News August 14, 2024

రూ.20 లక్షల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు

image

TG: నేటి నుంచి ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అదనపు సంచాలకురాలు డి.ఉమాదేవి తెలిపారు. తెలంగాణ <>ఈ-పాస్<<>> వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. కాగా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే నిరుపేద విద్యార్థులకు ఈ పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రెండు విడతలుగా దీనిని అందజేస్తారు.

News August 14, 2024

నేడు జాతీయ ఎస్సీ కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు

image

AP: విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనంలో విధ్వంసం ఘటనపై ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్‌కు వైసీపీ నేతలు ఇవాళ ఫిర్యాదు చేయనున్నారు. ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగు నాగార్జున, నందిగం సురేశ్, మొండితోక అరుణ్, కైలే అనిల్‌తో కూడిన బృందం ఈ ఘటనను వివరించనుంది. మహాశిల్పం వద్ద జరిగిన దాడిని విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరనుంది.

News August 14, 2024

నేడు రాష్ట్రంలో OPలు బంద్

image

తెలంగాణలో ఇవాళ ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్‌కతాలో జూ.డాక్టర్‌ను రేప్ చేసి చంపిన <<13822185>>ఘటనను<<>> నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. దీనిపై జూడాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. ఇవాళ ఆందోళనలో పాల్గొననున్నారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగనుంది. కాగా కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన చేస్తున్నారు.

News August 14, 2024

హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషస్

image

హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మారిషస్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ మండిపడింది. షెల్ కంపెనీల ఏర్పాటుకు తమ రూల్స్ అంగీకరించవని తెలిపింది. తమను ట్యాక్స్ హెవెన్‌గా వర్ణించేందుకు వీల్లేదంది. గ్లోబల్ బిజినెస్ కంపెనీల కోసం తమ వద్ద పటిష్ఠ వ్యవస్థలు ఉన్నట్టు చెప్పింది. రిపోర్టులో ప్రస్తావించిన IPE ప్లస్ ఫండ్, IPE ప్లస్ ఫండ్ వన్‌కు తమ లైసెన్సులు లేవంది. అవి మారిషస్ కేంద్రంగా ఏర్పాటైనవి కాదని వెల్లడించింది.

News August 14, 2024

గుంపు మేస్త్రి గారికి స్వదేశాగమన శుభాకాంక్షలు: BRS

image

TG: విదేశీ పర్యటన నుంచి ఇవాళ తిరిగివస్తున్న CM రేవంత్ రెడ్డికి BRS పార్టీ సెటైరికల్ స్వాగతం పలికింది. ‘పది రోజుల US పర్యటనలో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డి గారు నూతనంగా స్థాపించిన కంపెనీతో రూ.1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని నేడు స్వదేశానికి తిరిగివస్తున్న మా గుంపు మేస్త్రి గారికి స్వదేశాగమన శుభాకాంక్షలు. ఇట్లు బ్యాగ్‌మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అని ఈ బ్యానర్‌ను Xలో పోస్ట్ చేసింది.

News August 14, 2024

HYDలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం

image

TG: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కంపెనీ 10 లక్షల చ.అ విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీనికి ఆ సంస్థ సీఈవో రవికుమార్‌తో కలిసి సీఎం రేవంత్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా 15వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడుల కోసం అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ బృందం నేడు రాష్ట్రానికి రానుంది.

News August 14, 2024

ఆర్మేనియాలో AP యువకుడి మృతి.. సన్నిహితుల తీరుపై అనుమానాలు

image

AP: ఉపాధి కోసం ఆర్మేనియా వెళ్లిన పెద్దదోర్నాల(మ) హసానాబాద్‌కు చెందిన శివనారాయణ(31) అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఫ్రెండ్స్ ఇచ్చిన పానీయం తాగి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అతడు శనివారం చనిపోయాడు. ₹2లక్షలు పంపితే బాడీ చూపిస్తామని, ₹10లక్షలిస్తే ఇండియాకు మృతదేహం పంపుతామని ఫ్రెండ్స్ చెప్పడంపై శివ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ మృతదేహం తెప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

News August 14, 2024

రాష్ట్రంలో మళ్లీ చంద్రన్న కానుకలు?

image

AP: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇస్తారు. ఇందుకు ఏటా రూ.538 కోట్లు ఖర్చు కానుంది. ఐదేళ్లకుగానూ ప్రభుత్వంపై రూ.2,690 కోట్ల అదనపు భారం పడనుంది. చంద్రన్న సంక్రాంతి కానుక కింద గోధుమపిండి, శనగపప్పు, బెల్లం, కందిపప్పు, పామాయిల్, నెయ్యి అందజేస్తారు.

News August 14, 2024

1947: బల్బులు, జంతువులను కూడా పంచుకున్నారు!

image

భారత్, పాకిస్థాన్ విభజనపై నాటి విభజన మండలి పెద్దలు పెద్ద యజ్ఞమే చేశారు. సైన్యం పంపిణీ అతి పెద్ద సవాల్‌గా మారింది. భారత్‌కు 2.6 లక్షలు, పాక్‌కు 1.4 లక్షల బలగాలు దక్కాయి. పాక్ సైనికుల్లో అత్యధికులు ముస్లింలే. టాస్‌లో నెగ్గి గుర్రపు బగ్గీని భారత్ దక్కించుకుంది. ఆస్తులన్నింటినీ ఇరుదేశాలు 80:20 నిష్పత్తిలో పంచుకున్నాయి. బల్బులు, జోయ్‌మొనీ ఏనుగు విషయంలోనూ పెద్ద ప్రహసనం నడిచినా ఇండియానే దక్కించుకుంది.

News August 14, 2024

అరాచక స్థాయికి బంగ్లా ప్రజాస్వామ్య విప్లవం: శశి థరూర్

image

భారత మైత్రీ చిహ్నాలపై దాడులు చేస్తుంటే బంగ్లా ప్రజలకు మద్దతివ్వడం కష్టమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ప్రజాస్వామ్య విప్లవం అరాచక స్థాయికి దిగజారిందన్నారు. ‘పాక్ దళాలు భారత్‌ సైన్యానికి దాసోహమైన చిహ్నాలను ముక్కలు చేశారు. భారత సాంస్కృతిక కేంద్రం, ఇస్కాన్ సహా హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. మైనారిటీలపై దాడులు చేశారు. ఇవన్నీ భారత ప్రజలకు ప్రతికూల సంకేతాలు పంపిస్తాయి. ఇది మంచిది కాదు’ అని అన్నారు.