News December 4, 2025

నేడు మార్గశిర పౌర్ణమి.. ఏం చేయాలంటే?

image

మార్గశిర మాసంలో గురువారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. నేడు ఈ వారం పౌర్ణమి తిథితో కలిసి వచ్చింది. కాబట్టి నేడు లక్ష్మీదేవితో పాటు చంద్రున్ని కూడా పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు అంటున్నారు. ఈరోజు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మీ వైభవం కలుగుతుందని, చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే మానసిక శాంతి లభిస్తుందని చెబుతున్నారు. ☞ ఈ వ్రతాలు ఎలా, ఏ సమయంలో చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 4, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) కోట్‌ద్వారా యూనిట్‌లో 14 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ C పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ITI, అప్రెంటిషిప్ ఉత్తీర్ణులైన, 28ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News December 4, 2025

వ్యర్థాలు తగలబెడితే సాగుకు, రైతుకూ నష్టం

image

సుమారు 80-90 శాతం రైతులు పంటకాలం పూర్తయ్యాక మిగిలిన వరి కొయ్యలను, పత్తి, మిరప, మొక్కజొన్న కట్టెలను పొలంలోనే మంటపెట్టి కాల్చేస్తున్నారు. ఈ సమయంలో విడుదలయ్యే వేడితే భూమి సారాన్ని కోల్పోతుంది. పంట పెరుగుదలకు అవసరమయ్యే సేంద్రియ కర్బనం, నత్రజని, పాస్పరస్‌ లాంటి పోషకాల శాతం తగ్గుతుంది. పంట వ్యర్థాలను తగలబెట్టేటప్పుడు విడుదలయ్యే పొగ వల్ల తీవ్ర వాతావరణ కాలుష్యంతో పాటు రైతుల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది.

News December 4, 2025

మార్గశిర గురువారం.. ఎందుకంత ప్రత్యేకం?

image

హిందూ సంప్రదాయంలో శ్రావణం, మాఘం, కార్తీకం, మార్గశిరం వంటి కొన్ని పవిత్ర మాసాలున్నాయి. ఈ మాసాల్లో కొన్ని వారాలు దైవారాధనకు అత్యంత విశిష్టమైనవిగా చెబుతారు. అలాగే మార్గశిర గురువారాన్ని శుభదినంగా భావిస్తారు. ఈరోజున కనక మహాలక్ష్మిని పూజిస్తే.. సిరిసంపదలకు లోటుండదని నమ్ముతారు. ఈ ఏడాది ఈ మార్గశిర గురువారం పౌర్ణమి కలయికతో వచ్చింది. అందుకే ఈ రోజును అతి పవిత్రమైన, శ్రేష్ఠమైన రోజుగా పండితులు చెబుతున్నారు.

News December 4, 2025

మోదీ, పుతిన్ చర్చించే అంశాలు ఇవే..

image

భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు <<18463791>>పుతిన్<<>> పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వాణిజ్యం, డిఫెన్స్ కోఆపరేషన్, ఆయిల్, న్యూక్లియర్ ఎనర్జీ, వర్కర్లపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్లను నేలమట్టం చేసింది. వాటితో పాటు S-500లు, బ్రహ్మోస్ మిస్సైళ్లు, Su-57 ఫైటర్ జెట్ల కొనుగోళ్లపై ఒప్పందాలు జరగనున్నాయి.

News December 4, 2025

తొలి విడత.. ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!

image

TG: రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థులకు తెలుగు అక్షర క్రమం ఆధారంగా EC గుర్తులు కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి 30 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా 400కుపైగా స్థానాలు ఏకగ్రీవమవుతాయని అంచనా వేశాయి. రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకు 28,278 మంది, 38,342 వార్డు స్థానాలకు 93,595 మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం.

News December 4, 2025

అమరావతిలో భూసమీకరణపై ప్రశ్నలు!

image

AP: రాజధాని అమరావతిలో భూసమీకరణపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో సేకరించిన 32వేల ఎకరాల్లో పనులు ఓ కొలిక్కి రాకముందే రెండో విడతలో 16వేల ఎకరాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మూడో విడత భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గన్నవరంలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో మరో ఎయిర్‌పోర్ట్ ఎందుకని అంటున్నారు. దీనిపై మీ COMMENT?

News December 4, 2025

ఏయే పూజలకు ఏ సమయం అనుకూలం?

image

పౌర్ణమి తిథి నేడు ఉదయం 8.37AMకి ప్రారంభమై, రేపు తెల్లవారుజామున 4.43AMకి ముగుస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసే ఏ పూజలైనా, వ్రతాలైనా ఈ సమయంలో చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నేడు ఉదయం 6.59AM – 2.54PM మధ్యలో రవి యోగం ఉంటుందని, ఈ సమయంలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. లక్ష్మీ, సత్యనారాయణ వ్రతాలతో పాటు శివాభిషేకం, ఇతర పూజలు ప్రదోష కాలంలో చేయాలంటున్నారు.

News December 4, 2025

14,967 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ( ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.

News December 4, 2025

పంటను బట్టి యూరియా వాడితే మంచిది

image

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.