EastGodavari

News July 21, 2024

కోనసీమ: బాలికపై లైంగిక దాడి

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఓ యువకుడిపై కేసు నమోదుచేసినట్లు SI రాజేశ్ కుమార్ తెలిపారు. పోలీసుల వివరాలు.. అయినవిల్లి మండలం తొత్తరమూడికి చెందిన యువకుడు వెంకటరమణ మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇంటికి కొంతకాలం క్రితం వెళ్లాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల బాలికను విలస గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పటినుంచి శారీరకంగా, మానసికంగా వేధించడంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుచేసిందన్నారు.

News July 20, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాకు కొత్త JCల నియామకం

image

ఏపీలో 62 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హిమాన్షు కౌశిక్ రానున్నారు. అంబేడ్కర్ కోనసీమ జాయింట్ కలెక్టర్‌గా నిశాంతి నియమితులు కాగా.. ప్రస్తుతం అక్కడ జేసీగా ఉన్న నుపూర్ అజయ్ బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్‌గా ఆర్.గోవిందరావు బదిలీపై రానున్నారు. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా కేతన్ గార్గ్ నియమితులయ్యారు.

News July 20, 2024

కోనసీమ: తండ్రిని కొట్టాడని ఫ్రెండ్స్‌తో కలిసి చంపేశాడు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. సీఐ శ్రీధర్ వివరాల ప్రకారం.. ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన నరేశ్(38)కు మతిస్థిమితం లేదు. తరచూ గొడవ పడుతుంటాడు. ఇంటి వెనుక ఉండే అప్పారావును గతంలో కొట్టగా.. అతడి కొడుకు పోతురాజు నరేశ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 15న పోతురాజు అతడి ఫ్రెండ్స్ రాజు, కె.రాంబాబు, శ్రీను, డి.రాంబాబుతో కలిసి దాడి చేయగా నరేశ్ మృతి చెందాడు.

News July 20, 2024

తూ.గో జిల్లాలో TOP NEWS@ 6PM

image

☞ కడియంలో మహిళతో అసభ్యప్రవర్తన.. అరెస్ట్
☞ పిఠాపురంలో దాడిపై జగన్ స్పందించరా?: వర్మ
☞ 45 గ్రామాలు మునిగే ఛాన్స్: కోనసీమ కలెక్టర్
☞ ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు
☞ తూ.గో జిల్లాలో తీర ప్రాంతాల్లో అలల అలజడి
☞ 10వేల హెక్టార్లలో పంట నష్టం: తూ.గో కలెక్టర్
☞ నిండుకుండలా డొంకరాయి జలాశయం
☞ జాబ్ మేళాతో యువతకు ఉపాధి: మంత్రి సుభాశ్
☞ వైసీపీ నేతలపై దాడులు ఆపాలి: జక్కంపూడి

News July 20, 2024

తూ.గో: వివాహితతో అసభ్యప్రవర్తన.. ఆమె భర్తపై దాడి

image

తూ.గో జిల్లా కడియంలో ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI తులసీధర్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కడియంకు చెందిన చల్లా కొండరాజు అదే ఏరియాకు చెందిన వివాహితతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె భర్తపై దాడి చేశాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు SI నాగ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి కొండరాజును అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు తరలించగా రిమాండ్ విధించింది.

News July 20, 2024

తూ.గో.: నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారుల తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి తూ.గో. జిల్లాలోని పెద్దాపురంలో మాత్రమే నవోదయ విద్యాలయం ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

News July 20, 2024

తూ.గో.: సొంతజిల్లాకు 70 మంది తహశీల్దార్లు

image

ఎన్నికల సందర్భంగా ఉమ్మడి తూ.గో. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన 24 మండలాల పరిధిలోని 70 మంది తహశీల్దార్లు తిరిగి సొంత జిల్లాకు రానున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 70 మంది ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాలకు బదిలీపై వెళ్లారు.

News July 20, 2024

కాకినాడ: సముద్ర తీరంలో రక్షణ గోడ

image

ఉప్పాడ ప్రాంతంలో సముద్ర కోత నుంచి తీరానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాకినాడ వాకలపూడిలోని లైట్‌ హౌస్‌ నుంచి ఉప్పాడ కొత్త హార్బర్‌ ప్రాంతం వరకు కోత ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 14.5 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. సుబ్బంపేట నుంచి హార్బర్‌ వరకు కెరటాల ప్రభావం తగ్గించడానికి గ్రోయల్‌ గట్లు నిర్మించనున్నారు.

News July 20, 2024

టీచర్స్, సిబ్బంది సూళ్లకు రావాలి: డీఈవో

image

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించినట్లు డీఈవో కే.వాసుదేవరావు తెలిపారు. అయితే.. విద్యార్థులకు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నామని, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది యథావిధిగా హాజరు కావాలని ఆయన తెలిపారు.

News July 20, 2024

తూ.గో: ‘పిడుగులు పడతాయ్.. జాగ్రత్త’

image

తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ప్రకటించారు. రాజమండ్రి రూరల్, అనపర్తి, కాకినాడ, కోనసీమ, సామర్లకోట, పెద్దాపురం, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రజల చరవాణిలకు సంక్షిప్త సందేశాలు సైతం వచ్చాయి.