India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసానిచ్చారు. పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామీనిచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న ఆయన, డిసెంబర్ నెలాఖరులోపు రూ.13 వేల కోట్ల పెండింగ్ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులకు డిసెంబర్లో నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు.

దిగ్గజ వాయిద్యకారుడు పండిట్ రామ్ నారాయణ్(96) కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో ఆయన స్వర్గస్థులైనట్లు కుటుంబీకులు తెలిపారు. 1927లో ఉదయ్పూర్లో జన్మించిన నారాయణ్ హిందుస్థానీ సంగీతంతోపాటు సారంగి వాయిద్యగానంలో నిష్ణాతులు. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో పద్మవిభూషణ్, 1974-75లో సంగీత నాటక అకాడమీ అవార్డుల్ని అందుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జోడూరు పాఠశాలలో గిరిజన విద్యార్థులు తమకు టీచర్ కావాలంటూ <<14563913>>నిరసన<<>> వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. టీచర్ను నియమించాలని ఐటీడీఏ పీవోను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం నుంచి ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారని చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ వైట్వాష్ కావడంపై BCCI పెద్దలు జై షా, రోజర్ బిన్నీ 6 గంటల పాటు రివ్యూ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్ పాల్గొన్న ఈ మీటింగ్లో గంభీర్పైనే బోర్డు పెద్దలు ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ‘శ్రీలంకతో వన్డేల్లో, తాజాగా టెస్టుల్లో ఎందుకీ ఫలితాలొచ్చాయి? కారణాలేంటి?’ అంటూ వారు ఆయన్ను నిలదీసినట్లు సమాచారం.

తెలంగాణలో కులగణన ప్రారంభమైనట్లు PM మోదీకి తెలియజేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఈ డేటాను ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తామని చెప్పారు. మహారాష్ట్రలోనూ ఇదే చేస్తామని పరోక్షంగా గెలుపు తమదేనని తెలిపారు. సమగ్ర కులగణన చేయడం BJPకి ఇష్టం లేదని అందరికీ తెలుసన్నారు. త్వరలోనే పార్లమెంటులో కులగణన తీర్మానం చేసి 50శాతం రిజర్వేషన్ను బ్రేక్ చేస్తామని పేర్కొన్నారు.

TG: కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదని కేసీఆర్ అన్నారు. ‘మాకు మాటలు రావనుకున్నారా? ఇవాళ మాట్లాడటం మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. కూలగొడతామంటూ భయపెడతారా? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు నిర్మించడానికి. రౌడీ పంచాయితీలు మాకు కూడా తెలుసు. మేం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువ చేశాం’ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తామని BRS నేత హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, విద్యార్థులు, పోలీసులు.. ఇలా అన్ని వర్గాల వారు రోడ్లెక్కుతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మంత్రులు గాలి మోటార్లు ఎక్కి గాల్లో తిరుగుతున్నారని, భూమిపై తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయని సంగారెడ్డి రైతు దీక్షలో అన్నారు.

TG: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. డిసెంబర్ 29న CBT విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొంది. గతంలో విడుదలైన నోటిఫికేషన్కు దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తైంది. అటు రేపు జరిగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించింది.

TG: దళిత బంధు ఇవ్వాలని అడిగితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేస్తారా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ప్రశ్నిస్తే దాడి చేయడమా అని మండిపడ్డారు. పాలకుల వద్ద మెప్పు పొందేందుకు పోలీసులు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో చెల్లిస్తామని హెచ్చరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ కక్ష పెంచుకున్నారని విమర్శించారు.

AP: తిరుమల మాదిరిగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం మంత్రులు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్, ఆనం, బీసీ.జనార్ధన్తో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి 40 నిమిషాల్లో వచ్చామని ప్రెస్మీట్లో చెప్పారు.
Sorry, no posts matched your criteria.