Guntur

News March 8, 2025

అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఏకైక ఏపీ మహిళ

image

తెనాలికి చెందిన బండ్ల శిరీష ఏపీ నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఏకైక మహిళ. మురళీధర్, అనురాధ దంపతులకు 1987లో శిరీష జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే అమెరికాకు వెళ్లి హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 2021లో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయాణంలో ఆమె పాల్గొన్నారు. దీంతో కల్పనా చావ్లా తర్వాత భారత్లో పుట్టి స్పేస్లో అడుగుపెట్టిన రెండో మహిళగానూ, ఏపీ నుంచి ఏకైక మహిళగా నిలిచారు.

News March 8, 2025

గుంటూరు: మహిళల హక్కుల కోసం పోరాడిన సుబ్బమ్మ

image

మల్లాది సుబ్బమ్మ1924 ఆగస్టు 2న రేపల్లె తాలూకా పాతర్లంకలో జన్మించారు. ఉమ్మడి గుంటూరుకు చెందిన వెంకట రామమ్మూర్తిని వివాహం చేసుకున్నారు. మహిళల హక్కులు, వారి సంక్షేమం కోసం ఆమె అవిశ్రాంతంగా కృషిచేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధంపై ఉద్యమం చేశారు. ఉద్యమకారులకు పెద్దదిక్కుగా ఉండేవారు. ప్రఖ్యాతి గాంచిన పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా అనే పుస్తకం సహా 88 రచనలు చేశారు. 2003లో ఆత్మగౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.

News March 8, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక పునః ప్రారంభం: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి 04/3/25 మంగళవారం ముగియటంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పున ప్రారంభిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. 10/3/25 సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10 గం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా శుక్రవారం తెలియజేశారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించ వలసిందిగా కోరారు.

News March 7, 2025

తాడేపల్లి: టాటా పవర్‌తో నారా లోకేశ్ ఒప్పందం

image

టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఏపీ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టాటా రెన్యువబుల్ ఎనర్జీ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.

News March 7, 2025

పరీక్షా పత్రం లీకేజిపై మంత్రి లోకేశ్  సీరియస్

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షా పత్రం లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందని మంత్రి లోకేశ్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 2.గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఛైల్డ్ డెవలప్‍మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి ముందే లీక్ కావడంపై విచారణ నిర్వహించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 7, 2025

గుంటూరు జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు గుంటూరు నుంచి చిలకలూరిపేట, బాపట్ల, విజయవాడ ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే మహిళలు టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

News March 7, 2025

గుంటూరు: బోరుగడ్డ అనిల్‌కు ఈ నెల 10 వరకు బెయిల్

image

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌కి రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనిల్ తల్లి ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్‌కి ఈ నెల 10 వరకు బెయిల్ దక్కింది. 11వ తేదీన తిరిగి అనిల్ జైలుకు వస్తారని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ తెలిపారు.

News March 7, 2025

GNT: 32 ఏళ్ల క్రితం ఇదే రోజున దారుణ ఘటన

image

32 ఏళ్ల క్రితం ఇదే రోజున పల్నాడులో 23 మందిని చంపేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. 1993 మార్చి 7న HYD-CH.పేట వస్తున్న బస్సులో నరసరావుపేట రైల్వే క్రాసింగ్ వద్ద చలపతిరావు, విజయవర్ధన్‌రావు అనే ఇద్దరు ఎక్కారు. ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించగా బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు.

News March 7, 2025

భూ యజమానుల సమక్షంలో రీ సర్వే చేయాలి: కలెక్టర్

image

భూ యజమానుల సమక్షంలో రీ సర్వే సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం, సిరిపురం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను, మందపాడు గ్రామంలో పంట పొలాల రీ సర్వేను, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న సర్వేలను ఫీల్డ్‌కి వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసు పాల్గొన్నారు.

News March 6, 2025

 టైమ్ లైన్ ప్రకారం పూర్తి చేయాలి: కలెక్టర్

image

శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించిన ల్యాండ్ అక్విజెషన్ పనులు టైమ్ లైన్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులకు సంబంధించిన స్టేక్ హోల్డర్లతో గురువారం కలక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఆర్.అండ్.బి ఎస్.ఈ శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ.. నిర్మాణానికి సంబంధించి టెండర్‌ను శుక్రవారం నాడు విడుదల చేయడం జరుగుతుందన్నారు.