Guntur

News August 21, 2025

ANU: పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్ 2025లో నిర్వహించిన M.SC. ఫారెస్ట్రీ 4వ, ఇంటిగ్రేటెడ్ M.A. పబ్లిక్ పాలసీ సెకండియర్ 4వ, M.B.A.(మీడియా మేనేజ్‌మెంట్) 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News August 21, 2025

GNT: ఐటీఐ సీట్ల భర్తీకి మూడవ విడత అవకాశం

image

గుంటూరు జిల్లాలో ఐటీఐలో చేరదలచిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. ఖాళీగా ఉన్న సీట్లను పూరించేందుకు మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెనాలి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ చిన్న వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరైతేనే సీటు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

News August 21, 2025

గుంటూరు జిల్లాలో దోమల కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా?

image

గుంటూరు జిల్లాలో దోమల నివారణకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రజల సొంత వ్యయమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో దాదాపు 7 లక్షల కుటుంబాలు ఒక్కొక్కటి నెలకు సగటున రూ.100 దోమల నివారణ ఉత్పత్తులపై ఖర్చు చేస్తే, ఏడాదికి సుమారు రూ.100 కోట్ల మేర ప్రైవేటు వ్యయం అవుతోంది.

News August 21, 2025

గుంటూరులో SCT కానిస్టేబుళ్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

గుంటూరు SCT సివిల్, APSP కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు అసలు ధ్రువపత్రాలు, అటెంప్టు చేసిన జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.

News August 21, 2025

గుంటూరు డివిజన్ భవిష్యత్తుపై అనిశ్చితి.?

image

దక్షిణ కోస్తా రైల్వేజోన్ రూప కల్పనలో గుంటూరు డివిజన్ ప్రాధాన్యం కోల్పోతుందన్న ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం ఆదాయాన్ని అందిస్తున్న విష్ణుపురం–పగిడిపల్లి లైన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌కు కేటాయించే యోచనలతో గుంటూరుకు పెద్ద దెబ్బ తగలనుంది. కొత్త సెక్షన్లు జోడించకపోవడం, నియంత్రణ పాయింట్లు గుంటూరుకు దక్కకపోవడం ఆగ్రహానికి దారితీస్తోంది. ప్రజా ప్రతినిధులు ఈ అంశంపై స్పందించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

News August 21, 2025

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి దరఖాస్తు చేస్కోండి: DEO

image

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయఅవార్డులకు అర్హులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీస్, నేరారోపణ అభియోగాలు లేని వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పారు. deo guntur blogspot.com.websiteలో నమూనా దరఖాస్తులు ఉన్నాయని, పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 26లోపు డీఈవో కార్యాలయానికి పంపించాలని సూచించారు.

News August 21, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ GNT: పెళ్లయిన 3వ రోజే నవవధువు ఆత్మహత్య
☞ GNT: గుండెపోటుతో ట్రాఫిక్ ASI మృతి 
☞ నల్లపాడులో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
☞ అర్ధరాత్రి కొండవీటి వాగు పనులు పరిశీలించిన మంత్రి
☞ గుర్తింపు లేని పార్టీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం: కలెక్టర్
☞ మంగళగిరి: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన CM చంద్రబాబు
☞ పొన్నూరు: టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ విమర్శలు
☞ ప్రమాదకరంగా విద్యార్థుల పడవ ప్రయాణం

News August 20, 2025

గుంటూరు: దోమల నివారణకు రూ. 15 వేల ఖర్చు..!

image

నేడు ప్రపంచ దోమల దినోత్సవం. 1897లో సర్ రోనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలిస్ దోమల ద్వారానే మలేరియా వ్యాపిస్తుందని కనుగొన్నారు. గుంటూరు జిల్లాలో దోమల నివారణకు ఒక్కో గ్రామానికి రూ.15 వేలు ఖర్చు చేస్తున్నా, కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలి.

News August 20, 2025

GNT: వరద ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

image

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే కృష్ణా డెల్టా పరిధిలో సుమారు 70 వేల ఎకరాల్లో వరితో పాటు పలు పంటలు దెబ్బతిన్నాయని అంచనా. ఎగువున డ్యాముల నుంచి నీరు విడుదల పెరగడంతో అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర మండలాల్లో పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

News August 20, 2025

GNT: 2nd ఛాన్స్.. నేటితో లాస్ట్

image

ఉచిత విద్యాహక్కు చట్టం-2009 కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ అదనపు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మేలో ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశారు.