News December 3, 2025

ప్రజలను కేంద్రం దగా చేస్తోంది: రాహుల్ గాంధీ

image

కుల గణనపై కేంద్రం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘పార్లమెంటులో కుల గణనపై నేనో ప్రశ్న అడిగా. దానికి కేంద్రం ఇచ్చిన సమాధానం విని షాకయ్యాను. సరైన ఫ్రేమ్ వర్క్ లేదు, టైమ్ బౌండ్ ప్లాన్ లేదు, పార్లమెంట్‌లో చర్చించలేదు, ప్రజలను సంప్రదించలేదు. కులగణనను విజయవంతంగా చేసిన రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలని లేదు. క్యాస్ట్ సెన్సస్‌పై మోదీ ప్రభుత్వ తీరు దేశంలోని బహుజనులను దగా చేసేలా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News December 3, 2025

NIEPMDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిఫుల్ డిజబిలిటీస్ (NIEPMD) 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG, B.Ed, M.Ed (Spl.edu), PhD, M.Phil, PG( సైకాలజీ, ఆక్యుపేషనల్ థెరపీ), డిగ్రీ (ప్రోస్థెటిక్స్&ఆర్థోటిక్స్), B.Com, M.Com, MBA, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://niepmd.nic.in

News December 3, 2025

జీడిమామిడిలో టీ దోమ పూర్తి నివారణకు సూచనలు

image

జీడిమామిడి కొత్త చిగురు వచ్చే సమయంలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. పూత వచ్చాక లీటరు నీటికి లాంబ్డాసైహలోథ్రిన్ 0.6ml లేదా క్లోరీపైరిఫాస్ 2mlను కలిపి పిచికారీ చేయాలి. గింజ బటాని సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి ప్రోఫెనోఫోస్ 1ml కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి నెల వరకు అవసరాన్నిబట్టి 2 లేక 3 సార్లు కాండం, కొమ్మలు, ఆకులు, చిగుర్లు, పూత, పిందే తడిచేలా పిచికారీ చేయాలి.

News December 3, 2025

దేవుడి వ్యాఖ్యలపై అనవసర వివాదం: CM

image

TGలో అభివృద్ధి పనులకు సహకరించాలని PM మోదీని కోరినట్లు CM రేవంత్ తెలిపారు. ‘మీరు CMగా ఉన్నప్పుడు నాటి PM మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారు. అలాగే మీరు కూడా TG అభివృద్ధికి సహకరించండి’ అని కోరానన్నారు. నిన్న తమ పార్టీలో భిన్న రకాల మనస్తత్వాలను వివరించే ప్రయత్నంలో చేసిన <<18451881>>కామెంట్లను<<>> BJP నేతలు అనవసర వివాదం చేస్తున్నారని మీడియాతో అన్నారు. రెండు టర్మ్‌లు తానే CMగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

News December 3, 2025

దేవుడి వ్యాఖ్యలపై అనవసర వివాదం: CM

image

TGలో అభివృద్ధి పనులకు సహకరించాలని PM మోదీని కోరినట్లు CM రేవంత్ తెలిపారు. ‘మీరు CMగా ఉన్నప్పుడు నాటి PM మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారు. అలాగే మీరు కూడా TG అభివృద్ధికి సహకరించండి’ అని కోరానన్నారు. నిన్న తమ పార్టీలో భిన్న రకాల మనస్తత్వాలను వివరించే ప్రయత్నంలో చేసిన <<18451881>>కామెంట్లను<<>> BJP నేతలు అనవసర వివాదం చేస్తున్నారని మీడియాతో అన్నారు. రెండు టర్మ్‌లు తానే CMగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

News December 3, 2025

ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే ఏంటి?

image

తిరుమలలో ఏడాదికి ఓసారి ‘సాలకట్ల బ్రహ్మోత్సవాలు’ నిర్వహిస్తారు. అయితే, ఈ ఉత్సవ వైభవాన్ని భక్తులు రోజూ దర్శించుకునేందుకు వీలుగా TTD ఈ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దీనిని వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తారు. ఈ సేవలో భాగంగా స్వామివారికి రోజూ శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహన సేవలను జరుపుతారు. ఇది భక్తులకు నిత్యం స్వామివారి ఉత్సవ శోభను చూసే అవకాశం కల్పిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 3, 2025

ENCOUNTER.. ఐదుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు మరణించారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News December 3, 2025

‘అఖండ-3’ ఉందని హింట్ ఇచ్చిన తమన్?

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈనెల 5న విడుదలవనుంది. ఈ సందర్భంగా రికార్డింగ్ స్టూడియోలో డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఫైనల్ ఔట్‌పుట్‌ను వీక్షించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఎండ్ కార్డ్ ఫొటోను Xలో పంచుకున్నారు. అందులో ‘జై అఖండ’ అని ఉండటంతో ఇది పార్ట్-3 టైటిల్ అనే చర్చ మొదలైంది. ‘అఖండ-2’ ముగింపులో సీక్వెల్ కొనసాగింపుపై డైరెక్టర్ లీడ్ ఇస్తారని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News December 3, 2025

రాజ్‌నాథ్ ఆరోపణలన్నీ నిరాధారాలే: కాంగ్రెస్

image

మాజీ ప్రధాని నెహ్రూపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ నిరాధార ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ చెప్పారు. సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణానికి ప్రజాధనం వినియోగించడానికి నిరాకరించిన నెహ్రూ, బాబ్రీ నిర్మాణానికి పన్నుల ద్వారా వచ్చిన నిధులు కేటాయించాలని ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. మాస్క్‌లు, ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలకు ప్రజాధనాన్ని వినియోగించకూడదని నెహ్రూ భావించేవారని ఠాగూర్ తెలిపారు.

News December 3, 2025

ముగిసిన సీఎం ఢిల్లీ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​లో నిర్వహించనున్న రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​కు రావాలని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారికి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అందజేశారు.