India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అనంతపురం డివిజన్లో 54, హిందూపురం డివిజన్లో 37 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. SHARE IT
అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ఏ కోరితో సోమవారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. యూనివర్సిటీలో మొదటి దశలో జరుగుతున్న నిర్మాణం పనుల పురోగతిపై చర్చించారు. మొదటి దశ పనులు అక్టోబర్ లోపు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వచ్చే అకాడమిక్ సంవత్సరంలో నూతన కోర్సులు ప్రవేశ పెట్టే విధంగా చూడాలని కోరారు.
మండల స్థాయి అధికారులు వారివారి మండలాల పరిధిలో ప్రతి శుక్రవారం తనిఖీలు నిర్వహించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి శుక్రవారం సచివాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం మహాబూబ్ నగర్(D) బురెడ్డిపల్లి దగ్గర హైదరాబాద్ నుంచి ధర్మవరం వస్తున్న ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొంది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తి దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మెుత్తం 15మంది గాయపడ్డగా వారిలో అనంతపురం జిల్లాకు చెందిన సంజీవ, సునీల్, గాయత్రిలు ఉన్నారు. వారు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అనంతపురం సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్గా డీడీగా బీసీ సంక్షేమ డీడీ ఖుష్భు కొఠారిని ప్రభుత్వం నియమించింది. సాంఘిక సంక్షేమ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్న మధుసూదన్రావ్ను ఇటీవల రాష్ట్ర కార్యాలయానికి డిప్యూటేషన్ మీద పంపారు. ఆయన ఆదివారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్గా డీడీగా బీసీ సంక్షేమ డీడీ ఖుష్భు కొఠారిని ప్రభుత్వం నియమించింది.
13ఏళ్ల బాలికపై 63ఏళ్ల వ్యక్తి లైంగిక వేధించిన ఘటన హిందూపురంలో జరిగింది. పోలీసుల వివరాలు..బాలిక తల్లి భర్తతో విడిపోయి 2022లో హాబీబ్ఖాన్తో ఉండేది. ఆమె పనికివెళ్లిన సమయంలో హబీబ్ బాలికను లైంగికగా వేధించాడు. 2023లో తల్లి మృతిచెందినప్పటికీ బాలిక అతడితోనే ఉంటోంది. ఇటీవల హబీబ్కు హెల్త్ బాగోలేక బాలికతో కలిసి బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి సిబ్బందికి అనుమానంతో బాలికను విచారించగా విషయం బయటపడింది.
అనంతపురం జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీతో పశుగ్రాస జొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి ఆదివారం వరకు రైతు సేవాకేంద్రాలు, పశువైద్యశాలల్లో పశుగ్రాస వారోత్సాలను నిర్వహించామన్నారు. పశుపోషణకు ఉపయోగపడే విధంగా 55 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. 75శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.
అనంతపురం గ్రామీణం కక్కల పల్లి మార్కెట్లో టమాటా ధరలు పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో అక్కడక్కడ కోతలు మొదల య్యాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి అత్యధికంగా మార్కెట్కు టమాటా వస్తోందని వ్యాపారులు తెలిపారు. ఆదివారం 60 టన్నులు మార్కెట్ కు వచ్చింది. 15 కిలోల టమోటా బుట్ట గరిష్ఠ ధర రూ.750 కాగా మధ్యస్థ ధర రూ.600, కనిష్ఠ ధర రూ.480 పలికిందని మార్కెట్ ఇన్చార్జి రాంప్రసాద్ కు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాలలో ఈ కార్యక్రమం ఉంటుదన్నారు. సంబంధిత అధికారులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు.
తనకల్లు మండలం కొక్కంటి క్రాస్లో సూది మందు వికటించి ఉత్తమ్మ అనే మహిళ మృతి చెందింది. బంధువుల వివరాల మేరకు.. ఆదివారం ఉత్తమ్మ స్థానికంగా ఉన్న ఓ RMP డాక్టర్ వద్దకు చికిత్స కోసం వెళ్లింది. డాక్టర్ సూది మంది ఇవ్వగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు ధృవీకరించారు.
Sorry, no posts matched your criteria.