India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శుక్రవారం రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 9 మంది ప్రధానోపాధ్యాయులకు, తత్సమాన కేటగిరీలో 20 మంది స్కూల్ అసిస్టెంట్లకు, 25 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.

గుంటూరు జిల్లా మత్స్య శాఖ అధికారిగా పి.ఎన్.కిరణ్ కుమార్ గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు పొన్నూరు మత్స్య కేంద్రంలో ఎఫ్డీఓ లాబ్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదోన్నతిపై రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ ఉత్తర్వులు మేరకు జిల్లా మత్స్య శాఖ అధికారిగా బాధ్యతలు సేకరించారు. మత్స్య శాఖ అభివృద్ధికి తన వంతు సహాయ సహకరాలను అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా ధూళిపూడిలో జన్మించిన మొదలి నాగభూషణ శర్మ (1935-2019) గొప్ప రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత. తన తండ్రి స్ఫూర్తితో ఎనిమిదేళ్లకే నాటకరంగంలో ప్రవేశించారు. బందరులో చదువుకునే రోజుల్లోనే ‘కన్యాశుల్కం’ నాటకంలో మధురవాణి పాత్రతో గుర్తింపు పొందారు. అమెరికాలో నాటక దర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా, డాక్టరేట్ పొంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. ఆయన 70కి పైగా నాటకాలు రాశారు.

ప్రముఖ రచయిత పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరులో జన్మించారు. గుంటూరు, హిందూ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా 1943 నుంచి పనిచేశారు. నవ్యసాహిత్య పరిషత్తు, ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన కవిగా, కథకునిగా, నాటికాకారుడుగా, విమర్శకుడిగా, సహృదయుడుగా, పాత్రికేయుడిగా, చారిత్రకుడుగా, ఆధ్యాపకుడుగా, బహుముఖ ప్రతిభా ప్రశస్తిని పొందారు.

బ్రాహ్మణకోడూరులో జన్మించిన రామినేని అయ్యన్న చౌదరి, ఒక సంఘసేవకుడు. గుంటూరులో విద్యాభ్యాసం చేసి, కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో గణితంలో పట్టా పొందారు. అనంతరం అమెరికా వెళ్లి, మిన్నసోటా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. అక్కడ ప్రొఫెసర్గా పనిచేసి, ఆ తర్వాత ‘మిన్నసోటా హిందూ సంఘం’ స్థాపించారు. స్వగ్రామంలో ‘సంగీత సాహిత్య, సంస్కృతి నిలయం’ నెలకొల్పి, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్పించారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపక సంఘం నూతన అసోసియేషన్ ఏర్పాటుకు సంబంధించి నిర్వహించే నూటా ఎన్నికలకు ఒక ప్యానల్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారి ఆచార్య ఎస్.మురళీ మోహన్ తెలిపారు. ఆచార్య పి.బ్రహ్మజీరావు అధ్యక్షుడిగా ఉన్న ప్యానల్ మాత్రమే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని. నేడు మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉందని, తర్వాత ఎన్నికల వివరాలు తెలుపుతామన్నారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో జన్మించిన ముదిగొండ విశ్వనాధం (1906-1984), ఒక ప్రముఖ గణితశాస్త్రవేత్త, పండితుడు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేస్తూ చూపు మందగించినా, తన అద్భుతమైన జ్ఞానంతో ఆంగ్లం, గణితం, హిందీ, సంస్కృతం బోధించారు. ఆయన రచించిన ‘పురాణ మీమాంస’ పుస్తకాన్ని అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రశంసించారు. శివపూజలో నిష్ఠ కలిగిన విశ్వనాధం, అపూర్వమైన వ్యక్తిత్వం కలవారు.

ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు తుమ్మల సీతారామమూర్తి గుంటూరు జిల్లా కావూరులో జన్మించారు. తన స్వగ్రామం కావూరులోని తిలక్ జాతీయ పాఠశాలలో 1924 నుంచి 1929 వరకు, 1930 నుంచి 1957 వరకు దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన రచనలకు ఎన్నో అవార్డులతో పాటు, ‘తెనుగు లెంక’, ‘అభినవ తిక్కన’, ‘మహాత్ముని ఆస్థానకవి’ బిరుదులు కూడా ఉన్నాయి.

సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు కొత్త సత్యనారాయణ చౌదరి తెనాలి తాలూకా అమృతలూరులో జన్మించారు. ఆయన నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, అనంతరం పాములపాటి బుచ్చినాయుడు కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించారు. 1930 లోనే భాషా పోషక గ్రంథ మండలి స్థాపించి దాని ద్వారా తన రచనలను ప్రకటించడం ప్రారంబించారు.

గుంటూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ కాళహస్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. బల్ద్విన్ గ్రూప్ చీఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆయనకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక నేషనల్ ఆర్బీ అవార్డు వరించింది. అమెరికాలో ఎంతో ప్రతిభ కనబర్చిన సీఈవోలు, టెక్ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో రాజశేఖర్ (రాజ్) 2025 ఏడాదికిగానూ లార్జ్ కార్పొరేట్ విభాగంలో ఆర్బీ అవార్డును అందుకున్నారు.
Sorry, no posts matched your criteria.