News November 17, 2024

వారికి ప్రజా సంక్షేమం పట్టదు: సీతక్క

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు.

News November 17, 2024

ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ పరిశోధన!

image

97 ఏళ్లుగా కొనసాగుతూ ప్రపంచంలోనే సుదీర్ఘమైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన పరిశోధన ఇది. ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త థామస్ పార్నెల్ 1927లో ‘పిచ్ డ్రాప్’ అనే పరిశోధన ప్రారంభించారు. తారు నుంచి లభ్యమయ్యే ‘పిచ్’ ద్రవం అత్యంత చిక్కగా ఉంటుంది. దాని చిక్కదనాన్ని కొలిచేందుకు వేడి చేసి గరాటులో పోస్తే 97 ఏళ్లలో 9 చుక్కలే బయటికొచ్చాయి. గరాటు నుంచి మొత్తం పిచ్ ఖాళీ అయ్యేందుకు మరో వందేళ్లు పడుతుందని అంచనా.

News November 17, 2024

డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ఏం చేస్తోంది: ఖ‌ర్గే

image

మ‌ణిపుర్‌లో మ‌ళ్లీ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ BJPని కాంగ్రెస్ నిలదీసింది. బీజేపీ పాలనలో ‘మ‌ణిపుర్ ఐక్యంగా లేదు, సుర‌క్షితంగా లేదు’ అని ఖ‌ర్గే విమర్శించారు. 2023 నుంచి జరుగుతున్న హింస ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును నాశనం చేస్తోంద‌న్నారు. ద్వేషపూరిత రాజ‌కీయాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో మ‌ణిపుర్ త‌గ‌ల‌బ‌డాల‌ని BJP చూస్తోందని ఖర్గే ఆరోపించారు.

News November 17, 2024

ఎక్కువ సేపు కూర్చుంటే త్వరగా ముసలితనం

image

ఎక్కువ సేపు కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనేది అందరికీ తెలిసిందే. వీరిలో అకాల వృద్ధాప్యం, గుండె జబ్బులు, మానసిక సమస్యలు వస్తాయని US సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. దాదాపు 1,000 మందిపై వీరు పరిశోధన చేశారు. పని తర్వాత నామమాత్రపు వాకింగ్ చేస్తే సరిపోదని, తీవ్రత ఉండాలని అంటున్నారు. రోజూ 30min రన్నింగ్/సైక్లింగ్ చేసే వారి వయసు 5-10ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.

News November 17, 2024

ట్రంప్ దిగిపోయేవరకూ మా నౌకలో ఉండండి.. సంస్థ ఆఫర్!

image

అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే దేశం వదిలి వెళ్లిపోతామంటూ USలో చాలామంది ప్రముఖులు ఎన్నికలప్పుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాకు చెందిన ఫార్చూన్ అనే ఓ క్రూయిజ్ షిప్ సంస్థ దీన్ని వ్యాపారావకాశంగా మలచుకుంది. ట్రంప్ పదవీకాలం ముగిసేవరకూ తమ క్రూయిజ్ షిప్‌లో ప్రపంచమంతా తిరగమని ఆఫర్ ఇచ్చింది. ఏడాదికి 40వేల డాలర్లు చెల్లిస్తే చాలని పేర్కొంది. మరి ఈ ఆఫర్‌ను ఎంతమంది తీసుకుంటారో చూడాలి.

News November 17, 2024

గ్రూప్-3లో సినిమాలపై ప్రశ్నలు.. జవాబులు చెప్పండి చూద్దాం!

image

1.2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది?
A.బ్రహ్మాస్త్ర B.కాంతార C.ముర్‌ముర్స్ ఆఫ్ ది జంగల్ D.ఆట్టం
2.ఆస్కార్ అవార్డు 2024కి నామినేట్ అయిన డాక్యుమెంటరీ చలనచిత్రం ‘టు కిల్ ఎ టైగర్’ దర్శకుడు ఎవరు?
A.కార్తికి గొన్సాల్వ్స్ B.నిషా పహుజా C.ఆర్.మహదేవన్ D.నిఖిల్ మహాజన్
**సరైన సమాధానాలు సా.5 గంటలకు ఇక్కడే పోస్ట్ చేస్తాం.

News November 17, 2024

అవకతవకలు జరుగుతున్నాయ్: కైలాష్ గహ్లోత్

image

ఆతిశీ ప్ర‌భుత్వంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆప్‌కు <<14635089>>రాజీనామా<<>> చేసిన కైలాష్ గ‌హ్లోత్‌ ఆరోపించారు. పార్టీ స‌వాళ్లు ఎదుర్కొంటోంద‌ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను విస్మ‌రించింద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లపై పార్టీ నిబ‌ద్ధ‌త‌ను వ్యక్తిగత రాజ‌కీయ ఆశయాలు అధిగ‌మించాయ‌న్నారు. అధికారిక నివాసానికి భారీగా ఖర్చు చేయడం వంటి అంశాలు సామాన్యులుగా ఉండాల‌నుకొనే పార్టీ వైఖ‌రిపై అనుమానాల‌కు తావిస్తోంద‌ని తప్పుబట్టారు.

News November 17, 2024

చనిపోయాడనుకొని అంత్యక్రియలు.. తీరా చూస్తే.!

image

గుజరాత్‌కు చెందిన బ్రిజేశ్ OCT 27న అదృశ్యమవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. NOV 10న వారు సబర్మతి బ్రిడ్జి కింద కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. వారు డెడ్‌బాడీ బ్రిజేశ్‌దేనని కన్ఫర్మ్ చేసి అంత్యక్రియలు చేశారు. శుక్రవారం ఇంటివద్ద ప్రేయర్ మీట్‌ నిర్వహించగా దానికి బ్రిజేశ్ రావడంతో అంతా షాక్ అయ్యారు. డెడ్‌బాడీని నిర్ధారించడంలో కుటుంబీకులు పొరబడ్డట్లు తేలింది.

News November 17, 2024

ప్రధాని మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం

image

ప్రధాని మోదీకి నైజీరియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్’ను ఆయనకు ప్రకటించింది. 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డు పొందిన విదేశీ ప్రముఖుడు మోదీ మాత్రమే కావడం విశేషం. ఇది ఆయనకు అందిన 17వ విదేశీ పురస్కారం. కాగా మోదీ నైజీరియా నుంచి జీ20 లీడర్స్ సమ్మిట్ కోసం బ్రెజిల్ వెళ్తారు. ఆ తర్వాత గయానాలో పర్యటిస్తారు.

News November 17, 2024

ఢిల్లీ మంత్రి రాజీనామా

image

ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్. అరవింద్ కేజ్రీవాల్ తరువాత ముఖ్యమంత్రి పదవి ఈయనకే వస్తుందనే ప్రచారం కూడా జరిగింది.