Guntur

News July 31, 2024

మంగళగిరి ఎయిమ్స్‌లో సౌకర్యాలు మెరుగుపరచాలి: కలెక్టర్

image

మంగళగిరి ఎయిమ్స్‌లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఎయిమ్స్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలపై ఆమె బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మోడల్ హాస్పిటల్‌గా తీర్చిదిద్దేందుకు పనులన్నీ వెంటనే పూర్తి చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

News July 31, 2024

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు

image

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురయింది. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. పాల్వాయి గేటులో టీడీపీ ఏజెంట్‌పై దాడి, కారంపూడి సీఐపై దాడి అభియోగాలతో పిన్నెల్లి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా, రెండు కేసుల్లోనూ జడ్జి బెయిల్ నిరాకరించారు. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.

News July 31, 2024

ప్రత్తిపాడు: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ 

image

గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం ప్రత్తిపాడు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్తిపాడులోని ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా రోగులకు వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. 

News July 31, 2024

సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త భేటీ

image

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను సత్కరించారు. అనంతరం విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై ఇద్దరు చర్చించారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై మైఖేల్ క్రేమర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోన్నట్లు సమాచారం. 

News July 31, 2024

మంగళగిరి TDP ఆఫీసుపై దాడి..ముగ్గురు పోలీసులపై వేటు

image

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై గత ప్రభుత్వంలో దాడి జరిగింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట  త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. సీఐ, ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేశారు. అల్లరి మూకల దాడి అరికట్టలేకపోయారని, దాడి తర్వాత కనీస ఆధారాలు సేకరించలేకపోయారని అప్పటి రూరల్ సీఐ భూషణం, ఎస్సైలు లోకేశ్, క్రాంతి కిరణ్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 31, 2024

నేటి నుంచి ఆగస్టు 5 వరకు లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు

image

తాడేపల్లి నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమం బుధవారం నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రద్దు చేసినట్లు మంగళవారం ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగే సమయం, తేదీలను ప్రకటిస్తామని, ప్రజలు సహకరించాలని వారు ఆ ప్రకటనలో కోరారు.

News July 31, 2024

ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి: షర్మిల

image

ఆరోగ్యశ్రీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించినందుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం కొనసాగింపుపై అనుమానాలు కలిగించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వాన్ని నడిపే వారే భాద్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేయొచ్చా? మీ వివేకానికి వదిలేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చకుండా పూర్తిగా నిధులు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

News July 30, 2024

అమరావతి నిర్మాణానికి రూ. 4 లక్షల విరాళం

image

రాజధాని అమరావతి కోసం మధుస్మిత అనే మహిళ మంగళవారం రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధుస్మితను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని CM పిలుపునిచ్చారు.

News July 30, 2024

నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి: డిప్యూటీ సీఎం పవన్

image

వన్య ప్రాణులు, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో అలుగును అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు అధికారులపై దాడి జరిగిన ఘటనపై మంగళవారం ఆయన ఆరా తీశారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News July 30, 2024

పలు శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష

image

గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గిరిజనుల స్థితిగతులు, వారి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, గిరిజన హాస్టల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు గంజాయి కట్టడిపై సీఎం చర్చిస్తున్నారు.