Chittoor

News January 30, 2026

కుప్పానికి 2 గంటలు ఆలస్యంగా రానున్న CM

image

CM చంద్రబాబు కుప్పం పర్యటన రెండు గంటలు ఆలస్యంగా మొదలుకానుంది. CM గుంటూరులో పర్యటన ముగించుకుని హెలికాప్టర్‌లో గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2.35 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే గుంటూరులో పర్యటన ఆలస్యం కావడంతో పర్యటన రెండు గంటలకు ఆలస్యంగా మొదలుకానుంది.

News January 30, 2026

ఎవరికీ ప్రాణాపాయం లేదు: చిత్తూరు కలెక్టర్

image

SRపురం బీసీ కాలనీలో స్కూల్ <<18999092>>బస్సును లారీ ఢీకొట్టిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం రాణిపేట సీఎంసీకి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు.

News January 30, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరంగా సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్ ఏవీఆర్ మూర్తి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల ఫిర్యాదుల కోసం 1100 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసిందన్నారు. అందులో భాగంగా తమ శాఖ పరంగా సమస్యలుంటే ఫోన్ చేసి చెప్పాలని కోరారు.

News January 30, 2026

కుప్పంలో CM పర్యటన ఇలా..!

image

గుడిపల్లి(M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లోని హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2గంటలకు CM చంద్రబాబు చేరుకుంటారు. 2.15గంటలకు టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం భవనం, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 3.15గంటలకు కుప్పంలో స్వర్ణ నవదిశ సెంటర్ ప్రారంభిస్తారు. 4.30గంటలకు కంగుంది హోం స్టే, బౌల్డరింగ్ ఫెస్టివల్ ప్రాంతాన్ని పరిశీలించి 100అడుగుల జెండా ఆవిష్కరిస్తారు. తర్వాత శివపురంలోని ఇంటికి చేరుకుంటారు.

News January 30, 2026

కుప్పంలో CM పర్యటనకు సర్వం సిద్ధం

image

CM చంద్రబాబు 3 రోజులు కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో పర్యటించనున్నారు. CM పర్యటన కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం గుంటూరు పర్యటన ముగించుకుని హెలికాప్టర్లో గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొనున్నారు. అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రారంభిస్తారని అధికారికంగా సమాచారం వెలువడింది.

News January 29, 2026

చిత్తూరు: ఫిబ్రవరి 4వ వరకే ఛాన్స్.!

image

చిత్తూరు జిల్లాలో 4 బార్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. 2025-28 సం.గాను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో 5వ తేదీన కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో బార్లను కేటాయిస్తారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు https://oc.hpfsproject.com వెబ్ సైట్ చూడాలన్నారు.

News January 29, 2026

CM సభకు అక్రిడేషన్ కలిగిన రిపోర్టర్లకే అనుమతి

image

కుప్పంలో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు సీఎం చంద్రబాబు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో 31న నిర్వహించే బహిరంగ సమావేశానికి అక్రిడేషన్ కలిగిన విలేకరులకు మాత్రమే అనుమతి ఉంటుందని జిల్లా సమాచార శాఖ అధికారులు గురువారం స్పష్టం చేశారు. మిగిలిన అన్ని కార్యక్రమాలు లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షించ వచ్చని వెల్లడించారు.

News January 29, 2026

CM రేపటి పర్యటన వివరాలు

image

సీఎం చంద్రబాబు జిల్లాలో శుక్రవారం పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. 30న మధ్యాహ్నం రెండు గంటలకు గుడిపల్లె హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 2.15 గంటలకు టీచర్స్ ట్రైనింగ్ బిల్డింగ్ ఓపెనింగ్, 3.15 ఆదిత్య బిర్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, గ్రంథాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 4.30 గంటలకు కంగుందిలో ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 5.55 గంటలకు శాంతిపురం మండలం, కడపల్లెలోని నివాసానికి చేరుకుంటారు.

News January 29, 2026

కుప్పంలో ఈ-సైకిళ్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్

image

కుప్పంలో ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీని కలెక్టర్ సమిత్ కుమార్ గురువారం సాయంత్రం పరిశీలించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సైకిళ్లను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా ఈ సైకిళ్లు తీసుకున్న మహిళలతో కలెక్టర్ ముచ్చటించి వాటిని ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి 5,500 ఈ సైకిళ్ల పంపిణీతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News January 29, 2026

CM కుప్పం పర్యటనలో స్వల్ప మార్పు..!

image

CM చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 30, 31, ఫిబ్రవరి 1న CM కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 30వ తేదీ మధ్యాహ్నం గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రారంభించనున్నారు. ఒకటో తేదీ సాయంత్రం నియోజకవర్గ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతారు.