India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు AC కళాశాలలో గురువారం DSC సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. జిల్లా విద్యాధికారిణి రేణుక వివరాల మేరకు.. అభ్యర్థులు తమ DSC లాగిన్ ద్వారా కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్లో సర్టిఫికెట్లను ముందుగా అప్లోడ్ చేసి, తర్వాతే పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. సంబంధిత ఒరిజినల్స్తో పాటు, మూడు సెట్ల అటెస్టెడ్ కాపీలు, 5 పాస్పోర్ట్ ఫొటోలు, కుల, వికలాంగ ధృవపత్రాలను తీసుకురావాలన్నారు.

గుంటూరు జిల్లాలో బార్ షాపుల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు సాయంత్రం 6 గంటల లోపు ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ డీసీ కె.శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు. అనంతరం 30న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహించి మొత్తం 110 షాపుల కేటాయింపును పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

వట్టిచెరుకూరు, చేబ్రోలు సమీప గ్రామాలలో అమరావతి ORR భూసేకరణ ప్రారంభమైంది. కేంద్రం ఆమోదంతో వెడల్పు 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు పెరిగింది. ఇది అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలిలను రెండు లింక్ రోడ్లతో కలుపుతుంది. అమరావతికి వడ్డాణంలా ఈ రింగ్ రోడ్డు ఏర్పడనుంది. ఓఆర్ఆర్ నిర్మాణ వ్యయం మొత్తం రూ.16,310 కోట్లుగా అంచనా వేశారు.

తెనాలికి చెందిన సినీ మాటల రచయిత, నంది అవార్డు గ్రహీత సాయి మాధవ్ బుర్రా ‘సినీ సంభాషణా శిల్పి’ బిరుదును పొందారు. అమెరికాలోని డల్లాస్లో ఈ నెల 24న తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతినిధులు సాయి మాధవ్ కు ఈ బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. తెనాలిలో కళాకారుల కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే రంగస్థలం నటుడిగా గుర్తింపు పొందారు. RRR సహా పలు సినిమాలకు సంభాషణలు రాసిన సాయి మాధవ్ నంది అవార్డులు కూడా పొందారు.

విద్యార్థులు బాధ్యతాయుతంగా మెలిగితేనే భవిష్యత్ బంగారుమయం అవుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. మంగళవారం వట్టిచెరుకూరు కిట్స్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్, ర్యాగింగ్, మాదకద్రవ్యాల వినియోగంపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను తెరవరాదని సూచించారు. ర్యాగింగ్, డ్రగ్స్ వాడకం జీవితాలను నాశనం చేస్తాయని, చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

కొల్లిపర మండలం అత్తోటలో మంగళవారం దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బొల్లిముంత బుల్లెమ్మ అనే మహిళపై దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. మహిళ ప్రతిఘటించడంతో తలపై దాడి చేసిన ఇద్దరు దుండగులు 16 సవర్ల 8 బంగారు చేతి గాజులు లాక్కుని పరారయ్యారు. దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా తెనాలిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కొల్లిపర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓటరు దరఖాస్తులను మరింత మెరుగ్గా పరిష్కరించే విధానాలపై బూత్ లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి చేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 35.ca మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆమె చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఈ వివరాలు వెల్లడించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకంలో భాగంగా MEPMA మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఐఏఎస్ మూడు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ నిషేధించి వాటి స్థానంలో పర్యావరణంలో కలిసిపోయే బాటిల్స్, కంపోస్టబుల్ ఎరువులు తయారికి అవసరమయ్యే కర్మాగారాలను నెలకొల్పడంలో ఈ సంస్థలు సహకారం అందిస్తుందన్నారు.

వినాయకచవితి అంటేనే పిల్లలకు ఎంతో ప్రత్యేకం. ఒకప్పుడు పిల్లలు తెల్లవారుమున లేచి తలస్నానం చేసి ఇంట్లో వినాయకుడి మండపం అలంకరించేందుకు నాన్నకు సహాయం చేస్తాం. పుస్తకాలకు పసుపుతో ఓం రాసి మంచి మార్కులు రావాలని కోరుకునేవాళ్లం. మనలో కొంతమంది అయితే క్రికెట్ బ్యాట్లు, వీడియో గేమ్లు, బొమ్మలు, సైకిళ్లు, నాన్న వాడే పనిముట్లపై కూడా పసుపు రాసేవాళ్లం. మీకు కూడా ఆ రోజులు గుర్తొస్తున్నాయా అయితే COMMENT చేయండి.

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి CRDA తన కొత్త రాయపూడి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తోంది. ఇది 360° పర్యవేక్షణ, రోడ్లు, భవనాలు, డ్రైనేజీ, పచ్చదనం ట్రాక్ చేయడం వంటి నెలవారీ పురోగతి నివేదికలను రోజువారీగా అందించడం కోసం CCTV కెమెరాలు, డ్రోన్లను ఉపయోగిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు పనుల పురోగతి తెలుసుకునేందుకు మరింత వీలుకానుంది.
Sorry, no posts matched your criteria.