Guntur

News August 1, 2024

గుంటూరు జిల్లా TOP NEWS

image

➤ గుజ్జనగుండ్లలో శుక్రవారం జాబ్ మేళా
➤ రషీద్ హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్
➤ రూ.1,600 కోట్లు బకాయి పెట్టింది జగన్ కాదా.?: మంత్రి లోకేశ్
➤ నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా చేరుతున్న వరద
➤ ఎయిమ్స్‌లో పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
➤ 300ల సెల్ ఫోన్‌లు అందించిన GNT ఎస్పీ
➤ ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం: నారా లోకేశ్
➤ నా మొదటి జీతం ప్రజలకే: MLA మాధవి
➤ మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: లోకేశ్

News August 1, 2024

మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: నారా లోకేశ్

image

నేడు పింఛన్ల పంపిణీలో భాగంగా మడకశిరలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా CPI(M), ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించగా.. మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. కొందరు పోలీసుల తీరు ఇంకా మారలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు.

News August 1, 2024

మంగళగిరిలో పర్యటించిన అమెరికా కౌన్సిల్ జనరల్

image

అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ గురువారం మంగళగిరిలో పర్యటించారు. ‘అపురూపమైన మంగళగిరి చేనేత గురించి తెలుసుకుని నిజంగా ఆనందించాన్నారు. సంప్రదాయాలు, క్లిష్టమైన హస్తకళ, గొప్ప చరిత్ర ప్రతి భాగాన్ని నిజంగా ప్రత్యేకంగా చేస్తాయన్నారు. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని చూడటం అద్భుతమని ట్వీట్ చేశారు.

News August 1, 2024

ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం: నారా లోకేశ్

image

ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు గారు. రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండా’ అని ట్వీట్ చేశారు.

News August 1, 2024

మంగళగిరి: చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

image

మంగళగిరి మండలం, ఎర్రబాలెం చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రబాలెం చెరువులో స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 1, 2024

శ్రీశైలం పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

image

ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు బయల్దేరారు. 10.30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా వెళ్లి.. సాక్షి గణపతి, వీర భద్ర స్వామి, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్నారు. శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి వాయనం సారె సమర్పించనున్నారు.

News August 1, 2024

ఎయిమ్స్‌లో పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఎయిమ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్పించాల్సిన మౌలిక సౌకర్యాల పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఎయిమ్స్‌ డైరక్టర్‌, సీఈఓ ప్రొఫెసర్‌ మధభానందకర్‌, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌తో కలసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎయిమ్స్‌ విస్తరణకు కొలనుకొండలో ఉన్న భూములను పరిశీలించి 15 రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.

News August 1, 2024

వినుకొండ: రషీద్ హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను పోలిసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. జులై 17న పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్‌లో YCP కార్యకర్త రషీద్‌ను జిలాని అనే యువకుడు నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తితో నరికి హత్యచేశాడు. ఈ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్టు చేశారు. బుధవారం మరో ముగ్గురుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు CI సాంబశివరావు తెలిపారు.

News August 1, 2024

బాపట్ల అభివృద్ధిపై నివేదిక తయారు చేయాలి: వెంకట మురళి

image

బాపట్ల జిల్లా అభివృద్ధి భవిష్యత్తు దర్శినిపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. చీరాలలో జిల్లా స్థాయి వైద్యశాల ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపాలన్నారు. అభివృద్ధికి ముఖ్యమైన ఆక్వా పార్క్, నిజాంపట్నం పోర్ట్ విస్తరణపై నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.

News July 31, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

* గుంటూరు జిల్లా కోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి షాక్
* పల్నాడు ఘటనపై పవన్ కళ్యాణ్ వార్నింగ్
* దేశంలో TOP.. మన అమరావతిలో ఓ క్యాంపస్!
* మంగళగిరి TDP ఆఫీసుపై దాడి..ముగ్గురు పోలీసులపై వేటు
* నేటి నుంచి ఆగస్టు 5 వరకు లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు
* భూముల రీసర్వేపై చంద్రబాబు యూటర్న్: అంబటి
* న్యాయం చేయండి.. పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి వినతి
* మాచర్ల: బాంబుల నిల్వ కేసులో మరో వ్యక్తి అరెస్ట్