India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో జాతీయ విద్యావిధానం (ఎన్ఐపీ) 2020లో భాగంగా సోమవారం నుంచి 28వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ఎన్ఐపీలో భాగంగా పరివర్తనాత్మక సంస్కరణలు, దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధి చేయడంలో నిబద్ధతను తెలియజేయడమే కార్యక్రమం ఉద్దేశం అన్నారు.
తెనాలిలోని ఐతానగర్కు చెందిన వైద్యురాలు హారిక(24) అమెరికాలో పశువైద్య విభాగంలో MS చేస్తున్నారు. గత ఆగస్టులో అక్కడికి వెళ్లిన ఆమె ఆదివారం ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. అసలేం జరిగిందంటే.. హారిక విధుల అనంతరం సహచరులతో కలిసి కారులో ఇంటికి బయల్దేరారు. వీరి వాహనం ముందు బైకు కిందపడటంతో కారు నిలిపేశారు. దీంతో వెనక నుంచి వస్తున్న 3వాహనాలు హారిక కారును ఢీకొనగా, వెనక కూర్చున్న ఆమె మృతిచెందారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావాలని అడిగి తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2014-19లో 25వేల సిమెంట్ రోడ్లు వేశారన్నారు. జగన్ హయాంలో కేంద్ర నిధులు గాలికి వదిలేశారన్నారు. ఏపీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ ఉన్నారని.. గ్రామీణాభివృద్ధికి రాబోయే రోజుల్లో మంచి కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువ వైద్యురాలు మృతిచెందారు. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఐతా నగర్కు చెందిన హారిక పశువైద్యురాలు MS చేయడానికి ఆమె గత ఏడాది ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతిచెందారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ NRIలతో సంప్రదిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం సమష్టిగా పని చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సతీశ్ కుమార్ ఆదివారం సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం ఎస్పీ సీఎంకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నివాసం, అమరావతి రాజధాని ప్రాంతం ఈ జిల్లాలోనే ఉన్నందున నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తామని ఎస్పీ వెల్లడించారు.
రూ. లక్ష కడితే.. 10 లక్షలు చెల్లిస్తామంటూ విజయవాడకు చెందిన ఓ ముఠా గుంటూరుకు చెందిన సరస్వతిని మోసం చేసింది. పోలీసుల వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన నాగరాజు, మరి కొంతమంది రూ.లక్షకు పది లక్షల చొప్పున చెల్లిస్తామంటూ సరస్వతి అనే మహిళని నమ్మబలికారు. దీంతో మహిళ రూ.36 లక్షలు వారికి ఇచ్చింది. చివరికి డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
అమెరికాలో తెనాలికి చెందిన విద్యార్థి స్విమ్మింగ్ పూల్లో జారిపడి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని ఐతా నగర్కి చెందిన రవితేజ ఎంఎస్ చేసేందుకు గత ఏడాది అమెరికా వెళ్లారు. అక్కడి టెక్సస్ రాష్ట్రం ఆస్టిన్లోని విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లిన రవితేజ 8 అడుగుల లోతు ఉన్న పూల్లో కాలు జారిపడి మృతి చెందాడు.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ఆయన్ను రంపచోడవరం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు అధికారిగా నియమించారు. ITDA ప్రాజెక్టు అధికారిగా చేస్తున్న సూరజ్ గనోరే ధనుంజయ్ను పల్నాడు జేసీగా నియమించిన విషయం తెలిసిందే.
గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ఆమెను ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
* 70అడుగుల జలపాతం.. మాచర్ల ఎత్తిపోతల అందాలు
* జగన్ రోడ్లపై తిరిగితే ఏపీకి నష్టం: పెమ్మసాని
* యరపతినేని నా మిత్రుడు: TG సీఎం రేవంత్
* వినుకొండ రషీద్ హత్యలో ట్విస్ట్
* గుంటూరు నగరపాలక సంస్థ చరిత్రలో జులై 20 బ్లాక్ డే: కావటి
* అమరావతి: వర్షం నీటితో రోడ్డు, పొలాలు ఏకం
* నిదానంపాటి అమ్మవారి హుండీ ఆదాయం రూ.19,31,932
* ఫిరంగిపురం: బస్సులో తప్పిపోయిన చిన్నారి
* ANU: 31న పీజీ సెట్ అర్హత పరీక్ష
Sorry, no posts matched your criteria.