India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్మీలో ఉద్యోగాలపై చిత్తూరు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరులో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు మార్చి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 10 చివరి తేదని కలెక్టర్ వెల్లడించారు.
చిత్తూరు జిల్లాలో మండల పరిషత్లో ఖాళీగా ఉన్న స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. సదుం ఎంపీపీగా మాధవి, పెనుమూరు కో-ఆప్షన్ సభ్యురాలిగా నసీమా, రామకుప్పం ఎంపీపీగా సులోచనమ్మ, వైఎస్ ఎంపీపీగా వెంకటే గౌడ, విజయపురం వైస్ ఎంపీపీగా కన్నెమ్మ, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్ సుందర్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలో మండల పరిషత్లో ఖాళీగా ఉన్న స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. సదుం ఎంపీపీగా మాధవి, పెనుమూరు కో-ఆప్షన్ సభ్యురాలిగా నసీమా, రామకుప్పం ఎంపీపీగా సులోచనమ్మ, వైఎస్ ఎంపీపీగా వెంకటే గౌడ, విజయపురం వైస్ ఎంపీపీగా కన్నెమ్మ, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్ సుందర్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
మద్యం కేసులో MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగుతోంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు సైతం వెళ్లారు. ఈక్రమంలో ఆయన లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత చికిత్స పొందుతున్న తన తండ్రి పెద్దిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు’ అని ఆయన చెప్పారు. ఆ వెంటనే MPని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
చిత్తూరు జిల్లా పరిధిలోని రామకుప్పం, తవణంపల్లె, సదుం, విజయపురం(వైస్ MPP), పెనుమూరు (కో-ఆప్షన్ సభ్యులు)లలో నేడు ఎన్నికలు జరగనున్నాయి. అటు YCP, ఇటు కూటమి ఈ ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా రామకుప్పంలో కూటమికి బలం లేకున్నా సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ YCP నేతలు ఆరోపించారు. తవణంపల్లెలో సైతం ఇరు వర్గాలు పోటాపోటీగా ఉన్నాయి. సదుం MPP ఎన్నికపై సైతం ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ టీచర్ల జనరల్ సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. జిల్లాలో పని చేస్తున్న హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లు.. జనరల్ సీనియారిటీ జాబితాను సరిచూసుకోవాలన్నారు. అభ్యంతరాలపై 29వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలన్నారు.
ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని వ్యక్తిత్వ వికాసానికి వాడుకోవాలే గానీ విధ్వంసానికి కాదని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను నారా భువనేశ్వరి సందర్శించి విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీని వాడుకోవడం తెలియక కొంతమంది యువత దుర్వినియోగం చేస్తోందని, ఇది వారి భవిష్యత్తును కాలరాస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా పరిధిలో గురువారం నిర్వహించే మండల ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తయినట్లు జడ్పీ సీఈఓ రవికుమార్ తెలిపారు. అయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఖాళీ అయిన స్థానాలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితునికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. పట్టణంలోని కట్టమంచికి చెందిన మహేశ్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంట్లో పని చేసేవాడు. 2023లో రూ.లక్ష దొంగతనం చేసి పరారయ్యాడు. అప్పట్లో సాంకేతిక ఆధారాలతో మహేశ్ను నిందితుడిగా గుర్తించి రిమాండ్కు తరలించారు. ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించారు.
రామకుప్పంలో ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో బయట వ్యక్తులు ఎవరు గ్రామంలోకి రాకుండా ప్రవేశం నిషేధించినట్లు డీఎస్పీ పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సంబంధిత వ్యక్తులకు, ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు సహకరించాలన్నారు. అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.