EastGodavari

News April 15, 2025

కోరుకొండలో రోప్‌వే.. ఫలించిన ఎమ్మెల్యే కృషి

image

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కింద నుంచి కొండపై వరకు 0.25 కిలోమీటర్ల మేర రోప్‌వే చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, అన్నవరం దేవస్థానం వారి సమగ్ర ప్రణాళికతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఎంపీకి నేరుగా అందించడం వల్ల నలుగురు మంత్రులు ఆమోదించి 36 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

News April 15, 2025

డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

image

తూ.గో.జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు డ్రోన్‌లతో ప్రత్యేక నిఘాను పటిష్ఠం చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

News April 15, 2025

RJY: మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ

image

తూ.గో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కే.వీ. సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 991 బ్యాచ్‌కు చెందిన ఆయిన ఉమ్మడి తూ.గో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో సీఐ గా, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీగా, రాజమండ్రి  అడిషనల్ డీఎస్పీగా, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా, పరవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఎపీ పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు, బదిలీపై ఇక్కడికి వచ్చారు.

News April 14, 2025

విజ్జేశ్వరం: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు గల్లంతు

image

సీతంపేట సమీపంలోని విజ్జేశ్వరం – మద్దూరు లంక బ్యారేజ్ దగ్గర సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నిడదవోలుకు చెందిన మత్తి ప్రకాష్ కుమార్ (15), రాజమండ్రికి చెందిన గంధం హర్ష (20) నదిలో గల్లంతయ్యారని విషయం తెలుసుకొని ఎన్డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్,ఎస్పీలతో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

News April 14, 2025

కోరుకొండ కొండపై నుంచి రోప్‌వేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఐదు ప్రాంతాల్లో రోప్‌వేలకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసే వాటిలో కోరుకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందు నుంచి శిఖరాగ్రం వరకూ 0.25 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అనుమతి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News April 14, 2025

రాజమండ్రి: ప్రజలకు ఎస్పీ సూచనలు

image

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు జయంతి పండగ ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

News April 13, 2025

కోరుకొండ: పొట్ట కూటి కోసం వెళ్లి విగతజీవులుగా మారారు.

image

కోరుకొండ(M) కాపవరంలో నిన్న రైలు మిల్లులో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే వారు పొట్ట కూటి కోసం వెళ్లి విగతజీవులుగా మారారు. ప్రమాదంలో మరణించిన శ్రీరామ్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు రెక్కాడితే కాని డొక్కాడని రైతు కూలీలు. డైలీ రైస్ మిల్లుకు వెళ్లి లారీ నుంచి ధాన్యం బస్తాలు దింపి మిల్లుకు వేస్తుంటారు. కుటుంబంలో పెద్ద దిక్కుకుగా ఉన్నవారు చనిపోవడంతో దిక్కులేని వారయ్యారు.

News April 13, 2025

రాజమండ్రి: స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అభినందించిన డీఐజీ

image

ప్రవీణ్ కుమార్ పగడాల కేసు ఛేదించేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో ఎంతో ప్రతిభ చాటిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని DIG అశోక్ కుమార్ అభినందించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం అనంతరం SIT టీంను డీఐజీ, ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా సన్మానించారు. సుమారు 400కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి కేసును కొలిక్కి తేవడంలో SIT అద్భుత ప్రతిభ చాటిందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.

News April 13, 2025

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గిరిపుత్రిక

image

అల్లూరి జిల్లా పీఎం కోట గ్రామానికి చెందిన కదల నారాయణరెడ్డి, వెంకట లక్ష్మి కుమార్తె హరిచందన ఇంటర్ ఫలితాల్లో 981 మార్కులతో జిల్లాలోనే ఉన్నత స్థానంలో నిలిచింది. వై రామవరంలోని పి. ఎర్రగొండ ఏపీఆర్ కాలేజీ నుంచి ఈ ప్రతిభ కనబరిచింది. గత పదవ తరగతి ఫలితాల్లో కూడా జిల్లాలో టాప్‌లో ఉండడం గమనార్హం. తమ కష్టం ఎంతోమంది గిరిజనులకి ప్రేరణ నిస్తుందని, బంధువులు, గ్రామస్థులు, ఏజెన్సీ వాసులు అభినందనలు తెలిపారు.

News April 12, 2025

రాజమండ్రి: ఇంటర్ స్టేట్ టాపర్లను అభినందించిన మంత్రి దుర్గేష్

image

ఇంటర్ ఫలితాలలో స్టేట్ టాప్ ర్యాంక్ లను సాధించిన విజేతలను మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. రాజమండ్రిలో శనివారం జరిగిన కార్యక్రమంలో తన అంధత్వాన్ని ఎదురించి హెచ్ఇసీ సోషల్ స్టడీస్ లో 955 /1000 మార్కులు సాధించిన షేక్ ఫర్జానాను ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక అల్కాట్ గార్డెన్స్ లో ఇంటర్ విద్యార్థులను అభినందించారు