Guntur

News February 23, 2025

ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

image

ఏమ్మెల్సీ ఎన్నికలు సజావుగా కొనసాగేలా ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఏమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు.

News February 22, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

News February 21, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

News February 21, 2025

GNT: బాలికల మిస్సింగ్.. గుర్తించిన పోలీసులు

image

గన్నవరంకు చెందిన 4 మైనర్ విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. కాలేజ్‌కి వెళ్లకుండా షాపింగ్ మా‌ల్‌కి వెళ్లడంతో మందలించారు. దీంతో రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. వెంటనే తల్లిదండ్రులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిడుగురాళ్లలో ఉన్నట్లు గుర్తించి ఇక్కడి పోలీసులకు సమాచామిచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. VJA, GNT మీదుగా ట్రైన్‌లో వస్తుండగా గుర్తించారు.

News February 21, 2025

గుంటూరు: లాడ్జిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

image

సోదరి మృతిని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన రియల్ ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కొత్తపేట స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన రవితేజ (32) రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతని సోదరి కోవిడ్ సమయంలో చనిపోయారు. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో మద్యంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News February 21, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రహదారులపై ప్రమాదానికి కారణం అవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. వాహనాల ప్రమాదాలు జరగకుండా అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గురువారం కలెక్టరేట్‌లో రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, పంచాయితీ, మున్సిపల్, రవాణా శాఖలు సంయుక్తంగా రహదారులను తనిఖీ చేయాలని చెప్పారు.

News February 20, 2025

గుంటూరు జిల్లా టుడే టాప్ న్యూస్

image

★ ANU ఫ్యాకల్టీకి బెస్ట్ టీచర్ అవార్డ్
★ పెన్షన్ల పరిశీలన పారదర్శకంగా జరుగుతుంది: మంత్రి కొండపల్లి
★ గవర్నర్‌ని కలిసిన వైసీపీ శ్రేణులు
★ స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ సతీశ్
★ మాదక ద్రవ్యాలపై నియంత్రణకు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశాలు
★ రేపటి నుంచి జీఎంసీలో ఓటర్ వెరిఫికేషన్ సేవలు
★ పది విద్యార్థులు ఒత్తిడికి గురవ్వొద్దు: DEO

News February 20, 2025

గవర్నర్‌ని కలిసిన వైసీపీ నాయకులు

image

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని నేడు రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్, మాజీ మంత్రులు అంబటి, మేరుగ, వెల్లంపల్లి, కారుమూరు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

News February 20, 2025

మాదక ద్రవ్యాల వినియోగంపై నిఘాను పెంచండి: కలెక్టర్ 

image

మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సంబందిత శాఖలు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. గంజాయి, ఎండీఎం, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలు ఎక్కువుగా 18 నుంచి 24 వయస్సు వారు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగంను అరికట్టేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.

News February 20, 2025

గుంటూరు: NTR స్టేడియం కాంప్లెక్స్‌లో 2 దుకాణాలు సీజ్

image

గుంటూరు నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లో దీర్ఘకాలంగా అద్దె చెల్లించని షాప్‌లను సీజ్ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ లోని షాప్‌లను గురువారం కమిషనర్ పరిశీలించి, సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్‌లోని 5, 6 షాప్‌లను సీజ్ చేయాలని చెప్పారు. దుకాణాల సంఖ్య, బకాయిలు, అద్దె వివరాల నివేదిక ఇవ్వాలన్నారు.