India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☛ బత్తాయిలో ఆకుముడత పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ బత్తాయిలో మంగునల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 3ml లేదా ప్రాపర్ జైట్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

డెలివరీ తర్వాత పిల్లలు చాలాకాలం రాత్రిళ్లు లేచి ఏడుస్తుంటారు. అయితే దీనికి డ్రీం ఫీడింగ్ పరిష్కారం అంటున్నారు నిపుణులు. డ్రీం ఫీడింగ్ అంటే నిద్రలోనే బిడ్డకు పాలివ్వడం. ముందు బేబీ రోజూ ఒకే టైంకి పడుకొనేలా అలవాటు చెయ్యాలి. తర్వాత తల్లి నెమ్మదిగా బిడ్డ పక్కన పడుకుని బిడ్డకు చనుబాలివ్వాలి. ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల బిడ్డ రాత్రంతా మేలుకోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఒక్కో టెంపుల్లో రూ.60కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
* సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సూపర్ సిక్స్, GSDP లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
* ఈ నెల 24న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.

భారత్పై 50% టారిఫ్లు విధించిన US అధ్యక్షుడు ట్రంప్పై ఆ దేశ చట్టసభలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సుంకాలను రద్దు చేయాలని ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా, మార్క్ విసీ, కృష్ణమూర్తి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్లు చట్టవిరుద్ధమని, INDతో సంబంధాలకు నష్టమని విమర్శించారు. <<18529624>>పుతిన్-మోదీ<<>> భేటీపైనా USలో ప్రకంపనలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ట్రంప్కు ఎదురుదెబ్బేనని నిపుణులు అంటున్నారు.

శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. శివలింగంపై ఒకసారి సమర్పించిన పత్రాన్ని శుద్ధి చేసి, మళ్లీ పూజకు ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు. ‘శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో ఒక్క దళం సమర్పించినా కూడా చాలు. అది ఎంతో పవిత్రమైనది. పూజకు ప్రతిసారి కొత్త పత్రాన్నే సమర్పించాల్సిన నియమం లేదు. అదే పత్రాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల పూజారాధన ఫలితం ఏమాత్రం తగ్గిపోదు’ అని అంటున్నారు.

35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్ల డెలివరీలో కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్లాసెంటా ప్రీవియా, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకముందే డెలివరీ కావడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే పుట్టే బిడ్డల్లో కూడా డౌన్ సిండ్రోమ్, బిడ్డకు బీపీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డెలివరీ దగ్గర పడే కొద్దీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రెగ్నెన్సీ లేట్ అయినపుడు ముందు డాక్టర్ను సంప్రదించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. సమతుల్య ఆహారం, మితమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించటం, మద్యం, ధూమపానం మానేయటం చేయాలి. ముఖ్యంగా సెల్–ఫ్రీ డీఎన్ఏ స్క్రీనింగ్, మెటర్నల్ బ్లడ్ స్క్రీనింగ్, NT స్కాన్, 20 వారాలప్పుడు అనామలీ స్కాన్ వంటి పరీక్షల్ని తప్పనిసరిగా చేయిస్తే హెల్తీ బేబీకి జన్మనివ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

TG: ఈ నెల 15న రవీంద్రభారతిలో ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని CM రేవంత్, మాజీ VP వెంకయ్య ఆవిష్కరించనున్నారు. అదేరోజు 4PMకు సినీ సంగీత స్వరనీరాజనం ఉంటుందని సంస్థ అధ్యక్షుడు అచ్యుత రామరాజు తెలిపారు. ఎంట్రీ పాసుల కోసం 14న 3PMకు రవీంద్ర భారతిలో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటీవల బాలు విగ్రహం ఏర్పాటు విషయంలో <<18452414>>వివాదం<<>> నెలకొన్న విషయం తెలిసిందే.

<

వెనిజుల-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వెనిజుల తీరం వెంబడి USకు చెందిన F/A-18 జెట్లు దాదాపు 40 నిమిషాల పాటు తిరిగాయి. అదే విధంగా బాంబర్లు, ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ డ్రోన్లు చక్కర్లుకొడుతుండటం ఉద్రిక్తతలకు దారితీసింది. తీరానికి 20 మైళ్ల దూరం వరకు ఇవి వచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఆ దేశంపై <<18453636>>దాడి<<>> చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.