India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘తలైవా171’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ను ఏప్రిల్ 22న రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. చేతి వాచ్లను చైన్లా పట్టుకుని ఉన్న రజనీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించనున్నారు.

AP: గడిచిన 58నెలల్లో ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమం అందించామని CM జగన్ తెలిపారు. ‘లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. గతంలో పిల్లల చదువు కోసం ఎవరూ పట్టించుకోలేదు. నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టాం. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ.25లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఎక్కడ చూసినా విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి’ అని వివరించారు.

యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న ‘ప్రతినిధి-2’ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ రేపు విడుదల కానుంది. శుక్రవారం ఉదయం 10.08 గంటలకు మెగాస్టార్ చిరంజీవి టీజర్ను విడుదల చేస్తారని మేకర్స్ తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దినసరి వేతనాలను 4-10శాతం పెంచింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.28 పెరిగి రూ.300కి చేరింది. హరియాణాలో అత్యధికంగా రూ.374 పొందుతుండగా.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో అత్యల్పంగా రూ.234 అందుకుంటున్నారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ నుంచి నిన్న ‘జరగండి’ పాట రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్లో చూసింది కొంతేనని.. థియేటర్లో పాటకు ప్రేక్షకులు స్టెప్పులేస్తారని నిర్మాత దిల్రాజు అన్నారు. ఫ్యాన్స్ తిట్టుకోవద్దని.. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వలేనని అన్నారు. డైరెక్టర్ శంకర్ ఇవ్వమంటేనే ఇస్తానని చెప్పారు. RRR స్థాయికి రీచ్ అయ్యేలా మూవీని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

భారత్లో నిరుద్యోగ పరిస్థితి అధ్వానంగా ఉందన్న UN రిపోర్టును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తప్పుబట్టారు. భారతీయ సంస్థల సర్వేల్లో భిన్నమైన గణాంకాలు ఉన్నాయన్నారు. ‘EPFOలో 6.4కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల జనాభా కంటే ఎక్కువ. 34 కోట్ల ముద్రా లోన్లు మంజూరు కాగా వీటితో చాలా మంది ఉపాధిని సృష్టిస్తున్నారు. మనం విదేశీ రేటింగ్ సంస్థలపై ఆధారపడటం మానుకోవాలి’ అని పేర్కొన్నారు.

యూట్యూబ్లో ‘విలేజ్ కుకింగ్ ఛానల్’తో దేశవ్యాప్త గుర్తింపు పొందిన పెరియతంబి గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రి పాలయ్యారు. శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు టీమ్ సభ్యుడొకరు తెలిపారు. తాత ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఛానల్కు 2.42 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛానల్ టీమ్తో కలిసి భోజనం చేశారు. విక్రమ్ సినిమాలోనూ వీరు నటించారు.

తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా ఈనెల 31న జరగాల్సిన పరీక్షను జెన్కో వాయిదా వేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కోర్టు కస్టడీ విధించింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావుకు 5 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. కానీ ప్రణీత్ రావు కస్టడీకి కోర్టు అనుమతించలేదు. కాగా నిందితులంతా తమ సొంత అవసరాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు, హవాలా దందా చేసేవారిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.

TG: ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్లో BRS అధినేత కేసీఆర్తో సీనియర్ నేత కె.కేశవరావు భేటీ ముగిసింది. పార్టీ మార్పు అంశాన్ని కేసీఆర్కు కేకే తెలిపారు. దీంతో కేకే తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం అనుభవించి, ఇప్పుడు పార్టీ మారడం సరికాదు. పార్టీలో మీకు ఏం తక్కువ చేశాం? మీ ఆలోచన చాలా తప్పు. మీరే ఆలోచించుకోండి’ అని సూచించారు. కానీ తాను కాంగ్రెస్లో చేరి, అక్కడే చనిపోతానని కేకే చెప్పారు.
Sorry, no posts matched your criteria.