India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

<

TG: PMAY-అర్బన్ స్కీమ్ కింద రాష్ట్రానికి 1.3 లక్షల యూనిట్లు మంజూరవడంతో ₹1,695 కోట్లు అందనున్నాయి. అలాగే PMAY-గ్రామీణ్ పథకం కింద 3 లక్షల యూనిట్లు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మార్చి రెండో వారంలో ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే మరో ₹2,160 కోట్లు అందనున్నాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బూస్ట్ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

బంధాలే కాదు స్నేహాలూ తగ్గిపోయాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్స్టైల్, స్మార్ట్ఫోన్ అడిక్షన్తో ఫ్రెండ్షిప్ ఆన్లైన్కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వంద మంది స్నేహితులుంటే 1990 సమయంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15% మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్షిప్ రిసెషన్’ అంటారు. ఇది ఒంటరితనానికి దారితీసి డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?

TG: GOVT స్థలాలు, నదీ తీరాల్లో ఆక్రమణలను తొలగించడంలో ప్రభుత్వ నిర్ణయం భేష్. HYDలో హైడ్రా, ఖమ్మం <<19243296>>భూదాన్<<>> వ్యవహారంలో సర్కారు తీరును తప్పు పట్టలేం. కానీ తప్పెవరిది? శిక్ష ఎవరికి? పడుతుందనేదే ప్రశ్న. అక్రమార్కులు రూ.కోట్ల డబ్బు దండుకొని సామాన్యులకు స్థలాలను అంటగట్టారు. కష్టపడి కట్టుకున్న గూడు కూలిపోతుంటే ఇప్పుడు వారి గుండె పగులుతోంది. వీరికి ఆ అక్రమార్కుల నుంచి భారీ పరిహారం ఇప్పిస్తే బాగుంటుంది.

తీర్థం స్వీకరించడానికి హస్త గోకర్ణ ముద్రను ఉపయోగించాలి. కుడిచేతి బొటనవేలుతో చూపుడు వేలును నియంత్రించాలి. మిగిలిన 3 వేళ్లను ముందుకు చాచాలి. దీన్నే గోకర్ణ ముద్ర అంటారు. ఇంట్లో పూజ ముగిశాక 3 సార్లు, గుడిలో అయితే ఓసారి తీర్థం తీసుకోవాలి. తీర్థాన్ని శబ్దం రాకుండా, కింద పడకుండా సేవించాలి. ఉపవాసం చేసే వారు ఉదయం, సాయంత్రం తీర్థం తీసుకునేటప్పుడే ఉపవాసం పూర్తయినట్లు లెక్క.

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 364 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీఈ, బీటెక్, డిగ్రీ(BA, BCom, BBA, LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు NATS/NAPS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.uraniumcorp.in

TG: 1950sలో ఆచార్య వినోబా భావే ఆశయాలకు ఆకర్షితులైన రాయల కోటేశ్వరరావు అనే భూస్వామి ఖమ్మం(D) వెలుగుమట్లలో 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు అప్పగించారు. కాలక్రమంలో విలువ పెరగడంతో అక్రమార్కులు తప్పుడు పత్రాలతో ఆ భూమి అమ్మారు. సొంతింటి కలతో సామాన్యులు కొని ఇళ్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్టే విధించింది. దీంతో అధికారులు <<19224009>>నిర్మాణాలను<<>> తొలగిస్తున్నారు.

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం నిన్న సింహలగ్నంలో కనులవిందుగా జరిగింది. ఈ ఘట్టాన్ని చూస్తున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. రాష్ట్ర ప్రభుత్వం, TTD, భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు, స్వర్ణగిరి ఆలయం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. విద్యుత్ వెలుగుల మధ్య ఆలయం వెలిగిపోయింది.

‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా లోతైన కుట్ర చేసినట్లు అనిపిస్తోందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, NCERT ఛైర్మన్కు నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించారు. విచారణ సందర్భంగా NCERT అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పింది.

T20WC: నేడు వెస్టిండీస్పై సౌతాఫ్రికా గెలిస్తే 4 పాయింట్లతో ఆ జట్టు సెమీస్లోకి అడుగుపెడుతుంది. అదే సమయంలో INDకు కొంత మేలు జరుగుతుంది. భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కూడా నేరుగా సెమీస్కు వెళ్తాం. ఒకవేళ ఇవాళ WI గెలిస్తే సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి. దాంతోపాటు మనం భారీ తేడాతో జింబాబ్వే, WIపై గెలిచి విండీస్ NRRను దాటాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.