Chittoor

News September 22, 2025

చిత్తూరు కలెక్టర్‌కు 348 అర్జీలు

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 348 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు విభాగాలకు చెందిన సమస్యలను ఆయన స్వయంగా విని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

News September 22, 2025

చిత్తూరు: RTCలో అప్రెంటీస్ షిప్‌‌కు నోటిషికేషన్

image

APSRTC అప్రెంటీస్ షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DPTO జగదీష్ తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలో డీజల్ మెకానిక్స్ 33, మోటర్ మెకానిక్స్ 2, ఎలక్ట్రీషియన్స్ 8, వెల్డర్ 1, ఫిట్టర్ 3 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా పరిధిలో ITI చదివిన వారు మాత్రమే అర్హులు. అక్టోబర్ 4వ తేదీ లోపు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

News September 22, 2025

పెద్ద పంజాని: బెట్టింగ్ యాప్ మోసగాడి అరెస్ట్

image

బెట్టింగ్ యాప్ మోసగాడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన చంద్రబాబు బెట్టింగ్ యాప్ ద్వారా ప్రజలను మోసం చేసేవాడు. ఈ నేపథ్యంలో రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వద్ద షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతానని నమ్మించి రూ.2 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా అతడి బ్యాంకు అకౌంటుకు ఇతని మొబైల్ నెంబరును లింకు చేసుకుని దాదాపు రూ.కోటికి పైగా మోసం చేశాడు.

News September 22, 2025

పెనుమూరు : మహిళా పోలీస్ సస్పెండ్

image

పెనుమూరు మండలంలోని సీఆర్. కండ్రిగ గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి శకుంతలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు. పెనుమూరు ఎంపీడీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె రిజిస్టర్‌లో సంతకం చేయకపోవడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా నమోదు కాలేదని అన్నారు. కారణం ఏమిటని అడగ్గా సమాధానం సక్రమంగా లేని కారణంగా చర్యలు చేపట్టారు.

News September 22, 2025

బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించిన చిత్తూరు ఎంపీ

image

హైదరాబాద్‌ గచ్చిబౌలి గౌవనంపల్లి జర్నలిస్టు కాలనీ ఫేజ్–3లో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జెండా ఊపి బోనాలను ప్రారంభించారు. అనంతరం మహిళలు రంగురంగుల బతుకమ్మలను అలంకరించి పాటలతో సందడి చేశారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ ప్రసాదరావు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

News September 21, 2025

సెలవుల్లో తరగతులు నిర్వహించరాదు: చిత్తూరు DEO

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు(మైనారిటీ పాఠశాలలు తప్ప) కచ్చితంగా దసరా సెలవులను అమలు చేయాలన్నారు. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదన్నారు. జిల్లాలోని మైనారిటీ పాఠశాలలకు ఈనెల 27 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.

News September 21, 2025

చిత్తూరు: మొక్కలు నాటిన ఎస్పీ

image

ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛత దివస్” కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం నందు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత అనేది మన బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజానికి ఇచ్చే బహుమతి అన్నారు.

News September 20, 2025

చిత్తూరు: మొక్కలు నాటిన ఎస్పీ

image

ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛత దివస్” కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం నందు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత అనేది మన బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజానికి ఇచ్చే బహుమతి అన్నారు.

News September 20, 2025

చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన SP తుషార్

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ తుషార్ డూడీ కలెక్టర్ సుమిత్ కుమార్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, చట్టాల సమర్థవంతమైన అమలు వంటి కీలక అంశాలపై చర్చించుకున్నారు.

News September 20, 2025

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు MP

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు శనివారం కోరారు. చిన్నపిల్లలను వాగులు, వంకల వద్దకు వెళ్లనివ్వరాదని సూచించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు.