News July 1, 2024

NEET UG: ప్రైవేటు స్కూల్ ఓనర్ అరెస్ట్

image

NEET UG క్వశ్చన్ పేపర్ లీక్ <<13461942>>కేసు<<>>లో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని గోధ్రాలో ఉన్న జయ్ జలరామ్ స్కూల్ ఓనర్ దీక్షిత్ పటేల్ ఒక్కో విద్యార్థి నుంచి రూ.10లక్షలు డిమాండ్ చేసి 27 మందికి పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ స్కూల్లోనూ NEET UG పరీక్ష జరిగింది. కాగా ఈ కేసులో గుజరాత్ పోలీసులు చేసిన ఆరో అరెస్ట్ ఇది.

News July 1, 2024

ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని ఓడిన ఎంపీలకు కేంద్రం ఆదేశం

image

సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలు ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఈ నెల 11లోపు ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ నోటీసులిచ్చింది. విజయం సాధించిన సిట్టింగ్ ఎంపీలు గతంలో కేటాయించిన నివాసాల్లో అలాగే కొనసాగుతారు. బంగ్లాలను ఖాళీ చేయాల్సిన వారిలో స్మృతీ ఇరానీ, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్, భారతీ పవార్ తదితర ప్రముఖులు కూడా ఉన్నారు.

News July 1, 2024

పార్టీ మార్పు వార్తలు అవాస్తవం: సబితా ఇంద్రారెడ్డి

image

TG: తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు KCR సముచిత స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్‌లోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు.

News July 1, 2024

విదేశీ మ్యూజిక్ విన్నాడని పబ్లిక్‌లో ఉరి?

image

దేశంలో నిషేధిత సౌత్ కొరియన్ సాంగ్స్ విన్నాడని 22ఏళ్ల యువకుడిని నార్త్ కొరియా ప్రభుత్వం పబ్లిక్‌లో ఊరి తీసిందట. దేశం విడిచి వెళ్లిన 649మంది సాక్ష్యాలతో నా.కొరియా మానవ హక్కుల సంఘం ఓ నివేదిక విడుదల చేసింది. 60 సౌత్ కొరియన్ సాంగ్స్ వినటంతో పాటు 3సినిమాలు చూశాడని హ్వాంగ్హే ప్రావిన్స్‌లోని వ్యక్తిని 2022లో పబ్లిక్‌గా ఉరి తీసినట్లు నివేదిక వెల్లడించింది. ఉరి వార్తలను నా.కొరియా కొట్టిపారేసింది.

News July 1, 2024

ఇది ప్రజా ప్రభుత్వం.. కష్టపడి పనిచేస్తాం: చంద్రబాబు

image

AP: CMగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడో సంతకం పెట్టినట్లు చంద్రబాబు పెనుమాక సభలో వెల్లడించారు. ‘వీటిల్లో రూ.5కే భోజనం చేయవచ్చు. త్వరలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన కోసం శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది. నిరంతరం కష్టపడి పనిచేస్తాం. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించాలి’ అని కోరారు.

News July 1, 2024

4న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

image

AP: ఈనెల 4వ తేదీన సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమవుతారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపులపై సీఎం వారితో చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. విభజన హామీల అమలుపైనా చర్చించనున్నట్లు పేర్కొన్నాయి.

News July 1, 2024

ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు టీచర్లు

image

AP: శ్రీకాకుళం(D) పెద్దకొజ్జిరియా ZP ఉన్నత పాఠశాలలో అరుదైన పరిస్థితి నెలకొంది. ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు టీచర్లు పనిచేస్తున్నారు. గత ఏడాది 22 మంది పిల్లలు ఉండేవారు. వారిలో టెన్త్ పూర్తయిన నలుగురు వెళ్లిపోగా 18 మంది మిగిలారు. ఈ విద్యాసంవత్సరంలో 11 మంది ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. దీంతో 3, 4, 6, 7వ తరగతుల్లో ఏడుగురు మిగిలారు. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

News July 1, 2024

ఈ ప్రపంచకప్ వారికెంతో ప్రత్యేకం

image

టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే తొలిసారిగా ఈ సీజన్‌లోనే అత్యధికంగా 20 జట్లు పాల్గొన్నాయి. ఈ ప్రపంచకప్ అమెరికా, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి జట్లకు మరుపురానిది. ఆతిథ్య హోదాలో తొలిసారి WC ఆడిన USA అద్భుత ఆటతో సూపర్-8కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అఫ్గాన్ జట్టు NZ, AUSను చిత్తుచేసి తొలి సారి సెమీస్ చేరింది. మరోవైపు సఫారీలు మొదటి సారి వరల్డ్ కప్ ఫైనల్ చేరగా విజయానికి అడుగుదూరంలో తడబడ్డారు.

News July 1, 2024

నేడు టెట్ నోటిఫికేషన్.. వారంలో మెగా డీఎస్సీ!

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు నేడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. https://cse.ap.gov.in/ వెబ్‌సైటులో పరీక్షా వివరాలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణ తేదీపై ఇవాళ స్పష్టత రానుంది. ఆగస్టు నెలలో టెట్ నిర్వహించే ఛాన్సుంది. అలాగే మెగా DCSకి సంబంధించి వారం రోజుల్లో ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. టెట్, డీఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

News July 1, 2024

BRS పార్టీకి మరో షాక్?

image

TG: నేతల వలసలతో ఇప్పటికే సతమతమవుతున్న BRS పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ MLC బస్వరాజు సారయ్య కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరు MLCలు సైతం హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శనివారం సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సారయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేరికలపై చర్చించారట. 2 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.