India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘పుష్ప’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనరిజం, ఆటిట్యూడ్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పాటు క్రికెటర్లూ ఫిదా అయ్యారు. ఈక్రమంలో వివిధ మ్యాచుల్లో వారంతా తగ్గేదే లే స్టెప్పులేశారు. తాజాగా ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో ఆ సన్నివేశాలను అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వారిలో కోహ్లీ, వార్నర్, జడేజా, రబాడా, రషీద్ ఖాన్, SRH ప్లేయర్లు, IND ఉమెన్ ప్లేయర్లు ఉన్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి-2025కు సంబంధించి లక్కీ డిప్(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 18వ తేదీ ఉ.10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉ.10 వరకు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో పేర్లు వచ్చిన భక్తులు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పేమెంట్ చేయవచ్చని TTD తెలిపింది.

బ్రెయిన్ క్యాన్సర్కు మొబైల్ వినియోగంతో సంబంధం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ & WHO జరిపిన అధ్యయనంలో ఫోన్కు మెదడు & హెడ్ క్యాన్సర్తో సంబంధం లేదని తెలిసింది. 1994 నుంచి 2022 మధ్యకాలంలో 5వేల మందిపై స్టడీ చేసిన తర్వాత ఈ విషయం కనుగొన్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రాలను క్యాన్సర్ కారకాలుగా గతంలో IARC పేర్కొంది.

MHలో పరాందా నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ బూత్ల వద్ద చెప్పులు నిషేధించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. తనకు EC చెప్పుల గుర్తు కేటాయించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం అభ్యర్థుల గుర్తు పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించడం నిషేధమని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిలబెట్టేందుకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే నీటిని కొనుక్కుని తాగుతున్నాం. కాలుష్య స్థాయులు చూస్తుంటే మున్ముందు గాలిని కూడా కొనుక్కోక తప్పేలా లేదు. దీన్ని అంచనా వేసిన కమ్యూనికా అనే సంస్థ గాలిని అమ్మేస్తోంది. ఇటలీలోని లేక్ కోమో సరస్సును ఆనుకుని ఉండే గ్రామంలో స్వచ్ఛమైన గాలిని తమ సీక్రెట్ ఫార్ములా ఎయిర్తో కలిపి 400 మి.లీ టిన్లలో రూ.907కి విక్రయిస్తోంది. ఆ గాలి పీల్చినవారి మనసు తేలికవుతుందని చెబుతోంది.

తిరుమలలో ఓ వర్గం వారు అన్యమత ప్రచారం చేశారనే వదంతులు భక్తుల్లో కలకలం రేపుతున్నాయి. పాప వినాశనం దగ్గర అన్య మతస్తులు రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. నిజంగా అన్యమత ప్రచారం చేశారా? ఇది తిరుమలలోనే జరిగిందా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

TG: పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని బీజేపీ నేతలు మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకునే వారికి ఆలౌట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా అని ప్రశ్నించారు. పరీవాహక ప్రజలు కలుషిత నీరు, గాలి మధ్య దుర్భర జీవితం గడుపుతున్నారని చెప్పారు. డీపీఆర్ వచ్చాక ఏం చేయాలనే విషయమై సలహాలు ఇవ్వాలని బీజేపీ నేతలకు సూచించారు.

వందే భారత్ రైళ్లలో నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తుండడంపై కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. 8 నెలల పాటు భోజనంలో బొద్దింకలు, పురుగులు వడ్డిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ప్రధాని మోదీకి చురకలంటించారు. ఈ పరిస్థితుల్లో బాధ్యులపై కేవలం ₹50 వేల జరిమానా విధిస్తే సరిపోతుందా అంటూ నిలదీశారు. ప్రయాణికుల భద్రత కోసం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫిన్టెక్ కంపెనీ mobikwik ఫౌండర్ బిపిన్ ప్రీత్సింగ్ సక్సెస్ స్టోరీ స్ఫూర్తినిస్తోంది. ఢిల్లీ IITలో చదివిన ఆయన డిజిటల్ పేమెంట్స్ హవాను 2000లోనే గుర్తించారు. 9ఏళ్లు కష్టపడి 2009లో ₹8లక్షల సేవింగ్స్తో చిన్న రూమ్లో MobiKwikను ప్రారంభించారు. భార్య ఉపాసన సహకారంతో కంపెనీని వృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ యాప్లో 10కోట్ల మంది యూజర్లు ఏటా $2bn లావాదేవీలు జరుపుతున్నారు. కంపెనీ విలువ ₹23,567కోట్లకు చేరింది.

ఆస్ట్రేలియాతో జరిగే BGTలో తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన స్థానంలో బుమ్రా భారత కెప్టెన్గా వ్యవహరిస్తారని తెలిపాయి. ఇటీవల రోహిత్ భార్య కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబంతోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే హిట్ మ్యాన్ రెండో టెస్టుకు జట్టుకు అందుబాటులో ఉంటారన్నాయి. మరోవైపు గాయపడిన కేఎల్ రాహుల్ కోలుకున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.