India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రత పెరిగి ధ్రువాల్లో మంచు కరుగుతోంది. దీంతో ద్రవ్యరాశి తగ్గి భూగమన వేగం నెమ్మదిస్తోందని ఓ అధ్యయనంలో తేలింది. దీనివల్ల 2029కి మన టైమ్ ఒక సెకన్ తగ్గిపోనుందని పేర్కొంది. దీన్ని ‘నెగెటివ్ లీప్ సెకన్’గా పిలుస్తారని వెల్లడించింది. ఇది కంప్యూటర్ నెట్వర్క్లో సమస్యను కలిగిస్తుందని, UTC(కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్)లో ముందుగానే మార్పులు చేయాల్సి ఉందని తెలిపింది.

హీరో సిద్ధార్థ్, అతిథి రావు హైదరి పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్లో వీరి వివాహం జరిగినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆలయంలోని పూజారులకు ముందుగా సినిమా షూటింగ్ అని చెప్పారట. తర్వాత పెళ్లి డెకరేషన్ చేసి తమిళనాడు పూజారుల సమక్షంలో మూడు ముళ్లతో ఒక్కటైనట్లు సమాచారం. అయితే వారి పెళ్లిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని ట్రుడో మరోసారి భారత్పై నోరుపారేసుకున్నారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణల్ని తేలిగ్గా కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరుల్ని కాపాడుకోవడం తమ బాధ్యతన్నారు. కేసు దర్యాప్తులో భారత్తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించారు. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లలో అతడు భాగస్వామిగా ఉన్నారు. 2013లో ఆర్సీబీ 263 రన్స్ చేయగా అప్పుడు అతడు బెంగళూరు తరఫున ఆడారు. నిన్నటి మ్యాచ్లో 277 పరుగులతో ఆర్సీబీ రికార్డును బద్దలు కొట్టిన SRHకు ఉనద్కత్ ప్రాతినిధ్యం వహించారు. ఈ రెండు మ్యాచుల్లోనూ జయదేవ్ ఉనద్కత్ రెండేసి వికెట్లు తీయడం విశేషం.

తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం పని చేశానని CM జగన్ అన్నారు. బస్సు యాత్ర చేస్తున్న CM.. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ‘నా కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన CMగా చేశారు. ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా? పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. స్కూళ్లు బాగుపడ్డాయి, వైద్య రంగం బాగుపడింది’ అని జగన్ అన్నారు.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు జోరు కనబరుస్తున్నాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 830 పాయింట్లు తాకి 73,826కు చేరింది. మరోవైపు నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 22,370కు చేరింది. రియల్టీ మినహా ఇతర ప్రధాన రంగాలన్నీ 0.5-1శాతం లాభాలతో ట్రేడవడం మార్కెట్కు కలిసొచ్చింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, హీరోమోటోకార్ప్, JSWస్టీల్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ను పారదర్శకంగా విచారిస్తారని ఆశిస్తున్నామంటూ జర్మనీ, అమెరికాలు కామెంట్ చేసి కేంద్రం నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ఇప్పటికే ఇరు దేశాల దౌత్యవేత్తలను పిలిచి కేంద్రం నిలదీసింది. దీంతో జర్మనీ వెనక్కి తగ్గింది. భారత రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందని పేర్కొంది. అయితే US మాత్రం గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ఈ కేసు విచారణను సమగ్రంగా పరిశీలిస్తామని మరోసారి కామెంట్ చేసింది.

AP: చీపురుపల్లి, భీమిలి TDP MLA అభ్యర్థుల ఎంపిక పీటముడిగా మారింది. మాజీ మంత్రి గంటా చీపురుపల్లిలో పోటీ చేస్తే భీమిలిలో కళా వెంకట్రావు, నెల్లిమర్ల TDP ఇన్ఛార్జ్ బంగార్రాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గంటా చీపురుపల్లిలో పోటీ చేయకుంటే అక్కడ కళా వెంకట్రావు, కిమిడి నాగార్జునలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. విజయనగరం MP స్థానానికీ వెంకట్రావు, నాగార్జున, బంగార్రాజు, గీత పేర్లు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ ED కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ మ.2 గంటలకు ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీని పొడిగించాలని కోరే అవకాశాలున్నాయి. లేదంటే ఆయనను రిమాండ్కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో MLC కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు.

ఓవైపు టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ట్రెండ్ నడుస్తుంటే అర్జెంటీనాలో ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఈ ముప్పు వెంటాడనుంది. ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలెయ్ 70వేల మందిని తొలగించాలని ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు పలు ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు నిలిపివేస్తున్నామని.. 2లక్షలకుపైగా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతే ఇందుకు కారణమట. కాగా అక్కడ 35లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.