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. దీంతో 5 రోజులు విశ్రాంతి తీసుకోవాలని, రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దని వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయం తెలిసి తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
TG: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్వగ్రామం సిద్దిపేట(D) హుస్నాబాద్లోని సర్వాయిపేటలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిదశలో భాగంగా రూ.4.70 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సర్వాయిపేట కోటతో పాటు కిలాష్పూర్ కోట వరకు పాపన్నగౌడ్ తిరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. దీని ద్వారా దేశ విదేశాలకు ఆయన జీవిత చరిత్ర తెలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.