Chittoor

News August 21, 2024

తిరుపతి : ఉద్యోగాల పోస్టర్స్ ఆవిష్కరణ

image

APSSSDC ఆధ్వర్యంలో జెన్ పాక్ట్ కంపెనీ నందు కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ ఉద్యోగాల పోస్టర్ ను బుధవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం మాట్లాడుతూ.. 2022/23/24 మధ్య బీటెక్ ఏదైనా డిగ్రీ, పీజీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. https://bit.ly/46Wzqz6 వెబ్ సైట్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. చివరి తేదీ ఆగస్టు 28.

News August 21, 2024

తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల బస్సులు బస్టాండ్‌లకే పరిమితం అయ్యాయి. ప్రైవేటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ప్రధాన సెంటర్‌లలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది.

News August 21, 2024

24న తిరుపతిలో అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

image

తిరుపతి ఎస్వీయూ స్టేడియంలో ఈనెల 24వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 16, 18, 20, 23 బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాబర్ట్ పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎంపికలకు హాజరు కావాలని కోరారు.

News August 21, 2024

తిరుపతి SVU ఫీజులపై మీ కామెంట్..!

image

తిరుపతి ఎస్వీయూ పరిధిలోని బీఈడీ విద్యార్థులు ప్రతి రికార్డుకు రూ.2500 కట్టేలా ప్రస్తుతం నిబంధన ఉంది. దీనిని రద్దు చేయాలని NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నే మల్లికార్జున కోరారు. ఈ మేరకు ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. పాత పద్ధతిలోనే ఒక సెమిస్టర్‌కు రూ.2500 ఫీజు కట్టించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విన్నవించారు. మరి దీనిపై మీ కామెంట్.

News August 21, 2024

SVU పేరు చెప్పి మోసం

image

తిరుపతి ఎస్వీయూ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేరళకు చెందిన గ్లోబల్ కన్సల్టెంట్ అనే ఓ ప్రైవేట్ విద్యా సంస్థ ఎస్వీయూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్ పేరిట బీఈడీ, ఎంఈడీ కోర్సులకు అడ్మిషన్లు చేపట్టింది. చాలా ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. ఈ అంశంపై డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ బ్యూర్(డెబ్) SVUకు సమాచారం అందించింది. దీంతో కేరళలోని ఆ సంస్థకు తమకు సంబంధం లేదని ఎస్వీయూ అధికారులు స్పష్టం చేశారు.

News August 21, 2024

TTDలో ఉద్యోగావకాశాలు

image

TTD ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఈనెల 29వ తేదీ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.మొత్తం ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతిలో ఉన్న టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్ వద్ద ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హత, ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్ చూడాలి.

News August 21, 2024

చిత్తూరు: రైతు ఉత్పత్తిదారుల సంస్థ బలోపేతం

image

జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు బలోపేతానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రైతులు మెరుగైన, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి వారిని ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం మెరుగైన సాంకేతికత, మార్కెటింగ్ సౌకర్యం తదితర వాటి కోసం సన్న చిన్న కారు రైతులు ఎఫ్‌పీఓలో భాగస్వామ్యం కావడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

News August 20, 2024

మీడియా సంస్థలకు పెద్దిరెడ్డి నోటీసులు

image

మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో తనపై విషప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈక్రమంలో పలు పత్రికలు, మీడియా సంస్థలకు లాయర్ ద్వారా నోటీసులు పంపారు. పరువు నష్టం కింద తనకు ఈనాడు, ఈటీవీ రూ.50 కోట్లు, మహా న్యూస్ రూ.50 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. తనపై నిరాధరంగా వార్తలు రాసిన వారికి న్యాయపరంగా బుద్ధి చెప్తామని పెద్దిరెడ్డి హెచ్చరించారు.

News August 20, 2024

చిత్తూరు: TDP నేతపై హత్యాయత్నం

image

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి రఘుచంద్ర గుప్తా కారులో ప్రయాణిస్తుండగా గంగవరం మండలం నాలుగు రోడ్ల వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు టెంపోతో ఢీకొని హత్యా ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు. ఈ విషయంపై విచారణ జరపాలని గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 20, 2024

తిరుపతి: డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పసల పొన్నారావు

image

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి(M) VM పల్లి గ్రామానికి చెందిన పసల మహాలక్ష్మమ్మ, మోహన్‌రావుల కుమారుడు పొన్నారావు డిప్యూటీ సొలిసిటర్ జనరల్(DSG)గా నియమితులయ్యారు. హైకోర్టులో కేంద్రప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారు. ఈ మేరకు కేంద్రన్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పొన్నారావు మూడేళ్లపాటు ఈపదవిలో కొనసాగుతారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి DSGగా నియమితులవడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.