Guntur

News July 23, 2024

పరుగులు పెట్టనున్న అమరావతి పనులు

image

కేంద్ర బడ్జెట్లో కేటాయింపులతో రాజధాని <<13688307>>అమరావతి<<>>లో పనులు పరుగులు పెట్టనున్నాయి. ఐదేళ్ల తర్వాత అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. అవసరాలను బట్టి నిధులు పెంపు ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో రాజధానిలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కూటమి నేతలు చెబుతున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే రాజధాని పనులు ప్రారంభిచామని, తాజా ప్రకటనతో AP అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

News July 23, 2024

ఆయన పేరు మధుసూధన్ రావు కాదట.. టీడీపీ పోస్ట్

image

అసెంబ్లీ వద్ద వైసీపీ అధినేత <<13680502>>జగన్<<>> సోమవారం పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మధుసూదనరావు అని సంబోధిస్తూ జగన్ మాట్లాడిన వీడియో నిన్న వైరల్ అయింది. కాగా, ఆయన పేరు మధుసూదన్ రావు కాదనే వార్తను టీడీపీ తన అధికారిక ‘X’లో పోస్ట్ చేసింది. ‘ఫేకు జగన్.. మరోసారి బకరా అయ్యారు’ అని అందులో పేర్కొంది.

News July 23, 2024

వైసీపీ ఎమ్మెల్సీకి శాసనమండలిలో విపక్షనేత హోదా

image

ఎమ్మెల్సీ అప్పిరెడ్డి జగన్ ప్రభుత్వం హయాంలో సాధారణ ఎమ్మెల్సీ, YCP కార్యాలయ కార్యదర్శిగా ఉన్నారు. మాజీ సీఎం జగన్‌తో పోల్చుకుంటే అప్పిరెడ్డి స్థాయి చిన్నది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. శాసనమండలిలో అప్పిరెడ్డిని ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో ఆ హోదాకు తగినట్టు అప్పిరెడ్డికి ప్రత్యేక ఛాంబర్, ప్రోటోకాల్, గౌరవం మర్యాదలు లభిస్తాయి. కానీ YCP అధ్యక్షుడు జగన్‌కు మాత్రం ఇవేమీ ఉండవు.

News July 23, 2024

YCPకి మద్దాలి గిరి రాజీనామా.. కారణమేంటి.?

image

గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి YCPకి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనికి గల కారణంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 2019లో TDP నుంచి YCPలో చేరిన ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అదే సమయంలో గిరికి పార్టీ నగర అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించినా, ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరని సమాచారం. త్వరలో రాజకీయ భవిష్యత్తుపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News July 23, 2024

ఈనెల 24, 25 తేదీల్లో స్పేస్ ఎగ్జిబిషన్: పి. శైలజ

image

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో చౌడవరం ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శన (స్పేస్ ఎగ్జి బిషన్) ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ప్రదర్శనలో రాకెట్ నమూనాలు, వివిధ ప్రయోగాలు, లాంచ్ ప్యాడ్ల ప్రదర్శనతోపాటు శాస్త్రవేత్తల ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. 25వ తేదీ ఉదయం విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఉంటుందని తెలిపారు.

News July 23, 2024

నేడు నారా లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు

image

ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేశ్ తాడేపల్లిలోని ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన, ప్రజా దర్బార్ నేడు రద్దు చేసినట్లు లోకేశ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సమయాభావం వలన కార్యక్రమం రద్దు చేశామన్నారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుపుతామన్నారు. ప్రజా దర్బార్‌కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

News July 23, 2024

బాపట్ల: ‘స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు’

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బాపట్ల జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌ను ఆయన పరిశీలించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ సుబ్బారావు, ఆర్డీవో రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

News July 22, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

*వైసీపీకి మాజీ MLA రాజీనామా
*అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఎంట్రీ
*అసెంబ్లీ వద్ద జగన్ ఆగ్రహం
*అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన జగన్
*నరసరావుపేట: 16 బైకులు స్వాధీనం
*వినుకొండ హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
*జగన్‌పై మరోసారి ఫైరైన MLA జీవీ
*నగరం: రూ.60 లక్షలు మాయం
*అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి
*అసెంబ్లీకి పసుపు చొక్కాతో మంత్రి లోకేశ్

News July 22, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

గుంటూరు శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని ఉప్పలపాడు-తగరపాలెం అడ్డరోడ్డు దగ్గర గోపాలకృష్ణ రోడ్డు దాటుతున్నాడు. వేగంగా వచ్చిన లారీ అతణ్ని ఢీకొనడంతో గోపాలకృష్ణ రెండు టైర్లకింద నలిగి అక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పెదకాకాని పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News July 22, 2024

మంగళవారం లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు

image

ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేశ్ తాడేపల్లిలోని ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన, ప్రజా దర్బార్ మంగళవారం రద్దు చేసినట్లు లోకేశ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సమయాభావం వలన కార్యక్రమం రద్దు చేశామన్నారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుపుతామన్నారు. ప్రజా దర్బార్‌కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.