India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యులు కొత్త సచ్చిదానందమూర్తి గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో జన్మించారు.1959లో అమెరికాలోని ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి, తరువాత స్వదేశానికి వచ్చి 1960లో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో, 1963లో బీజింగ్లోని చైనా పీపుల్స్ విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పనిచేశారు. విద్యావిధానంలో సాధించిన ప్రగతికి 1984లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందాయి.

వినుకొండలోని శివయ్య స్థూపం వద్ద తోపుడు బండిపై పడి ఉన్న వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి వద్ద లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతిచెందిన వ్యక్తి గుంటూరు సంగడిగుంటలోని ఐపీడీ కాలనీకి చెందిన వడ్లమూడి రాంబాబు (50) గా నిర్థారించారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తిస్తే వినుకొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.

గుంటూరు జిల్లా పెదపూడిలో జన్మించిన ఉమేశ్ చంద్ర, ఉమ్మడి ఏపీలో ప్రత్యేక పోలీసు అధికారిగా పేరుపొందారు. 1991లో ఐపీఎస్ అధికారిగా ఎంపికైన ఆయన, వరంగల్, కడప, కరీంనగర్ జిల్లాల్లో పనిచేశారు. నక్సలైట్లపై ఉక్కుపాదం మోపి, ప్రజలకు చేరువయ్యేలా “జన జాగృతి” కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనేక మంది నక్సలైట్లను పట్టుకోవడంలో సఫలమయ్యారు. 1999 సెప్టెంబర్ 4న హైదరాబాద్లో నక్సలైట్ల కాల్పుల్లో ఆయన వీరమరణం పొందారు.

డీఆర్డీఏ, వెలుగు, స్వయం సహాయక సంఘాల సమన్వయంతో గుంటూరు జిల్లాలో మహిళల అభ్యున్నతికి బ్యాంకర్లు రుణాలు అందించాలని కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో వర్క్ షాప్లో కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ మహిళా సంఘం రానున్న రోజుల్లో మినీ బ్యాంక్ మాదిరిగా మారాలని ఆకాంక్షించారు. జిల్లాలో 20 వేల సంఘాలు ప్రతియేటా రూ.850 కోట్లు రుణాలు పొందుతున్నాయని చెప్పారు.

సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ సెప్టెంబరు 3, 1893లో ఉమ్మడి గుంటూరు జిల్లా దుర్గిలో జన్మించారు. బాల్యవితంతువైన కనకమ్మ BA ఆంగ్లంలో డిగ్రీ పొంది కొంతకాలం కళాశాలలో పనిచేశారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. అనేక సంస్కృత నాటకాలను ఆంధ్రీకరించారు. వీరి కృషికి గుర్తింపుగా ‘కవితా విశారద’, ‘కవితిలక’ అనే బిరుదులు, కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్నారు.

ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్గవ్ (23) అక్కడికక్కడే మరణించగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి స్థానికులను కంటతడి పెట్టించింది.

తెనాలికి చెందిన శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన వీణ సంగీత ఉత్సవం జరుగనుంది. మూలా నక్షత్రం సందర్భంగా చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఆరోజు సాయంత్రం 5.15 గంటలకు సంగీత ఉత్సవం ప్రారంభమవుతుందని పెనుగొండ శ్రీ వాసవి క్షేత్ర పీఠాధిపతి బాల స్వామీజీ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన 108 మంది వీణ కళాకారులతో తెనాలిలో తొలిసారిగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

గుంటూరు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ, సోషల్ వర్కర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో ఎంపికైన వారికి ఇప్పటికే నియామకాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. రెండో విడత ఎంపిక జాబితాను సిద్ధం చేసి జిల్లా వెబ్సైట్లో ఉంచారు. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు డీఎంహెచ్ కార్యాలయంలో ధ్రువపత్రాలతో హాజరావాలన్నారు.

గుంటూరు జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్దేశించిన 11,049 ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. దేశ వ్యాప్తంగా ఒకే రోజు 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించారని, దీనిలో జిల్లాకు 11,049 ఇళ్లు లక్ష్యంగా ఉన్నాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు మిర్చియార్డులో విషాదం చోటుచేసుకుంది. యార్డులోకి వెళ్తున్న లోడు లారీ చక్రాల కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి శరీరం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.