News September 26, 2024

లెబనాన్‌లో వందల్లో ప్రాణనష్టం.. నిరాశ్రయులుగా 90 వేల మంది

image

హెజ్బొల్లా మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లుతోంది. బుధవారం జరిపిన క్షిపణి దాడుల్లో 51 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, 90 వేల మందికి పైగా సామాన్యులు నిరాశ్రయులు అయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇటు హెజ్బొల్లా సైతం ప్రతిదాడులకు దిగింది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

News September 26, 2024

బాబాయ్.. అబ్బాయ్‌లకు గడ్డు పరిస్థితులు!

image

AP: YCP హయాంలో తమ సెగ్మెంట్లలో చక్రం తిప్పిన కేతిరెడ్డి పెద్దారెడ్డి(తాడిపత్రి), వెంకటరామిరెడ్డి(ధర్మవరం) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే చర్చ నడుస్తోంది. వెంకటరామిరెడ్డికి పెద్దారెడ్డి బాబాయ్ అవుతారు. తాడిపత్రిలో అల్లర్ల వల్ల పెద్దారెడ్డి సొంతూరికి వెళ్లలేకపోతున్నారు. ధర్మవరంలో YCP-BJP వార్ నడుస్తోంది. ఇటీవల నిరసనకారులపై కారు ఎక్కించారంటూ వెంకటరామిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది.

News September 26, 2024

రెండో విడతలో 56శాతం పోలింగ్ నమోదు

image

జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 56% ఓటింగ్ నమోదైందని, ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు. శ్రీమాతా వైష్ణోదేవీ సీటులో అత్యధికంగా 75.29% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. 72.71% పోలింగ్‌తో పూంచ్ హవేలీ రెండో స్థానంలో నిలిచింది. SEP 18న జరిగిన తొలి విడతలో 59% పోలింగ్ నమోదైంది. మూడో విడత OCT 1న జరగనుంది. 8వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

News September 26, 2024

అక్టోబర్ 23 వరకు బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లు

image

బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లను అక్టోబర్ 23లోపు పూర్తి చేసుకోవాలని కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన 2024-25 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ సవరించింది. అక్టోబర్ 23లోపు ఫస్టియర్ తరగతులను ప్రారంభించాలంది. లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాల గడువును సైతం అక్టోబర్ 23గానే ఖరారు చేసింది.

News September 26, 2024

రూ.లక్ష కోట్ల మైలురాయిని చేరుకోవడమే టార్గెట్: SBI ఛైర్మన్

image

దేశంలో రూ.లక్ష కోట్ల నికర లాభాన్ని సాధించిన తొలి బ్యాంకుగా అవతరించడమే తమ లక్ష్యమని ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. వచ్చే 3-5 ఏళ్లలో ఆ మైలురాయిని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సమానంగా కస్టమర్ సెంట్రిసిటీకి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల నికర లాభాన్ని ఎస్‌బీఐ నమోదు చేసింది.

News September 26, 2024

పాక్ కాదు.. మేమే సెమీస్ చేరుతాం: అఫ్గాన్ కెప్టెన్

image

ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో అఫ్గానిస్తాన్ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు కచ్చితంగా సెమీస్ చేరుతుందని ఆ టీమ్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది అన్నారు. తమతో పాటు AUS, IND, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుతాయని అంచనా వేశారు. కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాకిస్థాన్ పేరును షాహిది పక్కన పెట్టడం గమనార్హం.

News September 26, 2024

జగన్.. తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకోండి: మంత్రి అచ్చెన్న

image

AP: తిరుమల కొండను అపవిత్రం చేసిన పాపం జగన్‌ను ఊరికే వదలదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘జగన్.. శిశుపాలుడిలా మీ నూరు తప్పులు పూర్తయ్యాయి. ఇప్పటికైనా ఆ భగవంతుడి ముందు తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుని పూజలు చేయండి. చేసిన పాపానికి కొంతైనా పరిహారం దొరుకుతుంది’ అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా పథకాలు ఆపడం లేదన్నారు. అనర్హులు పథకాలు పొందకుండా కట్టడి చేస్తామన్నారు.

News September 26, 2024

అడ్వాన్స్‌డ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్.. 360 డిగ్రీల ప్రొటెక్షన్

image

డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్ ఫర్ హైఎనర్జీ డిఫీట్ పేరుతో ఓ తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను తయారు చేశారు. దీని ముందు, వెనక ఉండే కవచాలు 360 డిగ్రీల రక్షణను అందజేస్తాయని రక్షణ శాఖ తెలిపింది. 8.2 కేజీలు, 9.5 కేజీల కనీస బరువుతో వీటిని రూపొందించినట్లు పేర్కొంది. పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలను దీని తయారీలో ఉపయోగించినట్లు తెలిపింది.

News September 26, 2024

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం: ఉత్తమ్

image

TG: నీటి పారుదల శాఖను గత BRS ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టు తమకు ప్రాధాన్యమని, దీంతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతలనూ పూర్తి చేస్తామని తెలిపారు. 6 నెలల్లోపు ఉదండాపూర్, బీమా, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.

News September 26, 2024

‘కల్కి 2898 ఏడీ’ మూవీకి మరో అరుదైన అవకాశం

image

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు అరుదైన అవకాశం దక్కింది. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అక్టోబర్ 2 నుంచి 11వ తేదీ వరకు ఈ మూవీని ప్రదర్శించనున్నారు. 8, 9 తేదీల్లో BIFFలోని బహిరంగ థియేటర్‌లో షోలు వేయనున్నారు. ఈ ఏడాది జూన్‌లో రిలీజైన ఈ సినిమా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే.