India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు నగరంలోని 32, 34, 40, 41 వార్డ్ పరిధిలో మంగళవారం మత్తు పదార్థాల నిషేధంపై ‘సే టు నో డ్రగ్స్’ కార్యక్రమాన్ని WMSKలు నిర్వహించినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. వార్డ్ ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలను వివరించామన్నారు. యువత మత్తుకు బానిస కావద్దని సూచించారన్నారు. డ్రగ్స్ విక్రయించిన, సేవించిన చట్టరీత్యా నేరమన్నారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు.
పేటమిట్ట అమరరాజ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. 25 కంపెనీల్లో ఖాళీగా ఉన్న 1200 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఆరోజు రంగంపేట క్రాస్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.
వినాయక చవితి చవితి సందర్భంగా కాణిపాకంలో ఈనెల 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 27న గ్రామోత్సవం, పుష్పకావిల్లు, 28న ధ్వజారోహణం నిర్వహిస్తారు. 29న నెమలి, 30న మూషికం, 31న శేష, సెప్టెంబర్ 1న వృషభం, 2న గజ వాహనాలపై స్వామివారు దర్శనమిస్తారు. 3న రథోత్సవం జరుగుతుంది. 4న అశ్వ వాహన సేవ, 5న ధ్వజావరోహరం నిర్వహించనున్నారు. 6 నుంచి 16 వరకు ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆహ్వానించారు. ఈనెల 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సచివాలయంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికలు ఆవిష్కరించారు. వేద పండితులు ఆశీర్వచనంతో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
చిత్తూరు జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసిందని నోడల్ అధికారిణి, పీవీకేన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
యాదమరి(M) ముస్లిం వాడ 14 కండ్రిగకు చెందిన ఇంతియాజ్ పుట్టుకతోనే మూగవాడు. ఇటీవల రాయి పనికి వెళ్లగా.. అక్కడ జరిగిన బ్లాస్టింగ్లో రెండు కళ్లు, కుడిచేయి మణికట్టు వరకు కోల్పోయాడు. ఇతని కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కలెక్ట్రేట్లో నిన్న జరిగిన గ్రీవెన్స్ డేకు బాధిత కుటుంబం హాజరై కలెక్టర్ సుమిత్ కుమార్కు సమస్యను వివరించారు. ఆయన మానవతా థృక్పథంతో PSR ఫండ్స్ నుంచి రూ.లక్ష అందజేశారు.
చిత్తూరు జిల్లా యాదమరి(M) తోటికాడ ఇండ్లు గ్రామంలో ఈనెల 11న ఓ యువకుడు <<17373260>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. విజయ్ కుమార్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో అతడి తండ్రి సదాశివన్, అన్న శివకుమార్ కలిసి విజయ్ను కర్రలతో కొట్టి, తాడుతో గొంతు బిగించి చంపేశారు. ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోలీసులు ఎంట్రీతో అసలు విషయం తెలిసింది. నిందితులను అరెస్ట్ చేశారు.
గుడిపాల మండలంలో తేనెటీగల దాడిలో <<17433386>>30 మందికి <<>>గాయాలైన విషయం తెలిసిందే. బసవాపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతున్న శుభకార్యానికి గ్రామస్థులు హాజరయ్యారు. పక్కనే చెట్టుపై తేనే తుట్టెను ఓ కోతి కదిలించడంతో తేనెటీగలు ఒక్కసారిగా ఫంక్షన్ హాల్ ఆవరణలోకి వెళ్లి సుమారు 30 మందిపై దాడి చేసి కుట్టాయి. వారిని 108 వాహనంలో PHCకి తరలించి వైద్య సేవలు అందించారు.
ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న 47 మందికి పోలీసులు జరిమానా విధించారు. చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర తన సిబ్బందితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల అత్యంత వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ పాదచారులను ఇబ్బందులకు గురిచేసిన వారిని గుర్తించారు. ఇలా 47 మందిని గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం రూ.52 వేల జరిమానా వసూలు చేశారు.
చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి(లైవ్) కిలో రూ.120, స్కిన్ రూ.174 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.198 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున పలు దుకాణాల్లో అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.900గా ఉంది. మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.