India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో. జిల్లా దేవరపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికపై సత్యనారాయణ (72) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక సోదరి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదుచేసినట్లు రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 7న బాలిక ఆడుకుంటుండగా నిందితుడు చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియవేసి అత్యాచారానికి ప్రయత్నించాడన్నారు. పిల్లలు తలుపు కొట్టడంతో పారిపోయాడన్నారు.
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం (నేడు) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం రాత్రి ఆర్డీవో సీతారామారావుతో కలిసి పర్యవేక్షించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సామర్లకోటలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్లో దిగుతారు. రోడ్డు మార్గంలో 2.40 గంటలకు కిర్లంపూడి మండలం రాజుపాలెం చేరుకొని నీటమునిగిన గ్రామాలు, పంటలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని పలు పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారి రమేష్ తెలిపారు. కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు గమనించాలన్నారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 162 PHCలు, 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నిత్యం సగటున 2వేల వరకు సీజనల్ జ్వరాల కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. వీటికి తోడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గత నెలలో 50 వేల కేసులు, ఈ నెలలో ఇప్పటివరకు 13వేల కేసులు నమోదయ్యాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై తూ.గో., కోనసీమ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. భారీ వర్షాలు, వరద పరిస్థితుల దృష్ట్యా ముంపు సమస్యపై నష్టతీవ్రతపై అంచనాను బుధవారం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. వీధుల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలని, ఇవాళ సాయంత్రానికి సరకుల పంపిణీని కూడా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో పంటలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు పంట కాలువలు కీలకం. అయితే ఉమ్మడి తూ.గో.లో కాల్వలను పలువురు కబ్జా చేయడంతో ముంపు సమస్య ఏర్పడింది. ఖరీఫ్, రబీ సీజన్లలో 9.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా కాకినాడలో 54, రామచంద్రపురం 30, అమలాపురం 213, రాజోలు 632 కాలువలను కబ్జా చేసినట్లు అధికారుల లెక్కల్లో తేలింది. వెరసి వేలాది ఎకరాల్లో పంటలు ముంపుబారిన పడి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 162 PHCలు, 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నిత్యం సగటున 2వేల వరకు సీజనల్ జ్వరాల కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. వీటికి తోడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గత నెలలో 50 వేల కేసులు, ఈ నెలలో ఇప్పటివరకు 13వేల కేసులు నమోదయ్యాయి.
సుద్దగడ్డ వాగు సమస్యకు స్థానిక MLAగా పూర్తిస్థాయి పరిష్కారం చూపుతానని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. గొల్లప్రోలులో సోమవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. నది, వాగు పరీవాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అనారోగ్యంతో ఉన్న ప్రజల బాధలు చూసేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని, వాటిని ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాయుగుండం ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఉదయం 11:30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.