India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కళావతమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేశ్, పలువురు టీడీపీ నేతలు ఆమెకు నివాళులర్పించారు. కాగా ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో రానున్న 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో రాత్రి సమయాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి ఉంటుందని అంచనా వేసింది. ఎల్లుండి నుంచి పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

AP: దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు.. ఆ పార్టీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నది బీజేపీ ప్రభుత్వ కుట్ర. ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. అదానీ, అంబానీల అనుచరులకు జగన్ పదవులు కట్టబెడుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

భారత ఐటీ దిగ్గజం టీసీఎస్పై అమెరికా ఉద్యోగులు మండిపడుతున్నారు. తమపై సంస్థ వివక్ష చూపుతోందని, తమను తొలగించి భారతీయులను నియమించుకుంటోందని తాజాగా ఆరోపించారు. వాల్స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. 22మంది ఉద్యోగులు సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్కు సంస్థపై ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని టీసీఎస్ కొట్టిపారేసింది. ఉద్యోగులకు సమాన అవకాశాల్ని కల్పించడంపై కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది.

AP: వాలంటీర్లపై EC ఆంక్షల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘ఈసారి పెన్షన్లను వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి. మూడో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తాం. పెన్షనర్లు భయపడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. చంద్రబాబు కడుపు మంటతోనే వాలంటీర్ల సేవలను EC ద్వారా నిలుపుదల చేశారని విమర్శించారు.

AP: వైసీపీ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని పవన్ కళ్యాణ్ వేసిన <<12957341>>సెటైర్లకు<<>> ఆ పార్టీ Xలో కౌంటర్ ఇచ్చింది. ‘ఫ్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ అన్నట్లుగా మళ్లీ ఓడిపోయే పవన్కు మాటలెక్కువ, వచ్చే ఓట్లు తక్కువ. ఈసారి పొలిటికల్ పిట్టల దొరకు పిఠాపురంలో ఓటమి తప్పదు. మీ పొత్తు పార్టీలన్నీ కట్టగట్టుకుని వచ్చినా అందర్నీ మోపుకట్టి గోదారిలో నిమజ్జనం చేయడానికి ఓటర్లు సిద్ధం’ అని పేర్కొంది.

గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.

దేశంలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. 649 JNVల్లో దాదాపు 50వేల సీట్ల వరకు అందుబాటులో ఉండగా.. ఒక్కో దానిలో గరిష్ఠంగా 80 మందికి 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు రోల్ నం, DOB ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <

AP: ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ పెత్తందారులు, భూస్వాముల పార్టీ. ఆ పార్టీలో ఒకే సామాజికవర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు. జగన్ శవ రాజకీయాలు నమ్మొద్దు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయి. మాది పేదల పక్షం.. ప్రజలతోనే ఉంటాం. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పేర్కొన్నారు.

AP: టీడీపీ అధినేత చంద్రబాబువి పిల్ల చేష్టలు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కత్తి కట్టారు. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారు. చంద్రబాబు కడుపుమంటతో మంచి వ్యవస్థను ఆపించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్ అందకుండా చేశారు. వాలంటీర్లు సీఎం జగన్కు మేలు చేస్తారని ఆయన భయం. చంద్రబాబుది మోసపూరిత రాజకీయం’ అని ఆయన మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.