News December 6, 2025

పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

image

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్‌ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్‌ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.

News December 6, 2025

అన్నింటా ఉన్నవాడే ‘వేంకటేశ్వరుడు’

image

సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః|
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః||
దేవతలకు అధిపతి, మనందరికీ శరణమిచ్చేవాడు, సహనశీలుడు, విశ్వానికి బీజము, జీవుల సృష్టికి కారణము వేంకటేశ్వరుడే. దినం, సంవత్సరం, సర్పం కూడా ఆయనే. విశ్వాసానికి మూలంగా, సమస్తాన్ని చూడగలిగే సర్వదర్శనుడిగా ఆయన సృష్టి, కాలం, రక్షణ, జ్ఞాన రూపాలలో అన్నింటా ఉంటాడు. అయన దర్శనం ముక్తికి మార్గం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 6, 2025

ఈ రోజు రాత్రి నుంచి జాగ్రత్త!

image

తెలంగాణలో కోల్డ్ వేవ్ ప్రారంభమైందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో ఈ ఉదయం 6 గం.కు అత్యల్పంగా 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లోనూ సింగిల్ డిజిట్ టెంపరేచర్, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు రాత్రి నుంచి కోల్డ్ వేవ్ ప్రభావం పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News December 6, 2025

న్యూస్ రౌండప్

image

⋆ నేడు నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ పర్యటన
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
⋆ నేషనల్ హెరాల్డ్ కేసులో DK శివకుమార్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. DEC 19న విచారణకు రావాలని ఆదేశం
⋆ నేడు మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి
⋆ శాంతిభద్రతల పరిరక్షణకు HYDలో ‘ఆపరేషన్ కవచ్’.. నిన్న అర్ధరాత్రి దాదాపు 5,000 మంది పోలీసులతో ఏకకాలంలో 150 ప్రాంతాల్లో తనిఖీలు

News December 6, 2025

ఫోన్‌ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. ఎందుకోసం?

image

ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) వ్యవస్థ నిరంతరం యాక్టివేట్ చేసి ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ మేకర్లకు ఆదేశాలివ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసుల దర్యాప్తులో ప్రభుత్వ ఏజెన్సీలు లొకేషన్ కోసం సెల్యులార్ టవర్ డేటాపై ఆధారపడుతున్నాయి. కానీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో A-GPSను తప్పనిసరి చేయాలని టెలికాం సంస్థలు ప్రతిపాదించాయి.

News December 6, 2025

ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. భద్రతకు ముప్పు!

image

కేంద్రం పరిశీలిస్తున్న ఫోన్ల లొకేషన్ ట్రాకింగ్ అంశాన్ని యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్ల ప్రైవసీకి విరుద్ధమని, ఫోన్లు నిఘా పరికరాలుగా మారుతాయని అంటున్నట్లు సమాచారం. ‘ట్రాకింగ్ తప్పనిసరి చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. యూజర్లలో సైన్యానికి చెందిన వారు, జడ్జిలు, జర్నలిస్టులు ఉంటారు. భద్రతా పరమైన సమస్యలు వస్తాయి’ అని చెబుతున్నట్లు Reuters తెలిపింది.

News December 6, 2025

పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏమందంటే..?

image

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనపై చైనా మీడియా స్పందించింది. 2 దేశాలు ఒంటరిగా లేవని ప్రపంచానికి పంపిన సందేశమని ‘గ్లోబల్ టైమ్స్’ చెప్పింది. ‘భారత్, రష్యా తమ సామర్థ్యాలను సొంతంగా, మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2 దేశాల మధ్య సమన్వయం, సహకారమే ఇందుకు నిదర్శనం. US, వెస్ట్ ఆంక్షలు ఫలించవు’ అని ఫారిన్ అఫైర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ చెప్పారని తెలిపింది.

News December 6, 2025

30ల్లోకి వచ్చారా..?

image

30ల్లోకి అడుగుపెట్టాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. కేవలం మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్‌ తప్పనిసరి. ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌‌లు చేయడం కూడా మంచిది.

News December 6, 2025

తమిళనాడులో ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి

image

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెందినవారిగా గుర్తించారు.

News December 6, 2025

చలికాలంలో ఉదయాన్నే వాకింగ్‌తో నష్టాలే ఎక్కువ!

image

వాకింగ్ శరీరానికి ఎంతో మంచిది. కానీ చలికాలం ఉదయాన్నే చేసే వాకింగ్‌తో లాభంకంటే నష్టాలే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. ‘చల్లటి గాలి ఊపిరితిత్తులపై ఒత్తిడి తెస్తుంది. BP పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. సడెన్‌గా చలిలోకి వెళ్లడంతో ఇమ్యూనిటీ ప్రభావం పడుతుంది. దాంతో తరచూ జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. మంచులో రోడ్డు సరిగ్గా కనిపించక పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది’ అని హెచ్చరిస్తున్నారు.