India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి తగు సమయంలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 19 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో చట్టప్రకారం విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆర్థికపరమైన, కోర్టు కేసులకు సంబంధించిన వినతులకు తప్ప మిగిలిన అన్ని వినతులకు సరైన పరిష్కారం చూపాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వినతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి వినతిని కూలంకుశంగా పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా 228 వినతులను కలెక్టర్ స్వీకరించారు.
శ్రీ సత్య సాయి జిల్లా నేర గణాంకాల వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ రత్న విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులతో కలిసి వార్షిక నివేదికను విడుదల చేశారు. ఏడాది కాలంలో జిల్లాలో నమోదైన వివిధ కేసుల గణాంకాలు, బాధితులకు చేసిన సత్వర పరిష్కారం, పోలీస్ శాఖ పనితీరుపై వార్షిక నివేదికను మీడియాకు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు.
అనంతపురం జిల్లా పార్లమెంట్ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్, అధ్యక్షుడు ప్రవీణ్ సాయి విఠల్ గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. విఠల్ మృతిపై వైసీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ.. పార్టీ కోసం నిరంతరం కష్టపడే ప్రవీణ్ సాయి విఠల్ మృతి చాలా బాధాకరమని వైసీపీ ట్వీట్ చేసింది. అతని ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది.
అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. కూటమి అధికారంలోకి వచ్చినా తనకు అంత ప్రాధాన్యం లేదని భావిస్తున్న ఆయన తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని నెట్టింట జోరు ప్రచారం సాగుతోంది. అయితే దీనిని ఆయన అనుచరులు ఖండిస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, పోలీస్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. నూతన సంవత్సర వేడుకలు ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో, రహదారులపై వేడుకల నిర్వహణకు అనుమతులు లేవన్నారు.
ఛాంపియన్ ఆఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (CBWR)లో అనంతపురం జిల్లా యాడికి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విష్ణు భగవాన్కు చోటు దక్కింది. ప్రపంచంలోని పురాతన నాణేల సేకరణలో విష్ణు భగవాన్ అత్యంత ప్రతిభ కనబరిచారని ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 31న గుజరాత్లో అవార్డు అందుకోనున్నారు.
గోరంట్ల: ఇటీవల జరిగిన దొంగతనం పాల్పడిన దొంగలను ఎట్టికేలకు పట్టుకొని వారి వద్ద నుంచి 12 తులాల బంగారు నగలు, బైక్ను స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్టు చేశామని సీఐ బోయ శేఖర్ తెలిపారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వివరించారు. వీరు కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలతో పాటు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ పలు దోపిడీలకు పాల్పడినట్లు తేలిందని వెల్లడించారు.
ఈనెల 30 నుంచి జనవరి 17వ తేదీ వరకు నిర్వహించే పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్కు 6,479 మంది హాజరవుతున్నారని అనంతపురం ఎస్పీ జగదీశ్ తెలిపారు. నగరంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో ఈరోజు చేపట్టిన ట్రైల్ రన్ సక్సెస్ అయ్యిందన్నారు. వీరిలో 5,242 మంది పురుష అభ్యర్థులు, 1,237 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని, మొత్తం కలిపి 6,479 మంది వస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
మాతృ భాషలో చదువుకుంటేనే పిల్లలకు తెలివితేటలు వస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. తాను మరాఠీ అయినా తన పిల్లల్ని మాత్రం తెలుగులోనే చదివిస్తున్నానన్నారు. సంస్కృతి, వారసత్వం అన్నీ భాషతోనే ముడిపడి ఉంటాయని, ప్రస్తుతం చాలామందికి తెలుగు రాయడం, చదవడం రావట్లేదన్నారు. మన తెలుగు ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.