Guntur

News July 24, 2024

కిలారి రోశయ్య ఆత్మీయ సమావేశం.. పార్టీ మారే అవకాశం?

image

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. నేడు YCP నేతలంతా జగన్‌తో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన బుధవారం గుంటూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. సమావేశానికి పొన్నూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

News July 24, 2024

సర్టిఫికేషన్‌కు కేంద్రం సహకారం.. రైతులకు ఊరట

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46,736 మంది రైతులు 49,631 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 253 గ్రామాల్లో అనుసరిస్తున్నారు. వీరు పండించే ఉత్పత్తులకు బ్రాండింగ్, నిల్వ, మార్కెటింగ్, సర్టిఫికేషన్‌కు కేంద్రం సహకారం అందిస్తామని ప్రకటించడంతో వేలాది మంది రైతులకు ఊరట లభించింది. ప్రకృతి సేద్యం పెరిగితే పురుగుమందుల, అవశేషాలు లేని ఆహార లభ్యత మెరుగవుతుంది.

News July 24, 2024

గుంటూరు జేసీగా భార్గవ తేజ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా భార్గవ తేజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తనపై నమ్మకంతో జిల్లాకు నియమించిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, అన్ని శాఖలల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు జేసీకి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఈయన కర్నూల్ నగర కమిషనర్‌గా పని చేశారు.

News July 24, 2024

గుంటూరు: సాగు క్లస్టర్లపై కేంద్రం ప్రకటన.. వినియోగదారుల హర్షం

image

కూరగాయల సాగు క్లస్టర్ల ఏర్పాటుపైనా కేంద్రం ప్రకటన చేసింది. ఐతే నారాకోడూరు, మంగళగిరి, బెల్లంకొండ, వినుకొండ, దుగ్గిరాల, కొల్లిపర, బాపట్ల, కర్లపాలెం తదితర ప్రాంతాలకు ప్రోత్సాహం లభించనుంది. దీనివల్ల కూరగాయల సాగుదారులకు లబ్ధి కలగడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకే కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 24, 2024

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన గుంటూరు కలెక్టర్‌

image

ఫిరంగిపురం, రేపూడి గ్రామ మార్కెట్ యార్డులో ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను రెవెన్యూ డివిజన్ అధికారితో కలిసి, కలెక్టర్‌
నాగలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో డిఫెక్టివ్ వీవీప్యాట్లను గోడౌన్ నుంచి బెంగళూరు బెల్ కంపెనీకి రిపేర్ నిమిత్తం ప్రత్యేక భద్రతతో తరలించారు. రాజకీయ పార్టీల నాయకులు, ఫిరంగిపురం తహశీల్దార్ రాఘవేంద్రరావు, అన్ని నియోజక వర్గాల ఎలెక్షన్ డిప్యూటీ తహశీల్దార్‌లు పాల్గొన్నారు.

News July 23, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* పల్నాడు జిల్లాలో వైసీపీ నేతపై దాడి
*బడ్జెట్‌‌పై స్పందించిన నారా లోకేశ్
* బాపట్ల జిల్లా వాసులకు SP హెచ్చరిక
*బడ్జెట్‌పై YS షర్మిల కీలక వ్యాఖ్యలు
* YCP ఎమ్మెల్యేకి మంత్రి లోకేశ్ కౌంటర్
*తాడేపల్లి నుంచి నేడు ఢిల్లీకి వెళ్లిన జగన్
* పల్నాడులో విషాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి
*పల్నాడు: నాగార్జున యాదవ్‌కు 41ఏ నోటీసులు

News July 23, 2024

పల్నాడు: వైసీపీ నేత సాంబిరెడ్డిపై దాడి 

image

పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు గ్రామానికి చెందిన నియోజకవర్గ వైసీపీ నేత ఈదా సాంబిరెడ్డిపై మంగళవారం రాత్రి దాడి జరిగింది. మండల పరిధిలోని ఉంగుటూరు- ఖమ్మంపాడు మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో సాంబిరెడ్డికి రెండు కాళ్ళు రెండు చేతులు విరిగాయి. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రయివేటు హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. 

News July 23, 2024

ఆంధ్రప్రదేశ్‌కి కొత్త సూర్యోదయం: నారా లోకేశ్

image

బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలకు తాను చాలా సంతోషిస్తున్నానని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తమ పోరాటాన్ని గుర్తించి, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల.. హెచ్‌ఆర్‌డీ వంటి ముఖ్యమైన రంగాలను కవర్ చేస్తూ.. ప్రత్యేక, సంపూర్ణ ప్యాకేజీ అందించడం రాష్ట్ర ప్రజలకు చాలా గర్వకారణమని అన్నారు.

News July 23, 2024

బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలి: గుంటూరు కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయరంగం అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్ల జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. యువతను, మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ చెప్పారు.

News July 23, 2024

నిధులు ఇవ్వడం అభినందనీయం: MP లావు

image

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రూ.15 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వటం అభినందనీయమని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మంగళవారం అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశం అనంతరం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.