Guntur

News August 23, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ భార్యను రైలు కిందకు తోసేసిన భర్త
☞ గణేశ్ మండపాలు ఏర్పాటుకు అనుమతులు ఇలా తీసుకోండి: SP
☞ GNT: ప్రైవేట్ ఆసుపత్రులకు డీఎంహెచ్వో నోటీసులు
☞ గుంటూరు జిల్లాకు 5.85 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు
☞ తెనాలి: వృద్ధుని హత్య కేసులో నిందితుడి అరెస్ట్
☞ ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగులు కీలకం: RTC MD 
☞ మంగళగిరి: భక్తులతో కిక్కిరిసిపోయిన మంగళగిరి క్షేత్రం
☞ తాడేపల్లిలో ఆటో డ్రైవర్ల ఆందోళన

News August 22, 2025

GNT: జిల్లాకు 5.85లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు

image

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులు అర్హులైన లబ్దిదారులకు అందించడానికి గుంటూరు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 5,85,615 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందబోతున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రముని తెలిపారు.

News August 22, 2025

గుంటూరు: వరదల వల్ల రూ.70 కోట్ల వరకు నష్టం?

image

గుంటూరు జిల్లాలో ఇటీవల వర్షాలకు పొలాలు చెరువులను తలపించాయి. జిల్లాలోనే 70 వేల ఎకరాల్లో వరి పైర్లు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నాట్లు వేసేందుకు సమయం లేదని, అవకాశం ఉంటే మళ్లీ వెదపద్ధతిలో సాగు చేయాల్సి ఉంటుందని లేదా వేరే సాగు చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే ఎకరాకు రూ.10 వేలు ఖర్చు చేశామని రైతులు వాపోతున్నారు. జిల్లాలో వర్షాల వల్ల సుమారు రూ.70 కోట్ల వరకు పంట నష్టం జరిగినట్లు ఒక అంచనా.

News August 22, 2025

గుంటూరు జిల్లాలో ఎరువుల కొరత లేదు

image

గుంటూరు జిల్లాలో ఎరువులు సంవృద్ధిగా అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఆగస్టు నెలకు యూరియా 7,806 మెట్రిక్ టన్నులు(MT) అవసరం అవ్వగా 11,877 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. DAP 5,785 MTకి 3,756 MT అందుబాటులో ఉన్నాయి. MOP 236 MTకి 757 MT అందుబాటులో ఉన్నాయి. కాంప్లెక్స్ 5,205 MTకి 21,017 MT అందుబాటులో ఉన్నాయి. SSP 1,057 MTకి 1,741 MT అందుబాటులో ఉన్నాయి.

News August 22, 2025

GNT: 1.03 లక్షల ఎకరాల్లో సాగు.. నీటమునిగిన 70 వేల ఎకరాలు

image

గుంటూరు జిల్లాలో మొత్తం 2.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు 1.33 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. అందులో 1.54 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా ఉండగా ఇప్పటికి 1.03 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవల అధిక వర్షాలకు 70 వేల ఎకరాల్లో వరి పైర్లు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వెదపద్ధతిలో సాగు చేసిన ఈ పైరు దెబ్బతినడంతో మళ్లీ పంట వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News August 21, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ కొండవీటి వాగు డ్రోన్ విజువల్స్. 
☞ గంజాయి కేసులో ఇద్దరు గుంటూరు వ్యక్తులు అరెస్ట్.
☞ తెనాలి: యువకుడిని బెదిరించి దారి దోపిడీ.
☞ గంజాయి కేసులో 14 మంది అరెస్ట్.
☞ తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులకే భయం.
☞ మంగళగిరి: మంగళగిరిలో పొల్యూషన్ బోర్డు తనిఖీలు. 
☞ పొన్నూరు: పోలీసుల విచారణకు హాజరైన అంబటి మురళీ. 
☞ డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టాలి: DMHO.

News August 21, 2025

గంజాయి కేసులో ఇద్దరు గుంటూరు వ్యక్తులు అరెస్ట్

image

గంజాయి తరలిస్తూ విశాఖపట్నం (D) కంచరపాలెం పోలీసులకు గుంటూరు(D)కు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. వీరిలో ఓ యువతి కూడా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 12న సుభాష్ నగర్ వద్ద కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి మృతిచెంది. పోలీసులు కారు సీజ్ చేశాక తనిఖీ చేస్తున్న సమయంలో 21 కిలోలు గంజాయి కారులో గుర్తించారు. కేసు నమోదు చేసి గుంటూరు జిల్లాకు చెందిన అక్షయ గౌతమి, బాపట్లకు చెందిన మహమ్మద్ జాకీర్‌ను అరెస్ట్ చేశారు.

News August 21, 2025

తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులకే భయం

image

ప్రజలు సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు, కానీ గుంటూరు జిల్లాలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే ఏకంగా పోలీస్ సిబ్బందే భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ స్టేషన్ పరిధిలో సచివాలయం, హైకోర్టు ఉండటం వల్ల ఇక్కడ విధులు నిర్వహించడం అంటే వెట్టిచాకిరితో సమానమని అంటున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో కేవలం 10% మాత్రమే HRA వస్తుందని, చుట్టుపక్కల స్టేషన్లలో 16% వస్తుందని సిబ్బంది చెబుతున్నారు.

News August 21, 2025

డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టాలి: DMHO

image

గుంటూరు జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐడీల క్రియేషన్‌లో వెనుకబడి ఉన్నాయని DMHO విజయలక్ష్మీ అన్నారు. గురువారం పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆమె సూచించారు.

News August 21, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలు

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 70,000 ఏ/సి మిర్చి సరకు వచ్చింది. వివిధ రకాల ధరలు కిలోకు ఈ విధంగా ఉన్నాయి. తేజా ఏ/సి రూ. 130-150, 341 ఏ/సి రూ. 120-155, నెంబర్ 5 ఏ/సి: రూ. 125-150, యల్లో రకం రూ. 200-240, నాటు 334 రకం రూ. 90-135, నాటు సూపర్ టెన్ రూ. 90-145, తేజా తాలు: రూ. 80-95, అన్ని రకాల తాలు: రూ. 50-75 వరకు పలికాయి. మిగిలిన రకాల ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.