India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచినట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీలోపు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు 17 లక్షల మంది వరకు ఈకేవైసీ చేయించుకున్నారని, ఇంకా చేయించుకోవాల్సిన వారు 1.50 లక్షల మంది మిగిలారని వివరించారు.
చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ మాంసం కిలో. 184, స్కిన్ లెస్ మాంసం కిలో రూ. 210, లేయర్ మాంసం కిలో రూ.145 కు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. బర్డ్ ప్లూ అనంతరం చికెన్ ధరలలో పెరుగుదల కనబడుతోంది. పండుగల కారణంగా చికెన్ ధరలు పెరిగినట్టు పలువురు తెలుపుతున్నారు. మీ ప్రాంతాలలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
సోమవారం రంజాన్ పండుగ కావడంతో మీ కోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదులు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి ఈనెల 31న రావద్దని విజ్ఞప్తి చేశారు.
తాము ఎందులోను తక్కువ కాదంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు మహిళలు నిరూపిస్తున్నారు. ఇటీవల వినూత్నంగా చీరలు తయారు చేసి రాష్ట్రపతిని శ్రీకాళహస్తి మహిళ మొప్పించిన విషయం తెలిసిందే. తాజాగా సోమలకు చెందిన సంజన ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ ఉద్యోగానికి ఎంపికై అందరి చేత శభాష్ అనిపించింది. చిత్తూరులో జిల్లాలో ఈ ర్యాంక్ స్థాయి ఉద్యోగాన్ని పొందిన మొదటి మహిళ సంజనే అంటూ ఆమె కుటుంబీకులు తెలిపారు.
ఉగాదిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉగాది ఉత్సవం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, ప్రముఖ వ్యక్తులకు సత్కారం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఉగాది వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు.
ఉగాది పర్వదినాన్ని జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ మణికంఠ శనివారం కోరారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం, ఆయుషు, ఆనందం, అభివృద్ధి కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రజలకు పోలీసు శాఖ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో, ఎన్ఇసిసి సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతాంగం వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమపై ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉన్నారన్నారు.
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గుడిపాల(మ) చిత్తపారకు చెందిన దినేశ్ జ.31 2022వ సం.లో బాలికను పెళ్లి చేసుకుంటానంటూ ఇంటి నుంచి తీసుకెళ్లాడు. కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో కూల్ డ్రింక్లో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష ఖరారు చేశారు.
హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు(D) చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట(M)నికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి లాడ్జిలో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.
బాలికపై అత్యాచారం చేసిన కేసులో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు(D)కు చెందిన ఓ బాలిక కలికిరి(M)లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. ఈ ఏడాది జనవరి 25న బాలిక కనపడలేదు. YCP నేత అహ్మద్ పెద్ద కొడుకు జునేద్ అహ్మద్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు.
Sorry, no posts matched your criteria.