India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినుకొండలో జరిగిన రషీద్ హత్యపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. వినుకొండలో వైసీపీ నాయకుడిని దారుణంగా చంపారని, నిందితుడు జిలానీకి టీడీపీ నేతలలో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వినుకొండ ఘటనను దారి మళ్లీంచేందుకే మదనపల్లి ఇష్యూ తెచ్చారని జగన్ ఆరోపించారు.
వినుకొండలో జూలై 17న వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు జిలానీతో సహా ఇప్పటి వరకు పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో వినుకొండకు చెందిన వారు ఐదుగురు, నరసరావుపేటకు చెందిన ఒకరు, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువకుడు ఉన్నారు. వీరంతా 30 సంవత్సరాల వయస్సు లోపువారే అని సీఐ తెలిపారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 11.30గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ వద్ద ఆయన ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీలో జరుగుతున్న అరాచకాలు, శ్వేత పత్రాల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తోన్న అసత్యాలు ప్రచారాలు సహా పలు అంశాలపై జగన్ మాట్లాడనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు.
గుంటూరు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాలకు యువత బానిస కాకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చెడు అలవాట్లు వల్ల యువత భవిష్యత్ పాడు చేసుకోకుండా ఆటో ద్వారా విస్తృతంగా పబ్లిక్ అనౌన్సింగ్ సిస్టం ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏప్రిల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 2వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ గంగాధరరావు విడుదల చేశారు. ఈ పరీక్షలకు 9792 మంది హాజరు కాగా వారిలో 5670 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రెడ్డి ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.inలో పొందుపరిచినట్లు చెప్పారు.
టాలీవుడ్ హీరో నారా రోహిత్కు మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్. మీలాగే ఈ రోజు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. జీవితంలో మీరు వృద్ధి సాధిస్తూనే ఉండాలి’ అని Xలో పోస్ట్ చేశారు. ఎన్నికల వేళ రోహిత్ పలు జిల్లాలో పర్యటించి టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
విజయవాడలో మంత్రులు, ఎమ్మెల్యేల గౌరవార్థం గురువారం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.
పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య బుధవారం వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై జిల్లాలోని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమచారం. బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలోనూ రోశయ్య జనసేనలోకి వెళ్లడం మంచిదని ఆయన అనుచరులు అభిప్రాయపడ్డారు. మరోవైపు జనసేన అగ్రనేతలతో ఆయన ఇప్పటికే టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది.
పొన్నూరు మాజీ MLA కిలారి రోశయ్య బుధవారం YCPకి రాజీనామా చేస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో గుంటూరు పశ్చిమ టికెట్ తనకు రాకుండా కొందరు అడ్డుకున్నారన్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం పొన్నూరు టికెట్ ఇవ్వాలని కోరినా అధిష్ఠానం పట్టించుకోలేదని చెప్పారు. పార్టీ వ్యతిరేకులకే పదోన్నతులు ఇచ్చారని ఆరోపించారు. ఉమ్మారెడ్డితో చర్చించకుండానే మండలిలో ప్రతిపక్షనేత పదోన్నతి కల్పించారని రోశయ్య అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్గా భార్గవ్ తేజ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన కలెక్టర్ను కలిసి పుప్పగుచ్ఛం అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని చెప్పారు.
Sorry, no posts matched your criteria.