India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసరావుపేటలో బాలిక మృతి కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక వైద్య బృందం గురువారం మంగళగిరి ఎయిమ్స్లో సమావేశమైంది. ఈ బృందంలో ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన నిపుణులు ఉన్నారు. వారు మృత బాలిక రక్త నమూనాలపై సమగ్ర సమాచారం సేకరించారు. అనంతరం దర్యాప్తు కొనసాగించేందుకు గుంటూరు వైద్య కళాశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో వెటర్నరీ డాక్టర్ సహా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉన్నారు.
రైల్వేట్రాక్లపై అనధికార ప్రవేశం, పశువుల సంచారాన్ని అడ్డుకునేందుకు రైల్వే బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొదటగా తెనాలి-గుంటూరు సెక్షన్లో ఈ యాంట్రీ-క్రాష్ బ్యారియర్ / డబ్ల్యూ-బీమ్ స్టీల్ ఫెన్సింగ్ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ టెండర్లు పిలిచి, ఏడాది లోపు ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ నిర్మాణానికి రూ.13.76 కోట్లు వ్యయం కానుంది.
ANU పరిధిలోని 11 బీఈడీ కళాశాలలకు ఎన్సీటీఈ నోటీసులు జారీ చేసింది. గుంటూరు, నరసరావుపేట, రేపల్లె ప్రాంతాల్లోని కళాశాలల పనితీరు అంచనాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. మార్చిలో ప్రశ్నపత్రం లీక్, ప్రయోగ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక రుసుములు వసూలు చేయడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో బీఈడీ కోర్సులో అవకతవకలను సమీక్షించడానికి ఈ నోటీసులు పంపింది.
సీఎం చంద్రబాబును గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా కలిశారు. ఇటీవల తాను తయారుచేసిన ఎయిర్ ట్యాక్సీ గురించి సచివాలయంలో సీఎంను కలిసి వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్ను సీఎం అభినందించారు. ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకి అయిన ఖర్చు వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రెండు సీట్ల సామర్థ్యంతో ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేశానని అభిరామ్ అన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు వెల్లటూరుకు చెందిన చిన్న నరసయ్య, సోమమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. చిన్న కుమారుడు బాదరయ్యకు పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో బాదరయ్యను తిడుతూ ఉండేది. పెళ్లి కావటం లేదనే అసంతృప్తి, తిట్టిందన్న కోపంతో బాదరయ్య తల్లి నిద్రిస్తుండగా రోకలి బండతో కొట్టి చంపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమరావతి రాజధాని ప్రాంతానికి PM మోదీ ఈనెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు SP సతీశ్ గురువారం వెలగపూడి సచివాలయం సమీపంలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మోదీ రాక కోసం మూడు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కార్యక్రమంలో తుళ్లూరు DSP మురళీకృష్ణ, MRO సుజాత, సీఐలు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
అర్హులైన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా సిద్ధమైంది. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్ సైట్లో ఉంచడం జరిగిందని డీఈవో రేణుక చెప్పారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీలోగా తెలపాలని సూచించారు. ఈ మేరకు డీఈవో రేణుక గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పారదర్శకంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ సాగుతుందన్నారు.
గుంటూరు నగరంలోని ఆనందపేటలో రెండు వర్గాల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. పాత కక్షల నేపథ్యంలో హర్షద్ కుటుంబ సభ్యులపై ఫిరోజ్, ఫరోజ్తో పాటు మరికొందరు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ ఖాజాబీ(75) మరణించింది. హర్షద్ తల్లిదండ్రులు షాజహాన్, బాబులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఆ ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ను ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో గురువారం రాత్రికి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ప్రకటనలో తెలిపాడు. అలాగే, జిల్లా పక్కనే ఉండే పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Sorry, no posts matched your criteria.