News August 13, 2024

పెయింట్-3Dని ఆపేస్తున్న మైక్రోసాఫ్ట్‌

image

పెయింట్-3డీని ఈ ఏడాది నవంబరు తర్వాతి నుంచి ఆపేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. తొలిసారిగా విండోస్-10లో దీన్ని సంస్థ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చాలా తక్కువమంది దాన్ని వాడటం, వేరే అప్లికేషన్లను ప్రవేశపెట్టే ఆలోచన ఉండటంతోనే నిలిపివేస్తున్నట్లు సంస్థ వివరించింది. ప్రస్తుతం వాడుతున్న వారికి యథావిధిగా పనిచేస్తుందని, నవంబరు నుంచి కొత్తగా అప్‌డేట్స్ లేదా డౌన్‌లోడ్స్‌కు వీలు ఉండదని తెలిపింది.

News August 13, 2024

Stock Market: భారీ నష్టాలు

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్నాయి. సెబీ చీఫ్ మాధ‌బిపై హిండెన్‌బ‌ర్గ్ ఆరోప‌ణ‌లు చేసి ఒక రోజు ట్రేడింగ్ సెష‌న్ ముగిసిన త‌రువాత సూచీలు నష్టాల బాటపట్టడం గమనార్హం. సెన్సెక్స్ 692 పాయింట్ల నష్టంతో 78,956 వద్ద నిలిచింది. నిఫ్టీ 208 పాయింట్లు న‌ష్ట‌పోయి 24,150 దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు టాప్ లూజ‌ర్స్‌గా నిలిచాయి.

News August 13, 2024

సీబీఐకి ట్రైనీ డాక్టర్ హత్య కేసు

image

బెంగాల్‌లో వైద్య విద్యార్థిని హత్యాచారం కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రేపు ఉదయం 10 గంటల్లోపు ఈ కేసు విచారణ దస్త్రాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసు విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ నిర్వహణ లోపాలను న్యాయస్థానం ఎత్తిచూపింది.

News August 13, 2024

ఈ నెల 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

image

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నడుమ ఈ నెల 22న దేశ వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టడంతో పాటు సెబీ చీఫ్ మాధబి బుచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ నేతలతో సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన చేశారు. అదానీ గ్రూపులో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారని హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే.

News August 13, 2024

రోహిత్ శర్మ కెప్టెన్సీపై ద్రవిడ్ ప్రశంసలు

image

రోహిత్ శర్మ నాయకత్వంపై భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించారు. ఆటగాళ్లు అతడి లీడర్‌షిప్ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ‘జట్టు రాణించడం అనేది కచ్చితంగా కెప్టెన్‌పైనే ఆధారపడి ఉంటుంది. రోహిత్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఈ రెండున్నరేళ్లలో తానెంత అద్భుతమైన నాయకుడో గమనించాను. కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లు కూడా నాకు బాగా సహకరించారు’ అని తెలిపారు.

News August 13, 2024

EWS కోటా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

image

AP: వైద్య కళాశాలల్లో EWS కోటా సీట్ల జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సీట్లు పెంచకుండానే EWS కోటా అమలు చేస్తున్నారని, దీని వల్ల ఓపెన్ కేటగిరి కింద ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. సీట్లు పెంచి EWS కోటా కింద భర్తీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

News August 13, 2024

అడ‌ల్ట్రీపై చ‌ట్టం ఏం చెబుతోంది?

image

గ‌తంలో IPC సెక్షన్ 497 ప్రకారం అడల్ట్రీ ఒక క్రిమినల్ నేరం. 2018లో సుప్రీంకోర్టు సెక్ష‌న్ 497ను రాజ్యాంగ విరుద్ధంగా ప్ర‌క‌టించింది. 158 ఏళ్ల ఈ చ‌ట్టం ఆర్టిక‌ల్ 21 (జీవించే హ‌క్కు, వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ), ఆర్టిక‌ల్ 14 (స‌మాన‌త్వం)ని హ‌రిస్తుంద‌ని న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది. ఈ తీర్పు ప్ర‌కారం ఇష్టపూర్వక వివాహేతర బంధాలను క్రిమిన‌ల్ నేరంగా ప‌రిగ‌ణించ‌డం లేదు. ఈ విషయంలో సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చు.

News August 13, 2024

ఎమ్మెల్సీ స్థానానికి 2 నామినేషన్లు.. 30న పోలింగ్

image

AP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తంగా రెండే నామినేషన్లు రావడం గమనార్హం. రేపు నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.

News August 13, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

పసిడి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1040 పెరిగి రూ.71,620కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.952 పెరిగి రూ.65,650గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.1000 పెరిగి రూ.83,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.

News August 13, 2024

సీఎం గుడివాడ పర్యటన ఖరారు

image

AP: సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైంది. పంద్రాగస్టు రోజున అన్న క్యాంటీన్లను ఆయన గుడివాడలో ప్రారంభించనున్నారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభిస్తారని సమాచారం. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. వీటికి ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్ దక్కించుకుంది.