India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

PSLV-C62 ప్రయోగం విఫలం కావడంతో అందులోని 16 ఉపగ్రహాల పరిస్థితేంటనే సందేహం వ్యక్తమవుతోంది. కక్ష్యలోకి చేరడానికి కావాల్సిన వేగం అందకపోవటంతో అవి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని ఇస్రో మాజీ ఇంజినీర్ ఒకరు వివరించారు. గాలితో రాపిడి వల్ల మంటలంటుకొని కాలి బూడిదైపోతాయని తెలిపారు. చిన్న శకలాలేమైనా మిగిలుంటే అవి సముద్రంలో పడిపోతాయన్నారు. సోమవారం సాయంత్రానికే ఇదంతా జరిగిపోయి ఉంటుందని వెల్లడించారు.

AP: తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో CM చంద్రబాబు పాల్గొని వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. ఇందులో చంద్రబాబు, బాలయ్య మనవళ్లు కూడా పాల్గొన్నారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి గిఫ్ట్స్ అందజేశారు.

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ <<18824314>>ఆరోపణల్లో<<>> నిజం లేదని ఆమె మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ అన్నారు. ‘ఆమెకు జూనియర్ బాక్సర్తో వివాహేతర సంబంధం ఉండేది. ఫ్యామిలీ సర్దిచెప్పినా మళ్లీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకు నా దగ్గర వాట్సాప్ మెసేజ్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధాలు నడిపించాలనుకుంది. అందుకే విడాకులు తీసుకుంది’ అని IANS ఇంటర్వ్యూలో చెప్పారు.

TG: జిల్లాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైరయ్యారు. అశాస్త్రీయంగా చేసిన జిల్లాలను మళ్లీ శాస్త్రీయంగా మారుస్తామని సీఎం రేవంత్ చెప్పారని తెలిపారు. రాష్ట్రాన్ని <<18838995>>అగ్నిగుండంగా<<>> చేస్తామంటే చూస్తూ ఊరుకోమని బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 100 పర్సెంట్ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

పసుపును ఉడకబెట్టిన తర్వాత శుభ్రం చేసిన పదునైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ నేలపై కుప్పగా పోయాలి. ఒకరోజు తర్వాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. మరీ పలుచగా పరిస్తే పసుపు రంగు చెడిపోతుంది. పరిచిన పసుపును మధ్యాహ్నం సమయంలో తిరగబెడితే సమానంగా ఎండుతాయి. పసుపు దుంపలు లేదా కొమ్ముల్లో తేమ 8 శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. ఈ స్థితికి రావడానికి 18- 20 రోజులు పడుతుంది. రాత్రివేళ టార్పాలిన్లు కప్పాలి.

సంక్రాంతి పండుగకు ముగ్గులు వేయడం మన సంప్రదాయం. అయితే అందులో బియ్యప్పిండి కలపడం ద్వారా చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించిన వాళ్లమవుతాం. పూర్వం ముగ్గులో బియ్యప్పిండి కలిపే వేసేవారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి, పూలతో అలంకరించడం వల్ల ఆ ప్రాంతం మహాలక్ష్మికి నివాసంగా మారుతుందని నమ్మకం. రథాల ముగ్గులు వేయడం వల్ల అమ్మాయిలలో సృజనాత్మకత పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇరాన్లో జరుగుతున్న అల్లర్ల ప్రభావం మన బాస్మతీ బియ్యంపై పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు కిలోకు ₹5-10 వరకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5.99 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇరాన్కు ఎగుమతి అయ్యాయి. అక్కడ గొడవలతో పేమెంట్లు ఆగిపోవడం, షిప్మెంట్లు ఆలస్యం కావడంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్లో అస్థిరత వల్ల ధరలు ఇంకా తగ్గొచ్చని అంచనా.

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలలో జాప్యంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చిత్రానికి అడ్డంకులు సృష్టించడం ‘తమిళ సంస్కృతిపై దాడి’ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ తమిళ ప్రజల గొంతును ఎప్పటికీ నొక్కలేరని Xలో పోస్ట్ చేశారు. దీనిపై BJP స్పందిస్తూ రాహుల్ అబద్ధాల కోరు అని.. గతంలో జల్లికట్టును ‘అనాగరికమైనది’గా పేర్కొన్న కాంగ్రెస్సే తమిళుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించింది.

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్ (SAMEER) 147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు JAN 25వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష FEB 1న నిర్వహించనున్నారు. వెబ్సైట్: https://sameer.gov.in/
Sorry, no posts matched your criteria.