News August 17, 2025

మేడ్చల్ సరోగసీ కేసులో విస్తుపోయే నిజాలు

image

మేడ్చల్ సరోగసీ <<17424309>>కేసులో<<>> మరికొంత మంది అరెస్ట్ అయ్యే అవకాశముంది. నిందితురాలు లక్ష్మీకి HYDలో పలు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. IVF సెంటర్ల రికార్డులను పరిశీలించనున్నారు. లక్ష్మీ 50 మందికి పైగా సరోగసీ చేయించినట్లు తెలుస్తోంది. అండాలు ఇస్తే ₹30 వేలు, పిల్లలను కనిస్తే ₹4 లక్షలు ఇస్తూ దందా చేసినట్లు సమాచారం. ఆమెపై ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు.

News August 17, 2025

ఆసియా కప్‌కు పాక్ జట్టు ప్రకటన.. సీనియర్ ప్లేయర్లకు షాక్

image

SEP 9 నుంచి జరిగే ఆసియా కప్(T20)కు పాక్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లకు చోటు దక్కలేదు. సల్మాన్ అలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

జట్టు: సల్మాన్ అలీ అఘా (C), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, H నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, M హరీస్(WK), M నవాజ్, వసీమ్ Jr, సహిబ్జాదా ఫర్హాన్, S అయూబ్, S మీర్జా, షాహీన్ ఆఫ్రిది, సుఫియాన్ మొకిమ్.

News August 17, 2025

రవితేజ ‘మాస్ జాతర’ విడుదల వాయిదా?

image

మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని అక్టోబర్ 20కి పోస్ట్‌పోన్ చేస్తారని సమాచారం. సినీ కార్మికుల సమ్మె వల్ల పెండింగ్ వర్క్ పూర్తి కాలేదని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News August 17, 2025

సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో ఈ ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధత, ఎన్నికల నిర్వహణకు కోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చేందుకు కీలకంగా భావిస్తున్న PAC సమావేశం తేదీ ఖరారుపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.

News August 17, 2025

చికెన్ బోన్స్ తింటున్నారా?

image

చాలామంది చికెన్‌తో పాటు ఎముకలను నమిలేస్తుంటారు. బోన్స్ తింటే జీర్ణ సమస్యలు రావొచ్చని, కృత్రిమంగా పెరిగిన కోళ్ల ఎముకలతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి జీర్ణమయ్యేందుకు టైమ్ పడుతుందని, పేగులలో అడ్డంకులు ఏర్పడొచ్చని అంటున్నారు. ఎముకలు అన్నవాహిక, శ్వాసనాళంలో చిక్కుకునే అవకాశముంటుందని, శ్వాసనాళంలో ఇరుక్కుపోతే ఊపిరాడక ఇబ్బంది ఎదురవ్వొచ్చని పేర్కొంటున్నారు. SHARE IT.

News August 17, 2025

రేవంత్, ఉత్తమ్‌కు నీళ్ల విలువ తెలియదు: హరీశ్

image

TG: సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు వృథాగా ఉంచుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపాలని ఉత్తమ్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదు. కృష్ణ, గోదావరి జలాలను సముద్రం పాలు చేస్తున్నారు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. ఉత్తమ్, రేవంత్‌కు నీళ్ల విలువ తెలియదు. రాజకీయాల కోసం రైతులను బలిచేయొద్దు’ అని దుయ్యబట్టారు.

News August 17, 2025

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 20న జరిగే NDA నేతల భేటీ, 21న ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చిస్తారని సమాచారం. ఇవాళ పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయనుంది. భేటీ అనంతరం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

News August 17, 2025

రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటారా?

image

TG: కాంగ్రెస్ MLA రాజగోపాల్‌రెడ్డి కొద్ది రోజులుగా CM రేవంత్‌‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం మల్లు రవి నేతృత్వంలో జరగనున్న PCC క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే దీనిపై నిన్న మల్లు రవితో PCC చీఫ్ చర్చించారని, గజ్వేల్‌లో పార్టీ నేతల పంచాయితీపైనా మీటింగ్‌లో మాట్లాడతారని సమాచారం.

News August 17, 2025

ఉమ్మడి ADB, WGL జిల్లాలను ముంచెత్తిన వానలు

image

TG: ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ములుగు (D) గోవిందరావుపేటలో అత్యధికంగా 22 సెం.మీ. వర్షపాతం, ఆదిలాబాద్ (D) తాంసిలో 17 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇవాళ భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, HNK, WGL జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

News August 17, 2025

సీనియర్ నటి కన్నుమూత

image

ప్రముఖ మరాఠీ నటి జ్యోతీ చందేకర్(69) అనారోగ్యంతో కన్నుమూశారు. 12ఏళ్ల వయసులోనే యాక్టింగ్ ప్రారంభించిన ఆమె సీరియళ్లు, చిత్రాల్లో నటించారు. ‘థోల్కీ’, ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. చందేకర్ కూతురు తేజస్వినీ పండిట్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ‘తిచా ఉంబర్తా’లో నటించడం విశేషం. జ్యోతి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.