India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు-గుంతకల్లు మధ్య 2వ రైలు మార్గం పనులు 347కి.మీ పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 401 కి.మీ మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ కోసం రూ.3,631 కోట్లు భరిస్తామని ఐదేళ్ళ క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తైతే ఈ మార్గంలో నడిచే రైళ్ళకు గంటన్నర సమయం ఆదా అవుతుందని అంటున్నారు.
అఘోరీ చేతుల్లో నుంచి మంగళగిరి యువతి శ్రీవర్షిణిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. నెల రోజుల క్రితం శ్రీవర్షిణి తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన లేడీ అఘోరీ, మాయమాటలతో ఆమెను వశం చేసుకుని గుజరాత్కు తీసుకెళ్లింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు గుజరాత్ వరకు వెళ్లింది. అక్కడ అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బృందావన్ గార్డెన్స్లో శుక్రవారం సాయంత్రం ఓ ఘటన కలకలం రేపింది. ఆటలాడుకుంటూ వేంకటేశ్వర స్వామి గుడి వద్దకు వచ్చిన ఇద్దరు మైనర్లు పార్కింగ్లో ఉన్న సిటీ బస్సులోకి ఎక్కి ఇంజిన్ ఆయిల్ పోసి నిప్పంటించడంతో బస్సు కాలిపోయింది. మంటలు పక్కనే ఉన్న మరో బస్సును కూడా తాకాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పట్టాభిపురం పోలీసులు, నిప్పంటించిన మైనర్లను గుర్తించారు.
స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి, డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి రజిని, ఆమె మరిది గోపికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. ACB వేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రజిని వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కేసులో రాజకీయ కారణాలు ఉన్నాయని రజని తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, మహేశ్వర రెడ్డి వాదించారు.
కోయంబత్తూరు నుంచి ఉత్తరప్రదేశ్కు వెళ్తున్న రప్తిసాగర్ ఎక్స్ప్రెస్లో యువకుడి మృతి చెందాడు. శుక్రవారం బాపట్ల దగ్గర ఆయన కదలకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు టీసీకి తెలియజేశారు. సమాచారం మేరకు రైలు తెనాలిలో ఆపి అతన్ని కిందకు దించి వైద్య సాయాన్ని అందించగా అప్పటికే మృతిచెందినట్టు తేలింది. 23-25 ఏళ్ల మధ్య వయసున్న అతడి గుర్తింపు తెలియాల్సి ఉంది. జీఆర్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
మంగళగిరి ప్రాంతంలో ప్రవాసాంధ్రుల కోసం భారీ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఏపీఎన్ఆర్టీ సొసైటీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఎన్ఆర్ ఐకాన్’ ప్రాజెక్టుకు సంబంధించి ఫౌండేషన్ పనులకు టెండర్లు పిలిచారు. మొత్తం రూ.600కోట్ల వ్యయంతో 5 ఎకరాల్లో 36 అంతస్తుల రెండు టవర్లు మూడు దశల్లో నిర్మించనున్నారు. నివాస ఫ్లాట్లు, కార్యాలయ స్థలాలు ప్రవాసాంధ్రులకే అందుబాటులో ఉండనున్నాయి.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు కార్యాచరణ ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడిలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో 100 పడకలపైగా ఆస్పత్రులు ఉన్నాయని, మిగిలిన 105 ప్రాంతాల్లో త్వరితంగా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. PPP పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి పరిశ్రమల తరహాలో సబ్సిడీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
నరసరావుపేటలో బాలిక మృతిపై బర్డ్ ఫ్లూ అనుమానాలు తొలగిపోయాయి. ICMR బృందం తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాధినిరోధక శక్తి లోపం, అపరిశుభ్రత, లెప్టోస్పిరోసిస్ వంటి కారణాలే ప్రాణాపాయానికి దారితీశాయని తేలింది. బాలిక నుంచి H5N1 లక్షణాలు కనుగొన్నా, పరిసరాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యాధికారులు అన్నారు.
కలెక్టరేట్లో శుక్రువారం జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సమావేశంలో పాల్గొని వికలాంగుల సంక్షేమం, ట్రాన్స్ జండర్స్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సదరన్ సర్టిఫికెట్లు జీజీహెచ్లో రీ-వెరిఫికేషన్ జరుగుతుందని, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. వికలాంగుల హక్కుల చట్టం 2016, వికలాంగుల సర్టిఫికెట్ల పంపిణీపై సమీక్షించారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల పరిధిలో హరిచంద్ర హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? రాజకీయా కోణమా? అనేది దర్యాప్తు చేస్తున్నారు
Sorry, no posts matched your criteria.