EastGodavari

News August 5, 2025

రాజమండ్రి: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి

image

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సీఎం చంద్రబాబు ఎంపీని అక్రమంగా అరెస్టు చేయించారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వంగా గీత తదితరులు పాల్గొన్నారు.

News August 5, 2025

ఆగస్టు 12న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం: కలెక్టర్

image

జిల్లాలో ఆగస్టు 12న నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె గోడపత్రికను ఆవిష్కరించారు. 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా అల్బెండజోల్ మాత్రలు అందిస్తామన్నారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు వస్తాయని ఆమె వివరించారు.

News August 5, 2025

ఆగస్టు15 వేడుకలు దేశభక్తిని ప్రతిబింబించేలా ఉండాలి: కలెక్టర్

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా, దేశభక్తి ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా ప్రభుత్వ శాఖల స్టాల్స్, శకటాల ప్రదర్శన ఉండాలని ఆమె సూచించారు. వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

News August 4, 2025

ఆగస్టు15 వేడుకలు దేశభక్తిని ప్రతిబింబించేలా ఉండాలి: కలెక్టర్

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా, దేశభక్తి ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా ప్రభుత్వ శాఖల స్టాల్స్, శకటాల ప్రదర్శన ఉండాలని ఆమె సూచించారు. వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

News August 4, 2025

రాజమండ్రి: అన్నదాత సుఖీభవ చెల్లింపులపై కలెక్టర్ సమీక్ష

image

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ పి.ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన కింద తొలి విడతలో నిధులు జమకాని రైతుల వివరాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులందరికీ నిధులు అందేలా చూడాలని సూచించారు.

News August 4, 2025

పీజీఆర్‌ఎస్‌లో 35 ఫిర్యాదులు స్వీకరణ: ఎస్పీ

image

రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం (పీజీఆర్‌ఎస్‌)కు వివిధ సమస్యలపై మొత్తం 35 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.

News August 4, 2025

రాజమండ్రి భవన నిర్మాణ అనుమతులు పరిశీలించిన కలెక్టర్

image

రాజమండ్రి నగరంలో భవన నిర్మాణ అనుమతులు (బీఏ), ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) మంజూరు ప్రక్రియను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి పర్యవేక్షించారు. పౌర సేవల్లో పారదర్శకత, సామర్థ్యం పెంచేందుకు ఆమె సోమవారం నగర ప్రణాళిక అధికారులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. దరఖాస్తు ఫైళ్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం అనుమతులు జారీ అవుతున్నాయో లేదో నిర్ధారించుకున్నారు. అధికారులకు తగు సూచనలిచ్చారు.

News August 4, 2025

రాజేమహేంద్రవరం: మధ్యవర్తిత్వం ద్వారానే వివాదాలు పరిష్కారం

image

కుటుంబాలు, కార్యాలయాలు, సమాజంలో వివాదాలు సహజంగా వస్తాయని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని జిల్లా న్యాయమూర్తి గంధం సునీత పేర్కొ న్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టు హాల్లో మధ్యవర్తిత్వంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేరళ మధ్యవర్తిత్వం కేంద్రానికి చెందిన నిపుణులు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. 2023 మధ్యవర్తిత్వ చట్టం గురించి వివరించారు.

News July 10, 2025

రాజమండ్రి: ఆత్మహత్యకు పాల్పడి వ్యక్తి మృతి

image

రాజమహేంద్రవరం ఓల్డ్ రైల్వే క్వార్టర్ సమీపంలో మెట్ల కుమార్ (30) ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం పోలీసులు గుర్తించారు. గత నెల 23న ఇంట్లో బైక్, సెల్‌ఫోన్ వదిలి వెళ్లి, తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు. రైల్వే క్వార్టర్ శివాలయం సమీపంలో అతని మృతదేహం లభించింది. ఆత్మహత్య కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.

News July 10, 2025

చాగల్లు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

చాగల్లుకు చెందిన (59) శ్రీరంగం కృష్ణారావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బుధవారం తెల్లవారుజామున రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం రాత్రి చాగల్లులో కృష్ణారావు మోపెడ్ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఏఎస్ఐ వి.శ్రీనివాసరావు తెలిపారు.