India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీ20ల్లో ఒక్క ఇయర్లో 5సార్లు డకౌట్ అయిన తొలి ఇండియన్ ప్లేయర్గా శాంసన్ నిలిచారు. అయితే, T20Iలో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్ కూడా ఈయనే. సంజూ ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో తొలి రెండింటిలో సెంచరీలు బాదగా.. చివరి రెండింట్లో డకౌటై పెవిలియన్ చేరారు. తిరిగి ఫామ్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

TG: పెద్దపల్లి జిల్లాలో రాఘవపురం-రామగుండం రైల్వే లైన్ పునరుద్ధరణ పనులను రైల్వేశాఖ వేగవంతం చేసింది. అప్లైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాఘవపురం-రామగుండం మధ్య అధికారులు గూడ్స్ రైలును నడిపించారు. నిన్న రాఘవపురం వద్ద గూడ్స్ <<14596360>>రైలు పట్టాలు తప్పడంతో<<>> ఢిల్లీ, చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.

దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నవంబర్ 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన లక్కీ భాస్కర్ సూపర్హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరింది.

TG: KTRను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా? అనే చర్చ రాజకీయ, BRS పార్టీ వర్గాల్లో నెలకొంది. ORR టెండర్లు, ఫార్ములా వన్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల్లో KTR ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించారు. ఇటీవల ఫార్ములా వన్ విషయంలో KTRపై కేసు పెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరగా, తాజాగా కొడంగల్లో కలెక్టర్పై దాడి రిమాండ్లో KTR పేరు ఉండటంతో కావాలనే టార్గెట్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

AP: నవంబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపేందుకు అత్యవసరంగా భేటీ కానుంది. కాగా ఈ నెల 22వ తేదీ వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

మెట్లను బోనులో బంధించడమేంటి అనుకున్నారా? తమిళనాడులోని కుంభకోణానికి దగ్గర్లో దారాసురం ఆలయంలో ఉండే మెట్లను పురావస్తు శాఖ అధికారులు బోనులో ఉంచి రక్షిస్తున్నారు. ఇవి సామాన్యమైన మెట్లు కాదు. సప్తస్వరాలను వినిపించే అరుదైన మెట్లు. చాలా చోట్ల స్థంభాల నుంచి ఇలా సప్తస్వరాలు వస్తుంటాయి. ప్రజలు పదే పదే మెట్లెక్కుతూ పాడు చేస్తుండటంతో వీటిని ఇలా సంరక్షిస్తున్నారు.

TG: డీఎస్సీ నియామకాలపై విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పున:పరిశీలించాలని నిర్ణయించింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయనుంది. నకిలీ ధ్రువపత్రాలు పెట్టి కొందరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల <<14557915>>ఖమ్మంలోనూ <<>>ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

* పెదాలు పగలడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణం. చలికాలం చాలామంది సరిపడా నీరు తాగరు. దీనివల్ల పెదాలు పొడిబారి, పగులుతాయి.
* పెదాలు కాస్త డ్రై అవగానే వాటిని నాలుకతో తడుపుతారు. ఇది పెదాలు మరింత పగలడానికి కారణం. పెదాలపై ఉండే స్కిన్ను కొరికేయవద్దు.
* విటమిన్ బీ, ఫ్యాటీ యాసిడ్లు, మినరల్స్ కలిగిన ఆహారం తీసుకోండి.
* బయటికి వెళ్లేటప్పుడు కచ్చితంగా మంచి లిప్బామ్/పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోండి.

సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ రెండో బంతికే అతడిని జాన్సెన్ క్లీన్ బౌల్డ్ చేశారు. తొలి మ్యాచ్లో సెంచరీతో విరుచుకుపడ్డ సంజూ రెండో టీ20లో డకౌట్ అయ్యారు. తాజాగా ఈ మ్యాచ్లోనూ ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో అతడి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

పాకిస్థాన్ & USకు చెందిన ప్రభాస్ అభిమానులు ఇయాజ్, లారెన్ ఒక్కటవుతున్నారు. వీరిద్దరూ ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమలో పడ్డారు. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. ‘రెండు వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు ప్రభాస్ వీరాభిమానులు కలిసి తమ జీవితాలను ఆస్వాదించబోతున్నారు. లారెన్ కోసం సప్త సముద్రాలను దాటొచ్చా’ అని ఇయాజ్ ట్వీట్ చేశారు. కాగా ప్రభాస్ ఫ్యాన్స్ వీరికి విషెస్ చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.