India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
PM మోదీ సారథ్యంలో 71 మందితో కొలువుదీరిన కేబినెట్లో 99% మంది కోటీశ్వరులేనని ADR వెల్లడించింది. వారి సగటు ఆస్తి ₹108 కోట్లని తెలిపింది. APకి చెందిన P.చంద్రశేఖర్(గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి) ఆస్తి అత్యధికంగా ₹5,705 కోట్లని చెప్పింది. జ్యోతిరాదిత్య-₹424 కోట్లు, అశ్వినీ వైష్ణవ్ ₹144 కోట్లు, ఇంద్రజిత్-₹121 కోట్లు, కుమారస్వామి-₹115 కోట్లు, గోయల్-₹110 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంది.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: జూన్ 12, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:53 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:51 గంటలకు
ఇష: రాత్రి 8.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: జూన్ 12, బుధవారం
జ్యేష్ఠమాసం
శు.షష్ఠి: రాత్రి 7.17 గంటలకు
మఖ: అర్ధరాత్రి 2:12 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.11:41 నుంచి మ.12:33 వరకు
వర్జ్యం: మ.12.55 నుంచి మ.2.41 వరకు
* రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
* విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రులు అమిత్ షా, నడ్డా
* TG: ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్కు నోటీసులు
* ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు: మంత్రి రాజనర్సింహ
* సింగరేణి కారుణ్య నియామకాల్లో వారసులకు వయోపరిమితి పెంపు
* ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ
* విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా మృతి
రాజస్థాన్లోని జోహ్రీ బజార్లో ఓ జువెల్లరీ షాపు ఓనర్లు ఓ US మహిళకు కుచ్చుటోపీ పెట్టారు. చెరిష్ అనే మహిళకు ₹300 ఆభరణానికి బంగారు పాలిష్ వేసి ₹6కోట్లకు రెండేళ్ల కిందట విక్రయించారు. నమ్మించేందుకు హాల్మార్క్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయితే అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్లో ఆభరణాన్ని తాజాగా ప్రదర్శించగా అది నకిలీదని తేలింది. ఆమె ఫిర్యాదుతో జైపూర్ పోలీసులు వ్యాపారులైన తండ్రి, కొడుకుపై కేసు నమోదు చేశారు.
ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ తీరు మారదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ విమర్శించారు. ఈ సారి విపక్ష కూటమికి బలం పెరగడంతో పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీడియాతో పేర్కొన్నారు. గత ఏడాది 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని, ఈ సారి 230 మందిని సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు.
లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని దేశ తదుపరి ఆర్మీ చీఫ్గా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్కు వైస్ చీఫ్గా ఉన్న నియామకం జూన్ 30వ తేదీ మధ్యాహ్నం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం జూన్ 30తో ముగుస్తుండటంతో కొత్త దళాధిపతిని కేంద్రం ఎంపిక చేసింది.
T20 వరల్డ్ కప్లో కెనడాపై పాకిస్థాన్ చెమటోడ్చి విజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిజ్వాన్ 53*, అయూబ్ 6, బాబర్ ఆజమ్ 33, ఫఖర్ జమాన్ 4 రన్స్ చేశారు. ఈ గెలుపుతో పాక్కు సూపర్-8 ఛాన్స్ సజీవంగా ఉంది.
Sorry, no posts matched your criteria.