India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 8వ తేదీన రెండో శనివారం సెలవు లేదని జిల్లా విద్యాశాఖ అధికారిణి వరలక్ష్మి తెలిపారు. 2024-25 సంవత్సరానికి మొత్తం పని దినాలు 220 రోజుల కన్నా తక్కువగా ఉండడంతో రెండో శనివారం పని దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ యథావిధిగా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు.
ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కానీ విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు ప్రమాదంలో ఓకేసారి ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న మంజునాథ, లక్ష్మి దంపతుల దీనగాధ ఇది.
కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొరస్వామి నాయుడు మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం బెంగళూరులో దొరస్వామి నాయుడు మరణం పట్ల ఎంపీ ఢిల్లీలో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుప్పంలో పీఈఎస్ మెడికల్ కళాశాల స్థాపించడం ద్వారా ఎంతో సేవ చేశారని కొనియాడారు.
పీఈఎస్ విద్యాసంస్థల అధినేత ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి నాయుడు(85) కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దొరస్వామి 1972లో బెంగళూరులో 40 మంది విద్యార్థులతో పీఈఎస్ విద్యాసంస్థను ప్రారంభించారు. కర్ణాటక ఎమ్మెల్సీగా, ప్రభుత్వ సలహాదారుడిగా విద్యారంగానికి విశేషంగా కృషి చేశారు. బెంగళూరులోని తన నివాసంలో గురువారం సాయంత్రం దొరస్వామి నాయుడు తుది శ్వాస విడిచారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవినాక్షయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కార్వేటినగరం SI రాజ్ కుమార్ తెలిపారు. నిందితుడిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 31 కేసులు ఉన్నట్లు వారు తెలిపారు. నిందితుడిని ఇవాళ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ఊతుకోట వద్ద అరెస్ట్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన సిబ్బందిని SP అభినందించారు.
తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ చాంఫియన్ షిప్ పోటీల్లో రామకుప్పం మండలంలోని బళ్లకు చెందిన విద్యార్థి మౌనిశ్ విశేష ప్రతిభ కనబరచాడు. సీనియర్ విభాగంలో ఇతను విజేతగా నిలిచాడు. ఇతను ఎస్వీయులో డిగ్రీ చదువుతున్నాడు. పోటీల్లో ప్రతిభ చాటిన మౌనిశ్ను బుధవారం స్థానిక టీడీపీ నేతలు మునస్వామి, నాగభూషణం, పట్ర నారాయణ, జయశంకర్, మునిరత్నం తదితరులు అభినందించారు.
వేసవిలో తాగునీటి సమస్యపై అలసత్వం వద్దని అధికారులకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయం నుంచి RWS అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్య నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పంచాయతీల వారీగా తాగునీటి సరఫరాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు.
మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లాలోని పలు పాఠశాలల్లో లింగ సమానత్వంపై పెయింటింగ్ పోటీలు బుధవారం నిర్వహించినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. మహిళా, పురుష సమానత్వంపై అవగాహన పెంచేలా పోటీలు ఉపయోగపడతాయన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న విషయాన్ని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈనెల 8 వరకు వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు.
యూత్ పార్లమెంట్ పోటీలకు ఈనెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని NYK కోఆర్డినేటర్ ప్రదీప్ కోరారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత మై భారత్ పోర్టల్లో నిమిషం నిడివి గల వికసిత్ భారత్ అంటే ఏమిటి అనే వీడియోను అప్లోడ్ చేసి రిజిస్టర్ కావాలని సూచించారు. 15న చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో స్క్రీనింగ్ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ప్రిన్సిపల్ జీవనజ్యోతి గోడపత్రిక ఆవిష్కరించారు.
పూతలపట్టు నియోజకవర్గంలో పనిచేయడానికి రిపోర్టర్ల నుంచి Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐరాల, తవణంపల్లె, పూతలపట్టు,బంగారుపాలెం,యాదమర్రి మండలానికి చెంది, అనుభవం ఉన్నవాళ్లే అర్హులు. ప్రస్తుతం ఏదైనా మీడియాలో పనిచేస్తున్న వాళ్లు సైతం అర్హులుగా పరిగణిస్తాం. <
Sorry, no posts matched your criteria.