Guntur

News March 6, 2025

తాడేపల్లిలో వైఎస్సార్‌టీయూసీ క్యాలెండర్‌ ఆవిష్కరణ

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌టీయూసీ క్యాలెండర్‌, డైరీ 2025ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌ రెడ్డి, వైఎస్సార్‌టీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ వై.శ్రీనివాస్‌, విశాఖ జిల్లా అధ్యక్షుడు అనీల్‌కుమార్‌, రాజారెడ్డి ఉన్నారు.

News March 6, 2025

తెనాలి: వేరువేరు ఘటనల్లో ఇద్దరు మృతి 

image

తెనాలి రైల్వేస్టేషన్లో బుధవారం సుమారు 60 ఏళ్ల మహిళ ప్లాట్‌ఫారం చివర పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో మరణించింది. ఆమె వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో తిరుమల ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సుమారు 50ఏళ్ల వ్యక్తి తెనాలి శివారు యడ్ల లింగయ్య కాలనీ రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

News March 6, 2025

వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. బుధవారం మంత్రి సంధ్యారాణి మహిళా దినోత్సవ వేడుకలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మహిళా రక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలను స్టాల్స్ రూపంలో అన్ని శాఖల వారు ఏర్పాటు చేయాలన్నారు.

News March 6, 2025

గుంటూరు: గుడారాల పండుగకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

image

గుంటూరు గుడారాల పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు గుంటూరు డివిజన్ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే గుడారాల పండుగకు ఈనెల 5వ తేదీన ప్రత్యేక రైళ్లు గుంతకల్, రేణిగుంట, విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు చేరుకుంటాయి. తిరిగి 9న బయలు దేరుతుయని రైల్వే అధికారులు తెలిపారు.

News March 4, 2025

EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే: లోకేశ్ 

image

EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే అని మంత్రి లోకేశ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించినా ఒక్క టీడీపీకే సాధ్యమని అన్నారు. ఈ విజయం ఒక చరిత్ర అని అభివర్ణించారు. 

News March 4, 2025

GNT: ‘వాలంటీర్’ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

image

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

News March 4, 2025

గుంటూరు: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సాగిందిలా..

image

ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మొదటి నుండి 9వ రౌండ్ వరకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి రౌండ్-17,194, 2వ-15,627, 3వ-16,722, 4వ-16,236, 5వ-16,916 6వ-17,028, 7వ-16,447 8వ-16,900 9వ రౌండ్-10,087 చొప్పున మొత్తం 1,45,057ఓట్లు వచ్చాయి. అలాగే లక్ష్మణరావుకు మొదటి రౌండ్-7,214, 2వ-6,742, 3వ-7,404, 4వ-7,828, 5వ-7,535, 6వ-6,844, 7వ-7,251, 8వ-7,201, 9వ రౌండ్-4,718 చొప్పున మొత్తం 62,737 ఓట్లు వచ్చాయి

News March 4, 2025

గుంటూరు: తొలి రౌండ్ నుంచే ఆధిక్యం

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మొదటి రౌండ్‌ నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన ఆధిక్యతను చాటుకున్నారు. అందరూ ఆలపాటికి, లక్ష్మణరావుకు మధ్య ఓట్ల వ్యత్యాసం పోటాపోటీగా ఉంటుందని భావించారు. అయితే వీటిని పటాపంచలు చేస్తూ ఆలపాటి ప్రతి రౌండ్‌లోనూ మెజారిటీ పెంచుకుంటూ వెళ్లారు. మొదటి రౌండ్‌లో 17,194 ఓట్లతో మొదలై.. చివరి 9వ రౌండ్ ముగిసేసరికి 1,45,057 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని పొందారు.

News March 4, 2025

GNT: అప్పుడు వెనక్కి తగ్గారు.. ఇప్పుడు విజయం సాధించారు

image

గత అసెంబ్లీ ఎన్నికలలో తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయాలని భావించారు. అయితే జనసేన పార్టీకి టికెట్ కేటాయించడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆలపాటి వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలని కసితో ఆలపాటి MLC ఎన్నికలను సవాల్‌గా తీసుకొని పట్టభద్రుల మద్దతుతో అఖండ విజయం సాధించారు.

News March 4, 2025

GNT: పాము కాటుకు యువకుడు బలి

image

కూలి పనికి వెళ్లిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ జాన్ పదో తరగతి పూర్తి చేశాడు. గుంటూరు(D) అమరావతిలో చేపల పట్టుబడికి ఆదివారం సాయంత్రం 11 మంది గ్రామస్థులతోపాటు మత్స్యకార కూలీగా అతనూ వెళ్లాడు. వీరంతా అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకోవడంతో పాకలో నిద్రపోయారు. నిద్రలో ఉన్న జాన్‌ను విషసర్పం కాటు వేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.