Guntur

News July 22, 2024

నూజివీడు IIIT విద్యార్థులకు మంత్రి లోకేశ్ భరోసా

image

నూజివీడు IIIT విద్యార్థులు పలు సమస్యలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఉన్నత లక్ష్యంతో IIITలో చేరితే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నామని వాపోయారు. నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని, ఉపాధ్యాయులు ల్యాబ్ మార్కుల విషయంలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై స్పందించిన మంత్రి లోకేశ్ సమస్య తన దృష్టికి వచ్చిందని, ఈ సమస్యను పరిష్కరిస్తానని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

News July 22, 2024

50 లక్షల మొక్కలతో మెగా ప్లాంటేషన్: గుంటూరు కలెక్టర్

image

పచ్చదనాన్ని పెంచి వాతావరణ సమతౌల్యం సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ఇందుకోసం 50 లక్షల మొక్కలతో మెగా ప్లాంటేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రక్రియ
వారంలోపు పూర్తి కావాలన్నారు. మెగా ప్లాంటేషన్ నిర్వహణపై సోమవారం అధికారులతో సమీక్షించారు.

News July 22, 2024

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కీటక జనిత, కలుషిత నీటి కారక వ్యాధులు, సీజనల్ వ్యాధులు నివారణ, వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News July 22, 2024

వైసీపీకి మాజీ MLA మద్దాలి గిరి రాజీనామా

image

గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నేడు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను వైసీపీ అధినేత YS
జగన్‌కు అందజేశారు. తమ రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో గుంటూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, మద్దాలి గిరి అనుచరులు ఎవరూ ఫోన్‌లో అందుబాటులో లేరు.

News July 22, 2024

అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి.. లోకేశ్ స్పందన

image

తెనాలి ఐతానగర్‌కు చెందిన వైద్యురాలు హారిక(25) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ఆమె మృతదేహం స్వస్థలం చేరుకునేందుకు సాయం చేయాలని మంత్రి లోకేశ్‌ను పలువురు సోషల్ మీడియాలో కోరారు. దీనిపై మంత్రి స్పందించారు. హారిక మృతి విషయం బాధ కలిగించిందని లోకేశ్ పేర్కొన్నారు. మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ ఎంబసీతో చర్చిస్తుందని వివరించారు.

News July 22, 2024

స్పీకర్‌ను కలిసిన డీజీపీ ద్వారకాతిరుమలరావు

image

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడుని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు డీజీపీ పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు.

News July 22, 2024

పసుపు చొక్కాలో కనిపించిన నారా లోకేశ్

image

మంత్రి నారా లోకేశ్ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సాధారణంగా తెల్ల చొక్కాతో కనిపించే ఆయన ఇవాళ పసుపు చొక్కాలో మెరిశారు. ఆయన లాగే కొందరు పసుపు దుస్తులతో రాగా, మరికొందరు కండువాలతో సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

News July 22, 2024

గుంటూరు: మీ MLA ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారు?

image

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ గళం వినిపించనుండగా.. వారిలో నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరి మీ నియోజకవర్గ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి.

News July 22, 2024

మాచర్ల : పిన్నెల్లి అరెస్టులో జాప్యం.. టీడీపీ శ్రేణుల ప్రశ్నలు

image

ఎన్నికల రోజు, అనంతరం జరిగిన అల్లర్లలో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి, తురక కిశోర్‌లను అరెస్టు చేయడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో తమపై కేసులు పెట్టి ఆగమేఘాల మీద సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. నేడు వీరిని ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు.

News July 22, 2024

నేటి నుంచి పాఠశాలల్లో శిక్షా సప్తాహ్: డీఈవో శైలజ

image

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో జాతీయ విద్యావిధానం (ఎన్ఐపీ) 2020లో భాగంగా సోమవారం నుంచి 28వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ఎన్ఐపీలో భాగంగా పరివర్తనాత్మక సంస్కరణలు, దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధి చేయడంలో నిబద్ధతను తెలియజేయడమే కార్యక్రమం ఉద్దేశం అన్నారు.