India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు కాలిఫోర్నియాలోని గూగుల్ క్లౌడ్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించారు. టెక్, ఏఐ, స్కిల్లింగ్ తదితర అంశాలపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర పురోగతికి అవి ఎలా ఉపయోగపడతాయనే అంశంపై డిస్కస్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కోలీవుడ్ లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్ తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని, అందరి ఆశీస్సులు కావాలని ఇన్స్టాలో పోస్టు చేశారు. ప్రముఖ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ. విజయ్ హీరోగా వచ్చిన బిగిల్(తెలుగులో విజిల్)తో ఈమె నటిగా మారారు. తర్వాత విశ్వక్సేన్ ‘పాగల్’, కార్తీ ‘విరుమాన్’ చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది మార్చిలో డైరెక్టర్ కార్తీక్ను <<12918700>>వివాహం<<>> చేసుకున్నారు.
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర జడ్జీలు గంటలో రాజీనామా చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వందలాది విద్యార్థులు ఇప్పటికే ఆ దేశ సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. మధ్యంతర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సీజే ఫుల్ కోర్ట్ సమావేశపరచడం వివాదానికి దారి తీసింది. దేశంలో చెలరేగిన అల్లర్ల వెనుక జడ్జీల పాత్ర కూడా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
SC రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ తనకు నిర్దిష్టమైన హామీ ఇచ్చారని MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఢిల్లీలో నిన్న ఆయన ప్రధానిని కలిశారు. ‘వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్షా పాత్ర కీలకం. డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో వెంటనే వర్గీకరణ అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా చూడాలని మోదీని కోరా’ అని ఇవాళ ఆయన వెల్లడించారు.
బ్యాంకు డిపాజిట్లు, రుణాల వడ్డీరేట్లపై నియంత్రణను తొలగిస్తున్నామని RBI గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఇకపై సొంతంగా వడ్డీరేట్లు నిర్ణయించుకోవచ్చని వెల్లడించారు. FM నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా బ్యాంకింగ్ నియంత్రణ సవరణ చట్టం తీసుకొచ్చేందుకు చాన్నాళ్లుగా కసరత్తు చేశామని నిర్మల అన్నారు. సృజనాత్మక ఉత్పత్తులతో బ్యాంకులు డిపాజిట్లు పెంచుకోవాలని ఆమె సూచించారు.
కర్ణాటకలో రైల్వే ట్రాక్పై కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఆ సమయంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బల్లుపేట – సకలేశ్పూర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడంతో బెంగళూరు – మంగళూరు మధ్య రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంగళూరుకు పరీక్ష రాయడానికి వెళ్తున్న అభ్యర్థులు ఆందోళనపడుతున్నారు. ఈ మార్గంలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
తెల్లజుట్టు సమస్య నేడు ప్రతి ఒక్కర్నీ వేధిస్తోంది. ఈ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. దాని ప్రకారం.. ‘మెలనోసైట్ స్టెమ్సెల్స్’ అనే కణాలు మన జుట్టు రంగును నిర్ధారిస్తాయి. ఆహార, జీవన శైలి అలవాట్లు, వృద్ధాప్య కారణాలతో మెలనోసైట్ మూల కణాలు బలహీనమవుతున్నట్లు గుర్తించారు. దాంతో జుట్టు సహజ రంగు స్వభావాన్ని కోల్పోయి తెల్లబడటం మొదలవుతోందని వారు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సా.4కు HYDలోని ఎన్టీఆర్ భవన్కు రానున్నారు. తెలంగాణ నేతలు, కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయడంపై నేతలకు CBN దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అలాగే టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయం సేకరించనున్నట్లు సమాచారం.
భారత్లోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని కోయంబత్తూరులో నిర్మించేందుకు తమిళనాడు సర్కారు సన్నద్ధమవుతోంది. దీనిపై సీఎం స్టాలిన్ ఈ ఏడాది ఏప్రిల్లో హామీ ఇచ్చారు. తాజాగా ఆ రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ డీపీఆర్కు టెండర్లను ఆహ్వానించింది. ఒండిపూడూర్ ప్రాంతాన్ని స్టేడియం నిర్మాణానికి ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చెన్నైలోని చిదంబరం స్టేడియం తమిళనాడులో కీలక స్టేడియంగా ఉంది.
భారత్కు సంబంధించి మరో ప్రకటన చేస్తామన్న హిండెన్బర్గ్ను భారతీయులు టార్గెట్ చేశారు. అసలు మీకు విశ్వసనీయత ఉందా అంటూ కామెంట్లు ఎక్కుపెట్టారు. అదానీ స్టాక్స్ విషయంలో చేసిన ఆరోపణలు తప్పని తేలడంతో హెండెన్బర్గ్ ప్రకటనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. గత ఏడాది జనవరిలో చేసిన ప్రకటన తరువాత ఇప్పటివరకు సెన్సెక్స్ 20,000 పాయింట్లు గెయిన్ చేసింది.
Sorry, no posts matched your criteria.