India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన తండ్రి రామ్మూర్తినాయుడు మృతిచెందడంపై సినీ హీరో నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్న మీరొక ఫైటర్. మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాడటం నేర్పారు. మీతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జీవితమంతా గుర్తుంచుకుంటాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. బై నాన్న’ అని ట్వీట్ చేశారు.

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటివరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా, కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు హోంశాఖ భద్రతను పెంచింది. 1+1 భద్రతను 2+2కి మార్చింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

AP: మాజీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు ఇవాళ తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్, నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుండెసంబంధ సమస్యలతో చికిత్స పొందుతూ రామ్మూర్తి నిన్న మధ్యాహ్నం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

AP: తన కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతల్ని రూపుమాపేందుకు కృషి చేసిన కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రేపు ఆయన 537వ జయంతి నిర్వహణకు ఉత్తర్వులిచ్చింది. రాష్ట స్థాయిలో అనంతపురంలో, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోనూ ఘనంగా వేడుక నిర్వహించాలని ఆదేశించింది. ఈయన కన్నడలో నలచరిత్ర, హరిభక్తిసార, నృసింహస్తవ, రామధ్యాన చరిత్రే, మోహన తరంగిణి అనే రచనలు చేశారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వేములవాడ ఆలయం, జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం పర్యటన ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాగా ఎల్లుండి వరంగల్లో సీఎం పర్యటించనున్నారు.

AP: YCP హయాంలో మహిళల అక్రమ రవాణా జరగలేదని <<14629630>>రోజా చేసిన ట్వీట్పై<<>> హోంమంత్రి అనిత స్పందించారు. ‘వ్యక్తిగత, మానసిక కారణాలతో కనపడకుండా పోతే అది మిస్సింగ్. ఉచ్చువేసి క్రయవిక్రయాలు జరిపి కనిపించకుండా మాయం చేస్తే అది హ్యుమన్ ట్రాఫికింగ్. ఈ రెండింటికి తేడా తెలియకుండానే గత ఐదేళ్లు పాలించారు. అవినీతి తప్ప ప్రజాక్షేమం ఏమాత్రం పట్టని ఇలాంటి వారు పరిపాలించడం ప్రజల పాలిట దౌర్భాగ్యం’ అని ట్వీట్ చేశారు.

TG: ఇవాళ, రేపు గ్రూప్-3 పరీక్షలు జరగనుండగా, అభ్యర్థులకు TGPSC పలు సూచనలు చేసింది.
➤ఒరిజినల్ ఐడీతో పరీక్షకు రావాలి.
➤ఎగ్జామ్కు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
➤ఉ.9.30 తర్వాత, మ.2.30 తర్వాత పరీక్షకు అనుమతించరు.
➤అభ్యర్థులు పేపర్-1కు తీసుకొచ్చిన హాల్ టికెట్నే మిగతా పేపర్లకు తీసుకురావాలి.
➤నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ హాల్టికెట్, ప్రశ్న పత్రాల్ని భద్రంగా పెట్టుకోవాలి.

కొడుక్కి జన్మనిచ్చిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ BGT తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. అతడితో పాటు సీనియర్ పేసర్ షమీ కూడా AUSకు వెళ్తారని సమాచారం. రోహిత్ తొలి టెస్టుకు జట్టులో చేరుతారని, షమీని రెండో టెస్టుకు ముందు స్క్వాడ్లోకి తీసుకుంటారని తెలుస్తోంది. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. BGT ఫస్ట్ టెస్ట్ ఈనెల 22 నుంచి జరగనుంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టైమ్ వేస్ట్ చేయకుండా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కొత్త సినిమాలకు సైన్ చేయాలి లేదా రిటైర్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ‘SIGN MOVIES OR RETIRE HRITHIK’ అని Xలో ట్రెండ్ అవుతోంది. గత ఏడేళ్లలో ఆయన 4 సినిమాలే చేశారు. 2018, 2020, 2021, 2023లో ఆయన మూవీస్ రాలేదు. ప్రస్తుతం NTRతో కలిసి చేస్తున్న ‘WAR-2’ 2025లో రిలీజ్ కానుంది.

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల్లో 75% ఆశావహుల తప్పిదాల వల్ల కూడా జరుగుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఫేక్ రిక్రూటర్లను గుర్తించడంలో విఫలమై మోసగాళ్లకు నగదు చెల్లిస్తున్నారని, సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నారని వెల్లడైంది. వివిధ రంగాల్లోని 1,427 మందిపై జరిపిన సర్వేలో అత్యధికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల్ని తరచూ చూస్తున్నట్లు మరికొందరు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.