Guntur

News March 27, 2026

GNT: కళల కాణాచి ముద్దుబిడ్డ గుత్తికొండ నరహరి

image

కళలకు పుట్టినిల్లు గుంటూరు జిల్లా.. కళల కాణాచి తెనాలి. ఈ గడ్డపై జన్మించిన గొప్ప మేధావి గుత్తికొండ నరహరి. ఆయన అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. తెలుగు రాజకీయాల్లో అసమాన వక్తగా, రచయితగా, విశ్లేషకుడిగా చెరగని ముద్ర వేశారు. మూఢనమ్మకాలపై పోరాడి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం రేకెత్తించారు. గొప్ప నవ్య మానవవాదిగా పేరొందిన నరహరి వర్ధంతి నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.

News March 27, 2026

GNT: ఉపాధి పనులకు లక్ష్యాలు..!

image

గుంటూరు జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 30 వేల పనిదినాలు సృష్టించాలనే లక్ష్యం పెట్టారు. పనుల ఎంపికలో ఆమోదం పొందిన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఒక్కో గ్రామంలో కనీసం 30 పనులు ఒకేసారి కొనసాగించాలని ఆదేశించారు. ఈ నెల 31లోపు మస్టర్లు ముగించాలని గడువు పెట్టారు. వివరాలు యుక్తధారా పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు.

News March 27, 2026

గుంటూరులో ఆర్టీఈ ప్రవేశాలు పెరుగుదల

image

పేద విద్యార్థులకు ఉచిత విద్య కల్పించే ఆర్టీఈ అమలు వేగం పెరిగింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మొత్తం 2,487 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గుంటూరులోనే 1,708 మందికి అవకాశాలు లభించాయి. లాటరీ విధానంలో పారదర్శకంగా ఎంపిక జరిగింది. ఎంపికైన విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం ఫీజులు భరిస్తుంది. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

News March 27, 2026

గుంటూరులో కాటన్ కన్సార్టియం ఎన్నికల వేడి

image

ఏపీ కాటన్ టీఎంసీ కన్సార్టియం ఎన్నికల సందడి గుంటూరులో మొదలైంది. 15 స్థానాల్లో 9 స్థానాలకు ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు ప్రారంభమవడంతో అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలు ఈసారి పోటీగా మారాయి. పత్తి వ్యాపారంలో కీలకమైన ఈ సంస్థపై ప్యానల్ ఆధిపత్యం కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఏప్రిల్ 6న పోలింగ్ జరగగా, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

News March 27, 2026

గుంటూరులో ఉచిత వృత్తి విద్యా శిక్షణ

image

గుంటూరు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నారు. శిక్షణ తీసుకునే వారికి భోజనం, హాస్టల్ వసతి పూర్తిగా ఉచితం. కోర్సు పూర్తయిన వెంటనే అభ్యర్థులకు ఉచితంగా టూల్ కిట్ కూడా అందజేస్తారు. ఆసక్తి గల వారు సంబంధిత ఆన్‌లైన్ లింక్ ద్వారా తమకు నచ్చిన కోర్సుకు రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

News March 27, 2026

GNT: నేటి నుంచి ఐజేయూ జాతీయ ప్లీనరీ

image

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 27, 28, 29 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కులు గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.

News March 27, 2026

GNT: నేటి నుంచి ఐజేయూ జాతీయ ప్లీనరీ

image

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 27, 28, 29 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కులు గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.

News March 27, 2026

GNT: నేటి నుంచి ఐజేయూ జాతీయ ప్లీనరీ

image

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 27, 28, 29 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కులు గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.

News March 27, 2026

GNT: నేటి నుంచి ఐజేయూ జాతీయ ప్లీనరీ

image

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 27, 28, 29 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కులు గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.

News March 27, 2026

GNT: నేటి నుంచి ఐజేయూ జాతీయ ప్లీనరీ

image

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 27, 28, 29 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కులు గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.