India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లిక్కర్ స్కాంలో MLC కవిత కీలక సూత్రధారి అని CBI పేర్కొంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ వాదనలు వినిపిస్తోంది. ఇదే కేసులో అప్రూవర్గా మారిన NOC పొందడంలో మాగుంట రాఘవకు సహకరించేందుకు కవిత ప్రయత్నించినట్లు ఆమె CA వాట్సాప్ చాటింగ్లో తేలిందని పేర్కొంది. ఢిల్లీ, HYDలో ఈ స్కాంకి స్కెచ్ వేసినట్లు వెల్లడించింది. కవిత సౌత్ గ్రూప్ నుంచి రూ.100కోట్లు సమీకరించి.. ఆప్ నేతలకు ఇచ్చినట్లు ఆరోపించింది.

ఏపీ ఇంటర్ బోర్డు కాసేపట్లో ఫలితాలు విడుదల చేయనుంది. విద్యార్థులు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలు వారికి మనోధైర్యం ఇవ్వాలని అధికారులు సూచించారు. విద్యార్థులు ఆందోళనలో ఉన్నా, తల్లిదండ్రులు లేదా సన్నిహితులు ఇంటర్ విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నట్లు గమనిస్తే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఆ నంబర్లు పైన ఇమేజ్లో చూడవచ్చు.

ఏపీ ఇంటర్ బోర్డు కాసేపట్లో ఫలితాలు విడుదల చేయనుంది. విద్యార్థులు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలు వారికి మనోధైర్యం ఇవ్వాలని అధికారులు సూచించారు. విద్యార్థులు ఆందోళనలో ఉన్నా, తల్లిదండ్రులు లేదా సన్నిహితులు ఇంటర్ విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నట్లు గమనిస్తే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఆ నంబర్లు పైన ఇమేజ్లో చూడవచ్చు.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’ (ATGM)ను భారత ఆర్మీ ప్రయోగించింది. త్రిశక్తి కార్ప్స్ ఆధ్వర్యంలో సిక్కింలోని గువాహటి సమీపంలో 17 వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించారు. పర్వత ప్రదేశాల నుంచి ఈ మిసైల్ను ప్రయోగించనున్నారు. ఈ మిస్సైల్స్ ఒక సైనికుడు తీసుకెళ్లేంత చిన్నవిగా ఉంటాయి.

బంగారం, వెండి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇవాళ మరోసారి రేట్లు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.1,090 పెరిగి రూ.73,310కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1000 పెరిగి రూ.67,200గా నమోదైంది. వెండి కూడా కేజీకి రూ.1500 పెరిగి రూ.90,000కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తోంది. మరో ఆరు రోజుల్లో (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవనుంది. నేటి నుంచి సరిగ్గా 32వ రోజు మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా రోడ్షోలు, సభలతో పార్టీల అధినేతలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

AP ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. BIEAP అధికారిక సైట్తో పాటు Way2News యాప్లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్తో వాట్సాప్ సహా ఏ ప్లాట్ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ప్రధాన నిందితుడు ముస్సావిర్ షాజీబ్ హుస్సేన్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. బాంబు పేలుళ్ల తర్వాత అతడు అస్సాం, పశ్చిమబెంగాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.

కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఎవరూ ఫెయిల్ కావాలని, మార్కులు తక్కువ రావాలని పరీక్షలు రాయరు. కానీ అనుకోని ఫలితం ఎదురైతే ఒత్తిడికి గురయ్యే యువ హృదయాలకు తల్లిదండ్రులు అండగా నిలవండి. నిరాశ చెందే మీ పిల్లలకు జీవితం అంటే ఇది మాత్రమే కాదని, ఇక్కడితోనే అంతా ఆగిపోదని భరోసానివ్వండి. భయాందోళనలో ఉండే మీ పిల్లలను కనురెప్పల్లా కాపాడుకోండి తప్ప.. భరించలేని భారంగా వారికి కన్పించవద్దని మనవి.

AP: ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఉండి టికెట్పై ఆయన స్పష్టత తీసుకునేందుకు చర్చలు జరపనున్నారు. కాగా ఉండి టికెట్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబుపై రామరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెబల్గానైనా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.