Guntur

News February 25, 2025

పెదకాకాని మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: నాదెండ్ల

image

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగిన విద్యుదాఘాతం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై సోమవారం ఓ ప్రకటనలో మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

News February 25, 2025

కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమర్ధవంతంగా నిర్వహించాలని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మీ ఆదేశించారు. కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, పర్యవేక్షణ అధికారులకు సోమవారం కలెక్టరేట్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో అభ్యర్ధి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక్క ఓటు అధికంగా రావాల్సి ఉందన్నారు. ఓట్లు లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

News February 24, 2025

పోలింగ్ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జడ్పీలో భద్రపర్చిన పోలింగ్ కిట్లను రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం పరిశీలించారు. మెటీరియల్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల సీరియల్ నెంబర్లు వేసి వాటిని పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్దం చేయాలని చెప్పారు. 26 నుంచి ఏసీ కళాశాలలో కిట్ల పంపిణీ కోసం ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని చెప్పారు.

News February 24, 2025

ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తాం: వైఎస్ జగన్

image

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. జగన్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని, టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని అన్నారు.

News February 24, 2025

3 పతకాలతో సత్తాచాటిన పవర్ లిఫ్టర్ చంద్రిక 

image

ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సీనియర్ నేషనల్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టర్ బొలినేని చంద్రిక 84 కేజీల విభాగంలో 3 పతకాలు సాధించింది. పతకాలు సాధించిన చంద్రికను ఆమె కోచ్ నరేంద్ర రాజుని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ వంశీకష్ణ, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అభినందించారు. 

News February 24, 2025

గుంటూరులో 91 శాతం ప్రజెంట్ పోల్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 8,673 మంది అభ్యర్థులు పరీక్షలకు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వారిలో మొదటి పరీక్ష 7,927 మంది రాయగా.. రెండవ పరీక్షకు 7,920 మంది హాజరయ్యారు. మొత్తం 91 శాతం హాజరు పోల్ అయింది. కాగా గ్రూప్‌-2 మెయిన్ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,277 మంది క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు.

News February 24, 2025

నంబూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

image

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్‌హెచ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం.. నంబూరు గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. తమ సిబ్బందితో కలిసి ఆ స్థావరంపై దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకొని రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

News February 23, 2025

ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

image

ఏమ్మెల్సీ ఎన్నికలు సజావుగా కొనసాగేలా ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఏమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు.

News February 22, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

News February 21, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.