India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గోదావరి నది ఒడ్డున చింతాలమ్మ ఘాట్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నల్లటి చారలు గల షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఇతని వయస్సు సుమారు 50-55 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. మృతుడి వివరాలు తెలిసినవారు వెంటనే III టౌన్ L&O పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సెల్: 9440796532) లేదా సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సెల్: 9490345517)కు తెలపాలని త్రీ టౌన్ సీఐ కోరారు.

తూ.గో. జిల్లాలోని వసతి గృహాల వార్డెన్లు పిల్లల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం స్పష్టం చేశారు. రాజమండ్రిలో బుధవారం ఆమె మాట్లాడారు. పిల్లలను పంపించేటప్పుడు, వారి సంరక్షణకు భద్రతా నిబంధనలు పాటిస్తూ, బంధువుల వివరాలు, తగిన ఆధారాలు నమోదు చేసుకున్న తర్వాతే వారిని పంపించాలని ఆమె ఆదేశించారు.

‘స్త్రీ శక్తి’ పథకం మరింత ముందుకు సాగేందుకు ఆర్టీసీ సిబ్బంది, అద్దె బస్సుల యజమానులు సహకరించాలని డీపీటీఓ వైఎస్ఎన్ మూర్తి కోరారు. బుధవారం రాజమండ్రి కార్యాలయంలో డిపో మేనేజర్లు, అద్దె బస్సుల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. పథకం విజయానికి ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె బస్సుల పాత్ర కూడా ముఖ్యమన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్ణీత సమయంలో గమ్యానికి చేర్చాలని సూచించారు.

ఈ నెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని 96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. 5 నుంచి 17 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జరుగుతుందన్నారు. ఆధార్ రికార్డులు అప్డేట్ చేసుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు, పథకాలు, విద్యా అవకాశాలను పొందగలుగుతారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాగల 24 గంటల్లో వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ తీర మండలాలు, లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక మండలాల్లోని తక్కువ ఎత్తులో ఉన్న గ్రామాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు, అవసరమైతే తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పిఠాపురంలో జరుగుతున్న నేరాలపై దృష్టి సారించకుండా, భీమవరంలో జూదాల కోసం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం హాస్యాస్పదమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. హోం మంత్రి అనిత శాఖనే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అనిత సహనం కోల్పోతే పవన్కు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు.

జాతీయ రహదారి 216ఏపై కడియపులంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా గాజువాక అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (26) మృతి చెందాడు. విజయవాడ నుంచి కారులో వస్తున్న కిరణ్ కుమార్, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రాజమండ్రిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన ‘పోలీస్ కమేమరేషన్ డే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కందుల అన్నారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 21న (మంగళవారం) పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శాంతియుత సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వారి త్యాగనిరతి అద్భుతమని ఆయన కొనియాడారు.

తాళ్లపూడి మండల వ్యాప్తంగా చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిలో చికెన్ కిలో రూ.200 – 220 మధ్య విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ.600, మేక మాంసం కిలో రూ.800 వద్ద అమ్మకాలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కావడం, స్వామి మాలధారులు పెరగడంతో వచ్చే వారం చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.