India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్కు ఆహ్వానం అందింది. ఈవో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందించారు. కాగా ఇప్పటికే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి
కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ను గుర్తు తెలియని వ్యక్తులు ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో నిజమైన ఫేస్ బుక్ ఖాతా నుంచి అలెర్ట్ మెసేజ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ తన ఒరిజినల్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అత్యవసర సమాచారం అంటూ మెసేజ్ను పోస్ట్ చేశారు. నకిలీ అకౌంట్తో జాగ్రత్త వహించాలని సూచించారు.
వైసీపీ నేత భూమన బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మాట్లాడారు. టీటీడీని వైసీపీ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఛైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన చేసిన ఆరోపణలను ఖండించారు. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి 2025 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఈ.వో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించారు. వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, ఎస్పీ మణికంఠ చందోలు, JC విద్యాధరి ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. వారికి ఈవో ఆహ్వాన పత్రికలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ కోరారు.
వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల పొందేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ మణికంఠ గురువారం స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చామన్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే సరిపోతుందన్నారు. మైక్ అనుమతులను మీసేవ కేంద్రాలలో పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో హాస్టల్ నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. తల్లితండ్రుల కలను నెరవేర్చడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఓ టార్గెట్ పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. విద్యపై చేసే ఖర్చు ఎప్పటికీ వృథా కాదన్నారు.
హంద్రీనీవా కుప్పం కెనాల్ పనులను బుధవారం చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. హంద్రీనీవా కాలువ పనులు దాదాపు పూర్తికాగా పనుల పురోగతికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో సీఎం చంద్రబాబు హంద్రీనీవా జలాలను కుప్పంకు విడుదల చేయనున్నారు. దీంతో చివరి దశలో ఉన్న పనులను త్వరతగితన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.
NOTE: అప్లికేషన్లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది. ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకోండి.
చిత్తూరు జిల్లా రొంపిచర్ల-ఎం.బెస్తపల్లి మార్గంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. భక్తులు చిన్నగుడి కట్టి పూజలు చేస్తున్నారు. పెరటాసి నెల శనివారాల్లో ఇక్కడ పూజలు ఘనంగా జరుగుతాయి. తిరుమల వెళ్తూ శ్రీవారు ఇక్కడ ఎడమ పాదం మోపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రదేశాన్ని వేంకటేశుని పాదం అని పిలుస్తున్నారు. ఇక్కడి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. TTD స్పందించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఇటీవల వరుసగా వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రధాన మార్గాలతో పాటు గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు చేరింది. కొన్ని చోట్ల రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. పై ఫొటో పుంగనూరు-శంకర్రాయలపేట రోడ్డు దుస్థితిని తెలియజేస్తోంది. అధికారులు తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. మీ ఏరియా రోడ్లూ ఇలానే ఉన్నాయా?
Sorry, no posts matched your criteria.