India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడానికి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షించారు. ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా సిద్ధం చేశామని, మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

GATE-2025 పరీక్షల షెడ్యూల్ను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనుంది. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 30 పేపర్లను నిర్వహించనుండగా, అభ్యర్థులకు ఒకటి లేదా రెండు పేపర్లు రాసేందుకు అవకాశం ఉంది.

టెలికం రంగంలో చక్రం తిప్పుతున్న ‘జియో’, ఓటీటీ ప్లాట్ఫామ్నూ ఊపేసేందుకు సరికొత్తగా వస్తోంది. Disney Hotstarతో Jio Cinema కలిసి JioStar పేరుతో మార్కెట్లోకి త్వరలో రానుంది. దీంతో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లకు జియోస్టార్ గట్టి కాంపిటీటర్ కానుంది. టెలికంలో తెచ్చినట్లే తక్కువ ధరతో సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చి సినిమాలు, సిరీస్లను అందిస్తే OTTలోనూ దూసుకెళ్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

TG: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి <<14582654>>ఘటనపై <<>>సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దాడి చేసిన వారిని వదిలిపెట్టం. దాడులను ప్రోత్సహించే వారిని కూడా వదిలిపెట్టం. దాడి చేసిన వారికి అండగా ఉన్న వారిని విడిచిపెట్టం. ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఇలాంటి దాడులను BRS సమర్థిస్తుందా?’ అని ఢిల్లీలో మీడియాతో ప్రశ్నించారు.

AP అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రేపు మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ బిల్లును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ, న్యాయాధికారుల సర్వీస్ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్పై సభలో చర్చ జరగనుంది.

2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం మారిన రాజకీయ లెక్కలతో INDIA TODAY’s 2024 Political Power Listలో కొత్త వారికి చోటు దక్కింది. జాబితాలో టాప్-10 నేతలు;
1. PM మోదీ 2. RSS చీఫ్ మోహన్ భాగవత్ 3. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 4. రాహుల్ గాంధీ 5. AP CM చంద్రబాబు నాయుడు 6. బిహార్ CM నితీశ్ కుమార్ 7. UP CM యోగి ఆదిత్యనాథ్ 8. TN CM MK స్టాలిన్ 9. బెంగాల్ CM మమతా బెనర్జీ 10. SP చీఫ్ అఖిలేశ్ యాదవ్

APలో 6 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల ఫీజిబిలిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయనుంది. కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జునసాగర్లో 1670, తాడేపల్లి గూడెం-1123, శ్రీకాకుళం-1383 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రూ.2.27 కోట్లు విడుదల చేయనుంది.

☛ అసెంబ్లీ విప్లు: ఆదినారాయణ రెడ్డి, అరవ శ్రీధర్, బి.అశోక్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నారాయణ నాయకర్, బోండా ఉమా, దాట్ల సుబ్బరాజు, దివ్య యనమల, థామస్. జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్పగారి, PGVR నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్ రావు.
☛ మండలిలో విప్లు: చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, హరిప్రసాద్.
☛ <<14594795>>అసెంబ్లీ చీఫ్ విప్గా<<>> ఆంజనేయులు, మండలి చీఫ్ విప్గా అనురాధ నియామకం.

AP ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడికి నిరాశ కలిగించిందని YCP MP విజయసాయిరెడ్డి చెప్పారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో బడ్జెట్లో చెప్పకపోవడం ప్రజలను మోసం చేయడమే. ప్రజా ప్రయోజనాలు చెప్పకుండా ఈ బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, వైసీపీపై నిందలతోనే నిండిపోయింది. చంద్రబాబు బడ్జెట్ స్వీయపొగడ్తలతో ఒక రాజకీయ కరపత్రంగా మిగిలింది’ అని Xలో విమర్శలు గుప్పించారు.

AP: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఆందోళనలు దృష్ట్యా తవ్వకాలు నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.