News March 29, 2024

అభిషేక్.. మరోసారి అలా ఔట్ అవ్వకు: యువరాజ్

image

సన్‌రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మను అభినందిస్తూనే సున్నితంగా హెచ్చరించాడు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్. ముంబైతో మ్యాచ్‌‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడినందుకు అభిషేక్‌ను ప్రశంసించారు. అయితే చెత్త షాట్‌కు ఔట్ కావడం మంచిది కాదని సూచించారు. మరోసారి ఇలా చేస్తే దెబ్బలు పడతాయంటూ పోస్ట్ చేశారు. కాగా మొన్న ముంబై, సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

News March 29, 2024

అభిషేక్ శర్మ తల్లిదండ్రులతో విజయ్ దేవరకొండ

image

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌‌ను చూసేందుకు వచ్చిన SRH ప్లేయర్ అభిషేక్ శర్మ తల్లిదండ్రులను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో వైరలవుతోంది. అభిషేక్ సిక్సులు, ఫోర్లతో అదరగొడుతుంటే అతని తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలారు. శర్మ 7 సిక్సులు, 3 ఫోర్లతో 63 రన్స్ చేశారు.

News March 29, 2024

లిప్‌స్టిక్ వాడుతున్నారా? జాగ్రత్త!

image

పెదవులు అందంగా కనిపించేందుకు చాలా మంది లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే లిప్‌స్టిక్‌లో కొన్ని హానికర లోహాలు, రసాయనాలు ఉంటాయని, ఇవి రక్తంలో కలిసిపోయి ఆరోగ్యానికి హాని చేస్తాయని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. లిప్‌స్టిక్‌ను సగటున రోజుకి రెండు సార్లు వాడటం వల్ల 24mg లోహాలు రక్తంలో కలుస్తాయని అంటున్నారు. ఒక మహిళ తన జీవితకాలంలో దాదాపు 1.8 కేజీల లిప్‌స్టిక్‌ను తనకు తెలియకుండానే తినేస్తుందట.

News March 29, 2024

USA జట్టులో ఉన్ముక్త్ చంద్‌కు దక్కని చోటు

image

USA టీ20 జట్టులో భారత్‌కు చెందిన ఉన్ముక్త్ చంద్ చోటు దక్కించుకోలేకపోయారు. USA తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేందుకు అతను భారత్‌ను వీడి వెళ్లారు. అక్కడ జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌ టోర్నీలో రాణించారు. 45 ఇన్నింగ్స్‌లో 1500 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా అతనికి నిరాశే ఎదురైంది. కెనడాతో జరిగే టీ20 సిరీస్‌కు అతడు సెలక్ట్ కాలేదు. దీంతో T20 WCలో అతడు ఆడే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

News March 29, 2024

హరీశ్‌రావు బీజేపీలో చేరతారు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: ఎంపీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావు బీజేపీలో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. తామేమీ చేరికల గేట్లు ఎత్తలేదని, ఆ పార్టీ వాళ్లే దూసుకొని వస్తున్నారని తెలిపారు. ఇది కేసీఆర్ నేర్పిన విద్యేనని, చేసిన పాపం ఆయనకే తగులుతోందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చిల్లర వ్యవహారమని పేర్కొన్నారు.

News March 29, 2024

హింసాత్మక చిత్రాలు చూడను.. నటిస్తా: ఆండ్రియా

image

కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హారర్, హింసాత్మక చిత్రాలు చూడనని, కానీ అలాంటి సినిమాల్లో నటిస్తానని చెప్పారు. చూడటం వేరు.. నటించడం వేరని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో కా- ది ఫారెస్ట్, పిశాచి-2, నో ఎంట్రీ తదితర మూవీల్లో నటిస్తున్నారు. ఇటీవలే తెలుగులో ‘సైంధవ్’లో కీలక పాత్ర పోషించారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గానూ రాణిస్తున్నారు.

News March 29, 2024

172 స్థానాలకు ప్రకటన.. 3 పెండింగ్

image

AP: టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మరో 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాలో జనసేన పోటీ చేసే మూడు నియోజకవర్గాలు పాలకొండ, విశాఖ సౌత్‌, అవనిగడ్డ ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ, జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

News March 29, 2024

బీజేపీ ట్యాక్స్ టెర్రరిజమ్‌కు పాల్పడింది: కాంగ్రెస్

image

ఐటీ శాఖ రూ.1823.08 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ ట్యాక్స్ టెర్రరిజమ్‌కు పాల్పడుతోందని.. తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అయినా తగ్గేది లేదని స్పష్టం చేసింది. ‘BJP కూడా ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ పార్టీపై ఉన్న రూ.4600 కోట్ల పెనాల్టీలకు సంబంధించి కూడా ఐటీ శాఖ నోటీసులు ఇచ్చి ఆ మొత్తాన్ని వసూలు చేయాలి’ అని డిమాండ్ చేసింది.

News March 29, 2024

రసవత్తరంగా పేట రాజకీయం.. అజ్ఞాతంలో YCP కౌన్సిలర్లు?

image

AP: చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం సాగుతోంది. YCP MLA అభ్యర్థి మనోహర్ నాయుడికి వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు తెలుస్తోంది. ఆయనకు సహకరించేది లేదని 12 మంది కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వీరంతా తొలుత వైసీపీ టికెట్ పొందిన మల్లెల రాజేశ్ నాయుడికి టచ్‌లో ఉన్నట్లు టాక్. రాజేశ్‌తో పాటు వారు టీడీపీలో చేరుతారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

News March 29, 2024

బిహార్‌లో 9 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

image

బిహార్‌లో లోక్‌సభ సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు ప్రకటన విడుదల చేశారు. పూర్నియా, హాజీపూర్‌లతో సహా 26 స్థానాల్లో ఆర్జేడీ అభ్యర్థులు పోటీ చేయనుండగా, కిషన్‌గంజ్, పట్నా సాహిబ్ సహా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగనున్నారు. లెఫ్ట్ పార్టీలు 5 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్(7.7) కంటే ఆర్జేడీకే(15.36) ఓటు శాతం ఎక్కువగా ఉంది.