India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారం ఒక ఎండార్స్మెంట్ కారదని, అందులో సంబంధించిన ఉత్తర్వులు కచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ఆర్డీవో, తహశీల్దార్లు, మండల సర్వే అధికారులతో సమావేశం అయ్యారు. రెవెన్యూ అర్జీలు, వాటి పరిష్కార విధానం, ఐవీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రతిస్పందన వ్యవస్థపై చర్చించారు.
నల్లజర్ల మండలంలోని కృష్ణం గూడెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదురుగాలులు వీచిన సమయంలో మామిడి చెట్టు కింద ఉన్న వెలగని సత్యనారాయణ అనే వ్యక్తిపై పిడుగు పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
జిల్లా మీదగా 16 వీక్లీ సమ్మర్ స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. 07325 హుబ్లీ– కటీయార్ (బుధ) నడిచే ఈరైలు ఈనెల 9నుంచి 30వ తేదీ వరకు, 07326 కటియార్–హుబ్లీ (శని) నడిచే ఈ రైలు 12 నుంచి మే 3వరకు, 06559 ఎస్ఎంవీటీ బెంగళూరు– నారంగ్ (మంగళ) నడిచే ఈ రైలు ఈనెల 29 వరకు, 06560 నారంగ్ – ఎస్ఎంవీటీ బెంగళూరు (శని) నడిచే ఈనెల 12నుంచి మే 3 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
బిక్కవోలు జగనన్న కాలనీలో నిన్న ఓ యువకుడు గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. నర్సీపట్నానికి చెందిన సూర్యప్రకాశ్ 10వ తరగతి వరకు చదివాడు. కాకినాడ జిల్లా ఉప్పాడలోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తూ బైక్లు దొంగలిస్తున్నాడు. మరోవైపు గంజాయి వ్యాపారానికి తెరలేపాడు. దొంగతనం చేసిన బైకును కె.పెదబయలుకు చెందిన పంతులబాబు అనే వ్యక్తికి ఇచ్చి గంజాయి తీసుకుని బిక్కవోలుకు రాగా పోలీసులకు దొరికాడు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డీఎంహెచ్ఓ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ఎస్.టి హాస్టల్లో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీ లక్ష్మి పాల్గొని మాట్లాడారు. అందరూ ఆహార, శుభ్రత నియమాలు పాటించాలని సూచించారు.
పంచాయతీలకు కార్యదర్శుల లేమి తీరనుంది. గ్రేడ్-5 స్థాయిలోని సచివాలయ ఉద్యోగులకు గ్రేడ్-4 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి తూ.గో జిల్లాలో 211 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది. వారిలో చాలామందిని ఏజెన్సీ గ్రామాలకు, మరి కొంతమందిని తూ.గో, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలుగా నియమించారు. సోమవారం వీరంతా కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శ్రీ అసోసియేషన్ ఆదివారం వెల్లడించింది. ప్రభుత్వం రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో అన్ని ఆసుపత్రుల్లో 3,257 వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. దీనిపై ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంటుందని రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
మనసుకు నచ్చిన మహిళ తనతో ఉండదని అనే విషయాన్ని జీర్ణించకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని వేమగిరి సునీల్ (26) స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసకు మరదలు అయిన సదరు సదరు మహిళను కలిసి ఉందామని అడగాగ ఆంగీకరించకపోవడంతో మనస్థాపం చెంది మృతి చెందాడని ఎస్సై రామకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం నేడు(సోమవారం) కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పీ.ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల అధికారులు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. ఉదయం 10.గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు శనివారం రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. అండర్-15,అండర్ -20 బాలుర బాలికల విభాగంలో నిర్వహిస్తున్న ఈ కుస్తీ పోటీలకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి 350 మంది రెజ్లర్స్ హాజరయ్యారు. ఈ పోటీలను శనివారం జిల్లా ఎస్పీ డీ నరసింహ కిషోర్ ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.