India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్(83) అనారోగ్యంతో ఇవాళ కేరళలోని ఎర్నాకుళంలో కన్నుమూశారు. జోసెఫ్, అలియమ్మ దంపతులకు ఐదుగురు పిల్లలు కాగా, మీరా అందరికంటే చిన్నవారు. ఈమె తెలుగు, తమిళం, మలయాళంలో 50కి పైగా చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. భద్ర, గుడుంబా శంకర్, పందెం కోడి(డబ్బింగ్), రారాజు, మహారథి, గోరింటాకు తదితర తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

TG: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలు పెరగడంతో BRS వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్లోని BRS కేంద్ర కార్యాలయమైన ‘తెలంగాణ భవన్’లో వాస్తు మార్పులు చేయాలని నిర్ణయించారు. వాయవ్య దిశలో ఉన్న గేటు నుంచి కాకుండా ఈశాన్యంలోని గేటు నుంచి రాకపోకలు సాగించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా వాహనాల కోసం ర్యాంపు నిర్మిస్తున్నారు. లోపల కూడా స్వల్ప మార్పులు, చేర్పులు చేస్తున్నారు.

PM మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ‘భయపడట్లేదు అంటున్న మీరు, భారత్లోకి చైనా చొరబడుతుంటే ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నిద్రమాత్రలు తీసుకున్నారా? విదేశాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్న మోదీ మణిపూర్కు ఎందుకు వెళ్లట్లేదు? కుటుంబ పాలన గురించి మాట్లాడతారు, కానీ 1989 తర్వాత గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ప్రధాని లేదా మంత్రి అయ్యారా?’ అని ప్రశ్నించారు.

AP: న్యాయం కోసం పోరాడుతున్న తనకు ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. ‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక నెరవేర్చేందుకు ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నా. మీ రాజన్న బిడ్డను దీవించాలని ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నా. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.

సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో హృతిక్ రోహన్, దీపికా పదుకొణే జంటగా నటించిన ఫైటర్ సినిమా నెట్ఫ్లిక్స్లో అదరగొడుతోంది. 10 రోజుల్లోనే 12.5M వ్యూస్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. నెట్ఫ్లిక్స్లో అత్యంత వేగంగా ఈ మార్క్ చేరుకున్న బాలీవుడ్ సినిమాగా నిలిచినట్లు తెలిపారు. యానిమల్, డంకీ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం థియేటర్లలో దాదాపు రూ.350 కోట్ల కలెక్షన్లను సాధించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 8న విడుదల కానుండగా మాస్ జాతర మరో నాలుగు రోజుల్లో అంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. దీనికి ఓ ఫొటోను జతచేసి ‘పుష్ప ది రూల్ టీజర్.. ఉత్సాహం, ఉల్లాసం, అనుభూతిని పంచుతుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్గా రిలీజ్ అవుతుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.

AP: బీజేపీ, జనసేనతో కలిసి 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవైనా అమలు చేశారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. నాయుడుపేట సభలో మాట్లాడుతూ.. ‘రూ.87వేల కోట్ల రైతు రుణ మాఫీ చేశారా? రూ.14వేల కోట్ల డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేశారా? ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేశారా? ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చారా? పేదలకు ఒక్క సెంటు స్థలం ఇచ్చారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా?’ అని నిలదీశారు.

AP: తనకు పేదలపై ఉన్న ప్రేమ దేశంలో ఏ నాయకుడికీ లేదని సీఎం జగన్ తెలిపారు. ‘అన్ని వర్గాలకూ మంచి చేశాననే ఆత్మవిశ్వాసంతో ప్రజల ముందుకొచ్చాను. సాధ్యంకాని హామీలను నేను మేనిఫెస్టోలో పెట్టను. జగన్ అమలు చేయలేని ఏ పథకమూ.. చంద్రబాబే కాదు ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేదు. ఆయన చెప్పే అబద్ధపు హామీలతో నేను పోటీ పడాలనుకోవడం లేదు. మోసపు వాగ్దానాలు చేయను. అబద్ధాలు చెప్పను’ అని స్పష్టం చేశారు.

AP: తాము అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పష్టం చేశారు. ‘వాలంటీర్ల వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. వారంతా వైసీపీకి పని చేయడం సరికాదు. ప్రజలకు సేవ చేయాలని వాలంటీర్లను కోరుతున్నా. ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుంది. కానీ జగన్ కావాలనే అలా చేయించలేదు’ అని చంద్రబాబు ఆరోపించారు.

AP: 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన పేరు చెబితే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు గుర్తుకు వస్తాయన్నారు. ‘జగన్కు నా అనేవాళ్లు పేదలు. చంద్రబాబుకు నా అనేవాళ్లు నాన్ లోకల్స్ అయిన TV5, ABN, ఈనాడు, దత్తపుత్రుడు. వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.