News November 14, 2024

NOV 20న ప్రసార భారతి ఓటీటీ ప్రారంభం

image

ఈ నెల 20న ప్రసార భారతి OTT ప్రారంభిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి సంజయ్‌జాజు వెల్లడించారు. లైవ్ ఛానల్స్‌తో పాటు పలు రకాల మీడియా మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో పాటు 236 చిన్నపట్టణాల్లో ప్రైవేటు FM రేడియోలు వస్తాయని, అందుకోసం వచ్చే నెలలో వేలం నిర్వహిస్తామని వివరించారు. HYDలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ రీజినల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

News November 14, 2024

ఇవాళ్టి నుంచి లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్

image

AP: లా కాలేజీల్లో ప్రవేశాల కోసం రెండో విడత <>కౌన్సెలింగ్<<>> నేటి నుంచి ఈనెల17 వరకు కొనసాగనుంది. 15వ తేదీ నుంచి 19 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 20 నుంచి 23 వరకు ఆప్షన్ల నమోదు, 24న మార్పులకు అవకాశం ఉంటుందని కన్వీనర్ సత్యనారాయణ చెప్పారు. 26న సీట్లు కేటాయిస్తామని, 29 లోగా అభ్యర్థులు కాలేజీల్లో చేరాలని తెలిపారు. కాగా ఈ ఏడాది ఏపీ లాసెట్‌ పరీక్షలో 17,117 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

News November 14, 2024

CRICKET: వింత కారణాలు.. నిలిపివేతలు!

image

క్రికెట్ మ్యాచ్‌లు ప్రధానంగా వర్షం, వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ఆలస్యం లేదా నిలిచిపోతుంటాయి. సౌతాఫ్రికాలో ఇండియా తాజాగా ఆడిన టీ20 పురుగుల వల్ల కాసేపు నిలిచిపోయింది. SAలోనే 2017లో తేనెటీగల దాడి వల్ల శ్రీలంకతో మ్యాచ్, 2017లో హలాల్ ఫుడ్ అందుబాటులో లేదని బంగ్లాదేశ్‌తో మ్యాచ్ నిలిచిపోయాయి. వీటన్నింటికంటే వింతగా పాకిస్థాన్‌లో 1996లో PCB బంతులు సప్లై చేయకపోవడంతో NZతో టెస్టు 20ని.లు ఆలస్యమైంది.

News November 14, 2024

ఇద్దరికి మించి పిల్లలున్న వారూ అర్హులే

image

AP: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే. దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. అప్పట్లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News November 14, 2024

వర్మాజీ & శర్మాజీ

image

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత యువ బ్యాటర్లు తిలక్‌వర్మ, అభిషేక్‌శర్మ అదరగొట్టారు. తిలక్ 107(56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు), అభిషేక్ 50(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులతో సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో సూర్య(1), హార్దిక్(18) వంటి సీనియర్లు పెద్దగా రాణించకపోయినా <<14604651>>భారత్<<>> మంచి స్కోర్(219/6) చేసింది. దీంతో ఈ ఇద్దరు యువ బ్యాటర్లపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.

News November 14, 2024

‘లాపతా లేడీస్’ పేరు మారింది.. ఎందుకంటే?

image

బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ 2023లో విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. భారత్ నుంచి 2025 ఆస్కార్ అవార్డులకు సైతం నామినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దేశవిదేశాల్లో ఉన్న వారికి సులభంగా అర్థమయ్యేలా టైటిల్‌ను ‘లాస్ట్ లేడీస్’(Lost Ladies)గా మార్చేశారు. కాగా ఆస్కార్ వేడుక 2025 మార్చి 3న జరగనుంది.

News November 14, 2024

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై శ్రీలంక గెలుపు

image

డంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 324/5 స్కోర్ చేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించి టార్గెట్‌ను 221 రన్స్ చేశారు. కాగా NZ 175/9 స్కోరుకే పరిమితమైంది. దీంతో DLS ప్రకారం 45 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. SL ఆటగాళ్లు మెండిస్(143), అవిష్క(100) సెంచరీలు చేశారు. నవంబర్ 17న తర్వాతి వన్డే జరగనుంది.

News November 14, 2024

ప్రపంచంలోని అత్యంత శీతల నగరాలివే

image

1. యాకుత్స్క్, రష్యా (-41 F/ -40 C)
2. నోరిల్స్క్, రష్యా (-22 F/-30 C)
3. ఎల్లోనైఫ్, కెనడా (-18.2 F/-27.9 C)
4. బారో, యునైటెడ్ స్టేట్స్ (-13 F/-25 C)
5. ఉలాన్‌బాతర్, మంగోలియా (-11.2 F/-24.6 C)
6. ఇంటర్నేషనల్ ఫాల్స్, US (4.4 F/-15 C)
7. అస్తానా, కజకిస్థాన్ (6.4 F/ -14.2 C)

News November 14, 2024

రికార్డు నెలకొల్పిన అర్ష్‌దీప్ సింగ్

image

భారత పేస్ సెన్సేషన్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా నిలిచారు. సౌతాఫ్రికాతో జరిగిన 3వ టీ20లో సింగ్ 3 వికెట్లు తీశారు. దీంతో టీ20 కెరీర్‌లో మొత్తం 92 వికెట్లు సొంతం చేసుకొని టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్(90), బుమ్రా(89) ఉన్నారు. మొత్తంగా చూస్తే స్పిన్నర్ చాహల్(96) టాప్‌లో ఉన్నారు.

News November 14, 2024

నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

* 1949: బాలల దినోత్సవం
* 1889: భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జననం.(ఫొటోలో)
* 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం.
* 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం.
* 2020: తెలంగాణ నీటిపారుదల దినోత్సవం.
* ప్రపంచ మధుమేహ దినోత్సవం.