India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఏకైక మహిళగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి నిలిచారు. ఈమె 2024లో వైసీపీ అభ్యర్థి విడదల రజినిపై 51,150 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చెందిన ఆమె.. గుంటూరులో ఆసుపత్రిని నడిపిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మాధవి వివిధ సామాజిక సేవా కార్యకలాపాలలో, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో చురుకుగా పాల్గొంటున్నారు.
దొడ్డపనేని ఇందిర మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె 1937 జనవరి 7న తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నై బిఎస్సి(హోం సైన్స్) లో డిగ్రీ తీసుకున్నారు. తెనాలి నుంచి మూడు సార్లు(1967, 1972, 1978) ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో గుంటూరు జిల్లా పరిషత్కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈమె పేరుతో తెనాలిలో పాఠశాల ఏర్పాటు చేశారు.
కైవారం బాలాంబ 1849లో తెనాలి అంగలకుదురు గ్రామంలో జన్మించారు. సుబ్బన్నసూరి, వెంకమాంబ ఆమె తల్లిదండ్రులు. ఆమెకు సుబ్బన్నతో వివాహం జరిగింది. కొంతకాలానికి ఆయన మరణించాడు. అనంతరం గ్రామంలో అన్నదానం ప్రారంభించారు. క్రమంగా వందలాది మంది భక్తులకు, బాటసారులకు అన్నదానం చేసే స్థాయికి ఎదిగింది. మంగళగిరి తిరునాళ్ల సమయంలో వేలాది మంది యాత్రికులు వీరి సత్రంలో భోజనాలు చేసేవారు. 1926లో అన్నపూర్ణ సత్రం ఏర్పాటు చేశారు.
ఇస్రో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో తెనాలికి చెందిన మహిళ ప్రముఖ పాత్ర పోషించారు. గంగానమ్మపేటకు చెందిన కొత్తమాసు సాయిదివ్య, రఘురామ్ దంపతులు ‘ఎన్ స్పేస్ టెక్నాలజీ’ సంస్థను నిర్వహిస్తున్నారు. కేఎల్యూలో రాడర్ కమ్యూనికేషన్స్లో పీహెచ్డీ చేస్తున్న సాయిదివ్య 2022 నవంబరులో ఇస్రో పంపిన విక్రమ్-ఎస్ ప్రైవేట్ రాకెట్లో ఉంచిన మూడు పేలోడ్లలో ఒక పేలోడ్ను ఈమె తయారు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయింది.
GNT జిల్లా ట్రైనీ IPS అధికారి దీక్ష నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె వెస్ట్ ఢిల్లీకి చెందిన మహిళ. 2016లో UPSC రాసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఉద్యోగం సాధించి పీఎంఓలో పనిచేశారు. 2018లో UPSC CSCలో ఢిల్లీ పోలీసులో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. అక్కడితో ఆగకుండా 2020లో ఐపీఎస్ లో సెలెక్ట్ అయ్యి గుంటూరు జిల్లా పోస్టింగ్కు వచ్చారు. ఇటీవల మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గోగినేని భారతీదేవి గుంటూరు బాపట్ల తాలూకా మాచవరంలో 1908 ఆగస్టు 15న జన్మించింది. తండ్రి వెలగా సుబ్బయ్య. ఈమె స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని కారాగారవాసం అనుభవించింది. 1931లో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం సమయంలో తెనాలిలో 6నెలలు ఆందోళన చేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పోరాడి రాయవెల్లూరు జైలులో ఏడాది ఉంది. జమీందారీ రైతుల ఆందోళనలో దెబ్బలు తింది. అనేక కులాంతర వివాహాలు నిర్వహించింది. 1958-64లో MLCగా పనిచేసింది.
వివాహం తర్వాత కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నత చదువులు చదివి ఆదర్శంగా ఉండే వారు కొందరే ఉంటారు. అందులో మంగళగిరికి చెందిన తాయి లక్ష్మీ పద్మజ ఒకరు. వివాహ సమయానికి ఇంటర్ పూర్తి చేసిన ఆమె.. వివాహం తర్వాత హిందీ పండిత్, B.A, M.B.A, PGD HRM, L.L.B, PGD క్రిమినల్ జస్టిస్, PGD సైబర్ లా చదివారు. గత 12ఏళ్లుగా హైకోర్టులో లాయర్గా విధులు నిర్వహిస్తూ పలు ప్రభుత్వ శాఖలకి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా పని చేశారు.
నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె 1959 ఏప్రిల్ 22న జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం చెన్నైలోనే గడిచింది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్తో పాటు ఫ్రెంచ్ భాషల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. 2004లో బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ గెలిచారు. 2006, 12లో కేంద్ర సహాయమంత్రిగా చేశారు. 2014లో బీజేపీలో చేరగా.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులిగా ఉన్నారు.
గురిజాల రాధారాణి 29 జూన్ 1963లో తెనాలిలో జన్మించింది. ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా వర్సిటీలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అనంతరం ఎల్ఎల్ఎం, పీహెచ్డీ పూర్తి చేసింది. 1989లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి హైదరాబాద్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికైంది. 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై పని చేస్తున్నారు.
పురుషులకంటే తానేమి తక్కువకాదంటూ నిరూపిస్తుంది ఉమ్మడి జిల్లాకి చెందిన ఫొటోగ్రాఫర్ హైమావతి. శ్రీనగర్ కాలనీకి చెందిన ఆమె 16 ఏళ్లుగా వృత్తిలో ఉన్నారు. భర్త చిరుద్యోగి కావడంతో ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె ఈ రంగాన్ని ఎంచుకున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా వెనుకంజ వేయకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి మరి సత్తాను చాటుకుంటున్నారు. 2012లో బాపట్లలో నిర్వహించిన పోటీల్లో హైమావతి 2వ బహుమతి సాధించారు.
Sorry, no posts matched your criteria.