Chittoor

News September 11, 2024

చిత్తూరు: రూ.2 లక్షలకు లడ్డూ దక్కించుకున్న ఎమ్మెల్యే

image

చిత్తూరు పట్టణంలోని బజారు వీధిలో బంగారం దుకాణాల వ్యాపారులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా స్వామివారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలంపాట నిర్వహించారు. దీనిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రూ. 2 లక్షలకు పాడి దక్కించుకున్నారు. లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. మాజీ కార్పొరేటర్ వసంత కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

News September 11, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం Update

image

ములకలచెరువు: పెద్దపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి <<14074139>>మృతి<<>> చెందిన గుర్తు తెలియని యువకుడి ఆచూకీ లభించినట్లు ఎస్సై గాయత్రి తెలిపారు. మృతుడు సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, సుబ్బరాయునిపల్లికి చెందిన శ్రీరాముల నాయక్ కుమారుడు ప్రకాశ్ నాయక్(22) అని, తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు. ప్రకాశ్ స్వగ్రామానికి బైకులో వస్తు పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద గోడను ఢీకొట్టి మృతి చెందినట్లు తెలిపారు.

News September 11, 2024

చిత్తూరు: వరద బాధితులకు హీరో రూ.10 లక్షల విరాళం

image

బంగారుపాళ్యం మండలం మాధవ నగర్ (మాదిగోని తోపు)కు చెందిన జెట్టి సినిమా హీరో మురళి విజయవాడ వరద బాధిత ప్రాంతాలను ఆదుకోవడానికి తనవంతు సహాయంగా రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. మురళి మాట్లడుతూ.. బుధవారం విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి వారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 10 లక్షలు విరాళంగా అందించామని తెలిపారు.

News September 11, 2024

ఆ పథకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్

image

చిత్తూరు: పీఎం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ కోసం లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పథకం అమలుపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 18 రకాల చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిసెంబర్ లోపు లక్ష్యాలు చేరుకోవాలన్నారు.

News September 11, 2024

చిత్తూరు కలెక్టర్ హెచ్చరికలు

image

చిత్తూరు జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో DCHS డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, DMHO డాక్టర్ ఓ.ప్రభావతి దేవి, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎక్కడైనా మాతృ మరణాలు జరిగితే సంబంధిత డాక్టర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 10, 2024

సత్యవేడు MLA వివాదం..వైద్య పరీక్షలకు నో చెప్పిన మహిళ

image

సత్యవేడు MLA కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఆదిమూలం అత్యాచారం చేశాడంటూ ఆరోపించిన మహిళ TPT ఈస్ట్ పోలీసులపై మండిపడింది. ‘నన్ను ఎందుకు విచారిస్తున్నారు. నేను ఫిర్యాదు చేశా. MLAని అరెస్టు చేయండి’ అన్నది. అత్యాచార కేసులో వైద్యపరీక్షలు తప్పనిసరని CI మహేశ్వరరెడ్డి చెప్పినా పట్టించుకోలేదు. ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకానని తేల్చి చెప్పారు. గుండె నొప్పిగా ఉందని వైద్యానికి చెన్నై వెళ్తున్నట్లు తెలిపారు.

News September 10, 2024

చిత్తూరు: రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడికి జైలు

image

ఓ వ్యక్తి మృతికి కారణమైన రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు జడ్జి వెన్నెల సోమవారం తీర్పు చెప్పారు. తిరువణ్ణామలై వాసి నాగరాజు చిత్తూరులో రిహాబిలిటేషన్ సెంటర్ నడుపుతుండగా.. మద్యం మాన్పాలని తరుణ్‌ను తల్లి ఆశ ఈ కేంద్రంలో చేర్చింది. అతడిని 6నెలలు కుటుంబానికి చూపకుండా, మోతాదుకు మించి ఔషధాలు ఇవ్వడంతో 2022లో మరణించాడు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందని తెలిపారు.

News September 10, 2024

వాళ్లను వెంటనే రిలీవ్ చేయండి: చిత్తూరు DEO

image

చిత్తూరు జిల్లాలో అన్ని పాఠశాలల్లో టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసినట్లు DEO దేవరాజులు వెల్లడించారు. జిల్లాలో మొత్తంగా 464 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు చెప్పారు. ఆయా టీచర్లను ఎంఈవోలు, HMలు వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు.

News September 9, 2024

శ్రీవారి ఆలయ పేష్కార్‌గా రామకృష్ణ

image

తిరుమల శ్రీవారి ఆలయ నూతన పేష్కార్‌గా రామకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం ఆలయ రంగనాయకుల మండపం వద్ద బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు, ఆలయ సిబ్బంది రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

News September 9, 2024

చిత్తూరు: విద్యార్థి దారుణ హత్య..?

image

ఉమ్మడి చిత్తూరులో డిగ్రీ విద్యార్థి మృతి కలకలం రేపింది. PTM మండలం ముంతగోగులపల్లెకు చెందిన గోపాలకృష్ణ, వెంకట రమణమ్మ కుమారుడు బాలు(18) తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం భూమిని సర్వే చేయించగా.. ఆదివారం నుంచి అదృశ్యమయ్యాడు. ఊరికి చివరలోని గుడి వద్ద సోమవారం శవమై కనిపించాడు. భూవివాదంతో తమ బంధువులు బాలును చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.